భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల్లో, కథానాయకుల్లో ఒకడైన దిలీప్ కుమార్ ఈ రోజు కన్ను మూశారు. భారతీయ సినిమా ఎదుగుదలలో ఆయన పాత్ర అత్యంత కీలకం. ‘మొఘల్ ఎ అజామ్’ సహా ఎన్నో అద్భుత చిత్రాల్లో అనితర సాధ్యమైన నటనతో ఆకట్టుకున్నారాయన. ఇండియన్ సినిమా తొలి తరం సూపర్ స్టార్లలో ఆయనొకరు. చాలా ఏళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న దిలీప్ కుమార్.. పదుల సార్లు పరిస్థితి విషమించి ఆసుపత్రుల్లో చేరారు. కానీ తన పోరాట పటిమతో బయటికి వచ్చారు.
ఇటీవల మరోసారి ఆసుపత్రిలో చేరగా.. ఎప్పట్లాగే కోలుకుని బయటికి వస్తారనుకున్నారు. కానీ ఈసారి మాత్రం ఆయన ఇక చాలనిపించేశారు. ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. దీంతో భారతీయ సినీ ప్రియులందరూ విషాదంలో మునిగిపోయారు. దిలీప్ కుమార్ కు ఘన నివాళి అర్పిస్తూ ఆయన ఘనతల్ని గుర్తు చేసుకుంటున్నారు.
దిలీప్ సాధించిన ఘనతలకు తోడు.. ఆయన వదులుకున్న ఘనతల్ని కూడా గుర్తు చేసుకోవాల్సిన సమయమిది. ముఖ్యంగా ఆయన ఓ అరుదైన అవకాశాన్ని కాదనుకున్నారు. ఆ అవకాశాన్ని ఆయన అందిపుచ్చుకుని ఉంటే ప్రపంచ స్థాయిలో తన పేరు మార్మోగేదే. 1962లో విడుదలైన హాలీవుడ్ సినిమా ‘లారెన్స్ ఆఫ్ అరేబియా’లో నటించే అవకాశం దిలీప్కు వచ్చింది. ఈ చిత్రానికి డేవిడ్ లీన్ దర్శకుడు. ఆయనకు భారతీయ సినిమాల గురించి, దిలీప్ కుమార్ ప్రతిభ గురించి బాగానే తెలుసు. ఇందులో ప్రిన్స్ షరీఫ్ అలీ పాత్రను దిలీప్కు ఆఫర్ చేశారు.
ఐతే తనకు హాలీవుడ్లో నటించే ఉద్దేశం లేదని దిలీప్ డేవిడ్కు తేల్చి చెప్పేశారు. దీంతో ఆ పాత్రను యూరోపియన్ నటుడికి ఇచ్చాడు డేవిడ్. ఐతే ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో మంచి విజయం సాధించడమే కాక.. ఆ ఏడాది అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో ఏకంగా ఏడు ఆస్కార్లను దక్కించుకుంది. ఈ అవకాశాన్ని చేజిక్కించుకుని ఉంటే హలీవుడ్లో దిలీప్ బిజీ అయిపోయేవాడని అంటుంటారు సన్నిహితులు.
తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…
ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం నాడు హైదరాబాద్ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వాదులను…