టాలీవుడ్ లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన బండ్ల గణేష్ ఆ తరువాత నిర్మాతగా మారారు. ‘గబ్బర్ సింగ్’, ‘టెంపర్’ లాంటి హిట్ సినిమాలను నిర్మించారు. కొన్నేళ్లుగా సినీ నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు బండ్ల గణేష్. చాలా రోజులుగా తన దేవర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇద్దరు, ముగ్గురు దర్శకులతో చర్చలు కూడా జరుపుతున్నారు బండ్ల గణేష్.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడంతో బండ్ల గణేష్ కి ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. గతేడాది మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో నటుడిగా రీఎంట్రీ ఇచ్చాడు బండ్ల గణేష్. ఇందులో కమెడియన్ గా కాసేపు వెండితెరపై కనిపించి నవ్వించారు. అయితే చాలా రోజులుగా బండ్ల గణేష్ ప్రధాన పాత్రలో సినిమా వస్తుందని వార్తలొస్తున్నాయి. కానీ ఈ వార్తలను ఆయన ఖండిస్తూనే ఉన్నారు.
తాజాగా ఓ కొత్త దర్శకుడు బండ్ల గణేష్ ను హీరోగా పెట్టి సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. చిన్న బడ్జెట్ లో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. వెంకట్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నారు. కథ ప్రకారం.. కాంట్రవర్శియల్ అండ్ ఫన్నీ ఇమేజ్ ఉన్న రోల్ అది. ఈ పాత్రకు బండ్ల గణేష్ సూట్ అవుతారని ఆయన్ని సంప్రదించినట్లు తెలుస్తుంది. దీనిపై అధికార ప్రకటన వస్తుందేమో చూడాలి!
This post was last modified on July 8, 2021 9:38 am
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…