టాలీవుడ్ లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన బండ్ల గణేష్ ఆ తరువాత నిర్మాతగా మారారు. ‘గబ్బర్ సింగ్’, ‘టెంపర్’ లాంటి హిట్ సినిమాలను నిర్మించారు. కొన్నేళ్లుగా సినీ నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు బండ్ల గణేష్. చాలా రోజులుగా తన దేవర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇద్దరు, ముగ్గురు దర్శకులతో చర్చలు కూడా జరుపుతున్నారు బండ్ల గణేష్.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడంతో బండ్ల గణేష్ కి ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. గతేడాది మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో నటుడిగా రీఎంట్రీ ఇచ్చాడు బండ్ల గణేష్. ఇందులో కమెడియన్ గా కాసేపు వెండితెరపై కనిపించి నవ్వించారు. అయితే చాలా రోజులుగా బండ్ల గణేష్ ప్రధాన పాత్రలో సినిమా వస్తుందని వార్తలొస్తున్నాయి. కానీ ఈ వార్తలను ఆయన ఖండిస్తూనే ఉన్నారు.
తాజాగా ఓ కొత్త దర్శకుడు బండ్ల గణేష్ ను హీరోగా పెట్టి సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. చిన్న బడ్జెట్ లో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. వెంకట్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నారు. కథ ప్రకారం.. కాంట్రవర్శియల్ అండ్ ఫన్నీ ఇమేజ్ ఉన్న రోల్ అది. ఈ పాత్రకు బండ్ల గణేష్ సూట్ అవుతారని ఆయన్ని సంప్రదించినట్లు తెలుస్తుంది. దీనిపై అధికార ప్రకటన వస్తుందేమో చూడాలి!
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…