బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన పదేళ్ల కెరీర్ లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఈ మధ్యకాలంలో ఆమెకి అవకాశాలు బాగా తగ్గాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ‘భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అనే ప్రాజెక్ట్ ఒక్కటే ఉంది. తాజాగా సోనాక్షి ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ‘హీరా మండి’ అనే పేరుతో ఓ వెబ్ సిరీస్ ను రూపొందించనున్నారు. పాకిస్థాన్ లోని లాహోర్ సిటీలో రెడ్ లైట్ ఏరియా నేపథ్యంలో ఈ సిరీస్ ను తెరకెక్కించనున్నారు.
సెక్స్ వర్కర్స్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనే కాన్సెప్ట్ తో సిరీస్ కొనసాగుతుంది. ఇందులో వేశ్య పాత్రలో నటించడానికి సోనాక్షి సిన్హా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్ లో హ్యూమా ఖురేషీని ఓ లీడ్ వేశ్య రోల్ కోసం ఎంపిక చేసుకున్నారు సంజయ్ లీలా భన్సాలీ. మరో ప్రధాన వేశ్య పాత్ర కోసం సోనాక్షిని సంప్రదించగా.. కథ విన్న వెంటనే ఆమె ఓకే చెప్పేసిందట. కథలో తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో సోనాక్షి అంగీకరించినట్లు తెలుస్తోంది.
వేశ్యగా కనిపించడంతో పాటు కథక్ డాన్సర్ గా కూడా కనిపించాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. దీనికోసం సోనాక్షి కథక్ నేర్చుకునే పనిలో పడ్డారు. గతంలో సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ‘రౌడీ రాథోడ్’ అనే సినిమాలో సోనాక్షి నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. మరి ఈసారి వీరి కాంబినేషన్ ఎలాంటి సక్సెస్ ను తీసుకొస్తుందో చూడాలి. ఈ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసే విధంగా చర్చలు జరుగుతున్నాయి!
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…