టాలీవుడ్ లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన బండ్ల గణేష్ ఆ తరువాత నిర్మాతగా మారారు. ‘గబ్బర్ సింగ్’, ‘టెంపర్’ లాంటి హిట్ సినిమాలను నిర్మించారు. కొన్నేళ్లుగా సినీ నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు బండ్ల గణేష్. చాలా రోజులుగా తన దేవర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇద్దరు, ముగ్గురు దర్శకులతో చర్చలు కూడా జరుపుతున్నారు బండ్ల గణేష్.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడంతో బండ్ల గణేష్ కి ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. గతేడాది మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో నటుడిగా రీఎంట్రీ ఇచ్చాడు బండ్ల గణేష్. ఇందులో కమెడియన్ గా కాసేపు వెండితెరపై కనిపించి నవ్వించారు. అయితే చాలా రోజులుగా బండ్ల గణేష్ ప్రధాన పాత్రలో సినిమా వస్తుందని వార్తలొస్తున్నాయి. కానీ ఈ వార్తలను ఆయన ఖండిస్తూనే ఉన్నారు.
తాజాగా ఓ కొత్త దర్శకుడు బండ్ల గణేష్ ను హీరోగా పెట్టి సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. చిన్న బడ్జెట్ లో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. వెంకట్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నారు. కథ ప్రకారం.. కాంట్రవర్శియల్ అండ్ ఫన్నీ ఇమేజ్ ఉన్న రోల్ అది. ఈ పాత్రకు బండ్ల గణేష్ సూట్ అవుతారని ఆయన్ని సంప్రదించినట్లు తెలుస్తుంది. దీనిపై అధికార ప్రకటన వస్తుందేమో చూడాలి!
This post was last modified on July 8, 2021 9:38 am
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…