బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన పదేళ్ల కెరీర్ లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఈ మధ్యకాలంలో ఆమెకి అవకాశాలు బాగా తగ్గాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ‘భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అనే ప్రాజెక్ట్ ఒక్కటే ఉంది. తాజాగా సోనాక్షి ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ‘హీరా మండి’ అనే పేరుతో ఓ వెబ్ సిరీస్ ను రూపొందించనున్నారు. పాకిస్థాన్ లోని లాహోర్ సిటీలో రెడ్ లైట్ ఏరియా నేపథ్యంలో ఈ సిరీస్ ను తెరకెక్కించనున్నారు.
సెక్స్ వర్కర్స్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనే కాన్సెప్ట్ తో సిరీస్ కొనసాగుతుంది. ఇందులో వేశ్య పాత్రలో నటించడానికి సోనాక్షి సిన్హా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్ లో హ్యూమా ఖురేషీని ఓ లీడ్ వేశ్య రోల్ కోసం ఎంపిక చేసుకున్నారు సంజయ్ లీలా భన్సాలీ. మరో ప్రధాన వేశ్య పాత్ర కోసం సోనాక్షిని సంప్రదించగా.. కథ విన్న వెంటనే ఆమె ఓకే చెప్పేసిందట. కథలో తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో సోనాక్షి అంగీకరించినట్లు తెలుస్తోంది.
వేశ్యగా కనిపించడంతో పాటు కథక్ డాన్సర్ గా కూడా కనిపించాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. దీనికోసం సోనాక్షి కథక్ నేర్చుకునే పనిలో పడ్డారు. గతంలో సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ‘రౌడీ రాథోడ్’ అనే సినిమాలో సోనాక్షి నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. మరి ఈసారి వీరి కాంబినేషన్ ఎలాంటి సక్సెస్ ను తీసుకొస్తుందో చూడాలి. ఈ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసే విధంగా చర్చలు జరుగుతున్నాయి!
This post was last modified on July 8, 2021 10:44 am
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…