Movie News

‘పుష్ప’ రావాల్సిన తేదీకి ఆ భారీ చిత్రం

ఆగస్టు 13వ తేదీ మీద తెలుగు ప్రేక్షకులు భారీ అంచనాలతో ఉన్నారు కొన్ని నెలల ముందు వరకు. ఆ మాటకొస్తే వేరే భాషల వాళ్లను కూడా ఆ తేదీ ఎంతగానో ఆకర్షించింది. అల్లు అర్జున్, సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న బహు భాషా చిత్రం ‘పుష్ప’ ఆ తేదీకే రావాల్సింది. ఈ ఏడాది ఆరంభంలోనే డేట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ గత కొన్ని నెలల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కరోనా మళ్లీ దెబ్బ కొట్టింది. షూటింగ్స్ ఆగిపోయాయి. అదే సమయంలో ‘పుష్ప’ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేసే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీంతో ప్రణాళికలన్నీ మారిపోయాయి.

ఆగస్టు 13న ఈ చిత్రం విడుదల కాదని ముందుగానే నిర్ణయం అయిపోయింది. ఐతే ఇండిపెండెన్స్ డే వీకెండ్లో ప్రతి ఏటా భారీ చిత్రాలు విడుదల కావడం ఆనవాయితీ. గత ఏడాది మాదిరే కరోనా కారణంగా ఈసారి కూడా ఏ భాషలోనూ థియేటర్లలో ఆ వీకెండ్లో పెద్ద సినిమాలు రిలీజ్ చేయలేని పరిస్థితి కనిపిస్తోంది.

ఐతే అప్పటికి థియేటర్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో కానీ.. ఓ బాలీవుడ్ చిత్రాన్ని ఓటీటీలో ఆగస్టు 13న రిలీజ్ చేయడానికి ముహూర్తం పెట్టేశారు. అజయ్ దేవగణ్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హాల క్రేజీ కాంబినేషన్లో అభిషేక్ దుదైయా రూపొందించిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ అగ్ర నిర్మాత భూషణ్ కుమార్ నిర్మించాడు. ఎంతో ఆసక్తికరమైన 1971 ఇండియా-పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కడం విశేషం.

స్వాతంత్ర్యానంతరం భారత దేశ చరిత్రలో 1971 ఇండో-పాక్ యుద్ధం అత్యంత ప్రాధాన్యంతో కూడుకున్నది. ఈ నేపథ్యంలో భారీ తారాగణంతో తెరకెక్కిన సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంది. గత ఏడాది హాట్ స్టార్ వాళ్లు ఒకేసారి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ప్రకటించిన అరడజను చిత్రాల్లో ‘భుజ్’ కూడా ఒకటి. ఆ జాబితాలోని మిగతా చిత్రాలన్నీ ఇప్పటికే విడుదలైపోయాయి. అన్నింట్లోకి అత్యధిక అంచనాలున్న ‘భుజ్’ను ఇప్పుడు, ఆగస్టు 13న రిలీజ్ చేయబోతున్నారు. దీనిపై ఉన్న అంచనాల దృష్ట్యా ఫస్ట్ డే ఓటీటీ వ్యూయర్ షిప్ రికార్డులన్నీ బద్దలవుతాయని అంచనా వేస్తున్నారు.

This post was last modified on July 7, 2021 10:21 am

Share
Show comments

Recent Posts

అసలేం జరుగుతుంది? బాబు సీరియస్

కూట‌మి ప్ర‌భుత్వంలో నామినేటెడ్ ప‌ద‌వుల వ్య‌వ‌హారం.. అంతా సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతోంది. ఇది…

1 hour ago

రూ.1000 పెంచిన బాబుకు మంచి మార్కులు

ప్ర‌తి నెలా 1వ తేదీన ఠంచ‌నుగా అందుతున్న ఎన్టీఆర్ భ‌రోసా సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌ను ప్ర‌భుత్వానికి మంచి మార్కులే వేస్తోంది.…

2 hours ago

Don’t Miss: క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ఫర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్

కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు సోమవారం రాత్రి ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రోడ్డు ప్రమాద బాధితులకు ఎంతో ఉపయుక్తంగా భావిస్తున్న…

3 hours ago

రెండు అడుగుల్లో ‘OG’ మోక్షం… పవన్ సంకల్పం!

హరిహర వీరమల్లు షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేయడంతో ఇప్పుడు అభిమానుల చూపు ఓజి వైపు వెళ్తోంది. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు…

3 hours ago

గాలి పోయింది.. మళ్ళీ జైలుకే

తెలుగు రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు…

4 hours ago

రేవంత్ ప్లాన్ సక్సెస్… ఆర్టీసీ సమ్మె వాయిదా

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రచించిన వ్యూహం ఫలించింది. ఫలితంగా మంగళవారం అర్థరాత్రి నుంచి జరగనున్న ఆర్టీసీ సమ్మె…

4 hours ago