సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఎన్నడూ లేని విధంగా వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. ఆయనకు హిట్ వచ్చినా.. ప్లాప్ వచ్చినా రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి డిమాండ్స్ చేయరు. ఆయనకు కథ నచ్చితే చాలు.. పారితోషికం గురించి పట్టించుకోరు. అందుకే నిర్మాతలు ఆయనతో కలిసి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ‘అఖండ’ సినిమాలో నటిస్తోన్న బాలయ్య చేతిలో మరో అరడజను సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది.
యంగ్ హీరోలకు పోటీగా బాలయ్య వరుస ప్రాజెక్ట్ లు కమిట్ అవ్వడం విశేషం. ‘అఖండ’ పూర్తయిన తరువాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నారు. అలానే దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా ఒప్పుకున్నారు. వీటితో పాటు సి.కళ్యాణ్ తో ఓ ప్రాజెక్ట్ కోసం అడ్వాన్స్ తీసుకున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థలు బాలయ్యకు భారీ అడ్వాన్స్ లు ఇచ్చాయి.
రాజ్ కందుకూరి సైతం బాలయ్య సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల ఆయన బాలయ్యని కలిసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కూడా బాలయ్యతో ఓ సినిమా చేయాలనుకుంటుంది. ఇవి కాకుండా మరికొందరు నిర్మాతలు బాలయ్య డేట్స్ కోసం ఎగబడుతున్నారు. బాలయ్య కమిట్మెంట్ ఇచ్చిన ప్రాజెక్టులకు ఇంకా కథలు సెట్ అవ్వాలి. అందుకే కొత్త సినిమాలేవీ ఒప్పుకోవడం లేదు బాలయ్య. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తి చేయడానికి ఆయనకు మరో మూడేళ్ల సమయం పట్టడం ఖాయం!
This post was last modified on July 7, 2021 7:27 am
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…