బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన పదేళ్ల కెరీర్ లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఈ మధ్యకాలంలో ఆమెకి అవకాశాలు బాగా తగ్గాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ‘భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అనే ప్రాజెక్ట్ ఒక్కటే ఉంది. తాజాగా సోనాక్షి ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ‘హీరా మండి’ అనే పేరుతో ఓ వెబ్ సిరీస్ ను రూపొందించనున్నారు. పాకిస్థాన్ లోని లాహోర్ సిటీలో రెడ్ లైట్ ఏరియా నేపథ్యంలో ఈ సిరీస్ ను తెరకెక్కించనున్నారు.
సెక్స్ వర్కర్స్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనే కాన్సెప్ట్ తో సిరీస్ కొనసాగుతుంది. ఇందులో వేశ్య పాత్రలో నటించడానికి సోనాక్షి సిన్హా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్ లో హ్యూమా ఖురేషీని ఓ లీడ్ వేశ్య రోల్ కోసం ఎంపిక చేసుకున్నారు సంజయ్ లీలా భన్సాలీ. మరో ప్రధాన వేశ్య పాత్ర కోసం సోనాక్షిని సంప్రదించగా.. కథ విన్న వెంటనే ఆమె ఓకే చెప్పేసిందట. కథలో తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో సోనాక్షి అంగీకరించినట్లు తెలుస్తోంది.
వేశ్యగా కనిపించడంతో పాటు కథక్ డాన్సర్ గా కూడా కనిపించాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. దీనికోసం సోనాక్షి కథక్ నేర్చుకునే పనిలో పడ్డారు. గతంలో సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ‘రౌడీ రాథోడ్’ అనే సినిమాలో సోనాక్షి నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. మరి ఈసారి వీరి కాంబినేషన్ ఎలాంటి సక్సెస్ ను తీసుకొస్తుందో చూడాలి. ఈ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసే విధంగా చర్చలు జరుగుతున్నాయి!
దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన నవ నిర్మాణ…
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ది ఎప్పుడూ సాహసోపేత ప్రయాణమే. కెరీర్ ఆరంభంలోనే ‘బాల రామాయణం’తో పెద్ద రిస్క్ చేశారాయన. దర్శకుడిగా తన…
బాలీవుడ్ హీరోయిన్లు పెద్ద పెద్ద బిజినెస్మ్యాన్లను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం మామూలే. కొందరేమో కొన్నేళ్లు రిలేషన్షిప్లు ఉండి ఆర్థిక…
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…