Movie News

వేశ్యగా సోనాక్షి సిన్హా!

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన పదేళ్ల కెరీర్ లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఈ మధ్యకాలంలో ఆమెకి అవకాశాలు బాగా తగ్గాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ‘భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అనే ప్రాజెక్ట్ ఒక్కటే ఉంది. తాజాగా సోనాక్షి ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ‘హీరా మండి’ అనే పేరుతో ఓ వెబ్ సిరీస్ ను రూపొందించనున్నారు. పాకిస్థాన్ లోని లాహోర్ సిటీలో రెడ్ లైట్ ఏరియా నేపథ్యంలో ఈ సిరీస్ ను తెరకెక్కించనున్నారు.

సెక్స్ వర్కర్స్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనే కాన్సెప్ట్ తో సిరీస్ కొనసాగుతుంది. ఇందులో వేశ్య పాత్రలో నటించడానికి సోనాక్షి సిన్హా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్ లో హ్యూమా ఖురేషీని ఓ లీడ్ వేశ్య రోల్ కోసం ఎంపిక చేసుకున్నారు సంజయ్ లీలా భన్సాలీ. మరో ప్రధాన వేశ్య పాత్ర కోసం సోనాక్షిని సంప్రదించగా.. కథ విన్న వెంటనే ఆమె ఓకే చెప్పేసిందట. కథలో తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో సోనాక్షి అంగీకరించినట్లు తెలుస్తోంది.

వేశ్యగా కనిపించడంతో పాటు కథక్ డాన్సర్ గా కూడా కనిపించాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. దీనికోసం సోనాక్షి కథక్ నేర్చుకునే పనిలో పడ్డారు. గతంలో సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ‘రౌడీ రాథోడ్’ అనే సినిమాలో సోనాక్షి నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. మరి ఈసారి వీరి కాంబినేషన్ ఎలాంటి సక్సెస్ ను తీసుకొస్తుందో చూడాలి. ఈ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసే విధంగా చర్చలు జరుగుతున్నాయి!

This post was last modified on July 8, 2021 10:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధ‌ర్ ఇప్పుడు… పవన్ ఎప్పుడో!

దురంధ‌ర్‌.. చాలా ఏళ్ల త‌ర్వాత భార‌తీయ సినిమాలో బాలీవుడ్ త‌లెత్తుకునేలా చేసిన సినిమా. గ‌త ఏడాది ఛావా, సైయారా సినిమాలు…

3 hours ago

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

9 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

10 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

10 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

12 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

13 hours ago