టాలీవుడ్ లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన బండ్ల గణేష్ ఆ తరువాత నిర్మాతగా మారారు. ‘గబ్బర్ సింగ్’, ‘టెంపర్’ లాంటి హిట్ సినిమాలను నిర్మించారు. కొన్నేళ్లుగా సినీ నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు బండ్ల గణేష్. చాలా రోజులుగా తన దేవర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇద్దరు, ముగ్గురు దర్శకులతో చర్చలు కూడా జరుపుతున్నారు బండ్ల గణేష్.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడంతో బండ్ల గణేష్ కి ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. గతేడాది మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో నటుడిగా రీఎంట్రీ ఇచ్చాడు బండ్ల గణేష్. ఇందులో కమెడియన్ గా కాసేపు వెండితెరపై కనిపించి నవ్వించారు. అయితే చాలా రోజులుగా బండ్ల గణేష్ ప్రధాన పాత్రలో సినిమా వస్తుందని వార్తలొస్తున్నాయి. కానీ ఈ వార్తలను ఆయన ఖండిస్తూనే ఉన్నారు.
తాజాగా ఓ కొత్త దర్శకుడు బండ్ల గణేష్ ను హీరోగా పెట్టి సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. చిన్న బడ్జెట్ లో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. వెంకట్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నారు. కథ ప్రకారం.. కాంట్రవర్శియల్ అండ్ ఫన్నీ ఇమేజ్ ఉన్న రోల్ అది. ఈ పాత్రకు బండ్ల గణేష్ సూట్ అవుతారని ఆయన్ని సంప్రదించినట్లు తెలుస్తుంది. దీనిపై అధికార ప్రకటన వస్తుందేమో చూడాలి!
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…