Movie News

బాలయ్య చేతిలో అరడజను సినిమాలు!

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఎన్నడూ లేని విధంగా వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. ఆయనకు హిట్ వచ్చినా.. ప్లాప్ వచ్చినా రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి డిమాండ్స్ చేయరు. ఆయనకు కథ నచ్చితే చాలు.. పారితోషికం గురించి పట్టించుకోరు. అందుకే నిర్మాతలు ఆయనతో కలిసి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ‘అఖండ’ సినిమాలో నటిస్తోన్న బాలయ్య చేతిలో మరో అరడజను సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది.

యంగ్ హీరోలకు పోటీగా బాలయ్య వరుస ప్రాజెక్ట్ లు కమిట్ అవ్వడం విశేషం. ‘అఖండ’ పూర్తయిన తరువాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నారు. అలానే దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా ఒప్పుకున్నారు. వీటితో పాటు సి.కళ్యాణ్ తో ఓ ప్రాజెక్ట్ కోసం అడ్వాన్స్ తీసుకున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థలు బాలయ్యకు భారీ అడ్వాన్స్ లు ఇచ్చాయి.

రాజ్ కందుకూరి సైతం బాలయ్య సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల ఆయన బాలయ్యని కలిసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కూడా బాలయ్యతో ఓ సినిమా చేయాలనుకుంటుంది. ఇవి కాకుండా మరికొందరు నిర్మాతలు బాలయ్య డేట్స్ కోసం ఎగబడుతున్నారు. బాలయ్య కమిట్మెంట్ ఇచ్చిన ప్రాజెక్టులకు ఇంకా కథలు సెట్ అవ్వాలి. అందుకే కొత్త సినిమాలేవీ ఒప్పుకోవడం లేదు బాలయ్య. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తి చేయడానికి ఆయనకు మరో మూడేళ్ల సమయం పట్టడం ఖాయం!

This post was last modified on July 7, 2021 7:27 am

Share

Recent Posts

తెలంగాణా బీజేపీలో కారు లొల్లి

తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు…

57 minutes ago

ఓజి యునివర్స్ ఊహించనంత పెద్దగా

ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అభిమానులు ఎదురు చూసిన కీలక అప్డేట్ ఓజి 2.…

2 hours ago

రెండో భాస్కర్ అంత వేగంగా రాగలడా

సోలో హీరోగా దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాతోనూ వంద కోట్లు వసూలు చేయగలడని నిరూపించిన లక్కీ భాస్కర్ కొనసాగింపు…

3 hours ago

ఆ ఆలయాల్లో సెల్ ఫోన్ వినియోగంపై నిషేధం… విజయ్ సంచలనం

తమిళనాడులో నాలుగు నెలల క్రితం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జోసెఫ్ విజయ్ ప్రజానుకూల విధానాలతో ముందుకు సాగుతున్నారు. తమిళనాడులో అనేక…

3 hours ago

నాపై కాదు రేవంత్ పై చర్యలు తీసుకోవాలి: కొండా సురేఖ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు సుస్మిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే,…

3 hours ago

మలేరియా టాబ్లెట్లు మింగి ఒక బాలిక మృతి… 53 మందికి అస్వస్థత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా సరిహద్దుల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలకలం రేగింది. వైద్య సిబ్బంది పంపిణీ చేసిన మలేరియా మాత్రలు మింగిన…

4 hours ago