Movie News

ప్రభాస్‌కు ఒక్క ఫోన్ చేస్తే చాలు


‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ఇమేజ్ ఎలా మారిపోయిందో తెలిసిందే. ఈ చిత్రానికి ముందు 50 కోట్ల లోపు మార్కెట్ ఉన్న ప్రభాస్.. ఒకేసారి అలవోకగా 500 కోట్ల బిజినెస్ చేసే స్థాయికి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అతడి చిత్రాల మీద 500 కోట్ల బడ్జెట్ పెట్టేస్తున్నారంటే తన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ‘బాహుబలి’ తర్వాత తిరుగులేని స్థాయిని అందుకున్న ప్రభాస్‌ను మొదటగా డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నది యువ దర్శకుడు సుజీత్.

‘రన్ రాజా రన్’ లాంటి చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన అతను.. ప్రభాస్‌తో ‘సాహో’ లాంటి భారీ చిత్రాన్ని తీసే అవకాశం దక్కించుకున్నాడు. ఐతే ఆ చిత్రానికి తన శక్తికి మించి కష్టపడ్డాడు కానీ.. ఫలితం దక్కలేదు. ‘సాహో’ పెద్ద డిజాస్టర్ అయింది. ఈ ప్రభావం సుజీత్ కెరీర్ మీద బాగానే పడింది. ‘సాహో’ విడుదలై రెండేళ్లవుతున్నా ఇప్పటికీ తన తర్వాతి చిత్రాన్ని మొదలుపెట్టలేదు. హిందీలో ఓ చిత్రం కమిటయ్యాడు కానీ.. అది పట్టాలెక్కడంలో ఆలస్యం జరుగుతోంది.

ఐతే ‘సాహో’ ఫలితం ఎలా ఉన్నప్పటికీ ప్రభాస్‌తో తన రిలేషన్ ఏమాత్రం దెబ్బ తినలేదని అంటున్నాడు సుజీత్. ప్రభాస్‌కు తన మీద నమ్మకం కూడా సడలలేదని అతను చెప్పాడు. తరుణ్ భాస్కర్ నిర్వహించే టాక్ షో సందర్భంగా అతనీ వ్యాఖ్యలు చేశాడు. చాలామందికి ప్రభాస్‌ దగ్గరికి వెళ్లి కథ చెప్పడం చాలా కష్టమైన విషయం అని.. కానీ తనకు మాత్రం ప్రభాస్ ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంటాడని సుజీత్ తెలిపాడు. తాను ఎప్పుడు కాల్ చేసినా ప్రభాస్ స్పందిస్తాడని.. ఇప్పుడు కూడా తాను ఓ కథ చెబితే ప్రభాస్ నో అనడని.. తనపై ప్రభాస్‌కు ఉన్న నమ్మకం అలాంటిదని వ్యాఖ్యానించాడు సుజీత్.

‘సాహో’ తర్వాత సుజీత్ ‘లూసిఫర్’ రీమేక్‌ను డైరెక్ట్ చేయాల్సింది. కానీ అది సాధ్యపడలేదు. ఆ తర్వాత ‘ఛత్రపతి’ హిందీ రీమే‌క్‌ను అతనే తీస్తాడని ప్రచారం సాగింది. అది నిజం కాలేదు. చివరికి జీ స్టూడియోస్ వాళ్లతో ఓ బాలీవుడ్ మూవీ తీయడానికి సుజీత్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రస్తుతం దాని మీదే అతను పని చేస్తున్నాడు.

This post was last modified on July 7, 2021 7:26 am

Share

Recent Posts

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

6 minutes ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

1 hour ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

1 hour ago

బెంగ‌ళూరులో స్ట్రాట‌జిస్టుల‌తో జ‌గ‌న్ భేటీ?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌లువురు కీల‌క రాజకీయ వ్యూహ‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారా?  వ‌చ్చే ఎన్నిక‌లు.. దీనికి ముందు ఆయ‌న చేయ‌నున్న…

2 hours ago

కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్నీ… వదలమంటున్న బొద్దింకలు

ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…

2 hours ago

కలకలం… 140 కోట్ల మందిపై ‘డ్రాగన్’ నిఘా?

అగ్ర దేశాల్లో ఒకటైన చైనా నిత్యం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తూనే ఉంది. భారత్ సహా పలు దేశాలకు స్నేహ…

5 hours ago