Movie News

సురేష్ బాబు తగ్గేదే లేదు!

లాక్ డౌన్ కారణంగా మూతపడిన థియేటర్లను తిరిగి తెరిచేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. తెలంగాణలో వంద శాతం కెపాసిటీతో, ఏపీలో యాభై శాతం కెపాసిటీతో థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చు. కానీ బిజినెస్ పుంజుకోవడానికి మరింత సమయం పట్టేలా ఉంది. లాక్ డౌన్ సమయంలో నిర్మాతలకు ఓటీటీ బెస్ట్ ఆప్షన్ అయింది. అమెజాన్, హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు భారీ మొత్తాలను ఆఫర్ చేయడంతో నిర్మాతలు కూడా ఓటీటీ రిలీజ్ లకు ఒప్పుకున్నారు.

దీంతో రీసెంట్ గా ఎగ్జిబిటర్ల సమావేశం జరిగింది. పెద్ద సినిమాలను ఓటీటీలకు అమ్మొద్దని వారు రిక్వెస్ట్ చేశారు. మరి దగ్గుబాటి సురేష్ ఈ రిక్వెస్ట్ ను కన్సిడర్ చేస్తారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయన నిర్మాత మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ కూడా. ఇప్పటికే తను నిర్మించిన ‘దృశ్యం 2’ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి సంబంధించిన డీల్ కూడా క్లోజ్ అయింది.

అలానే వెంకటేష్ నటించిన మరో సినిమా ‘నారప్ప’ను కూడా ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ డీల్ ఇంకా ఫైనల్ కాలేదు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘నారప్ప’ డీల్ ను ఆపేసి థియేటర్ లో సినిమాను రిలీజ్ చేయడానికి సురేష్ బాబు ముందుకొస్తారా..? అనే విషయాన్ని ఆరా తీయగా.. ఆయన మాత్రం థియేటర్ రిలీజ్ కు సముఖంగా లేరని సమాచారం. ‘దృశ్యం 2’, ‘నారప్ప’ సినెమాలను ఓటీటీ వేదికల్లోనే విడుదల చేయాలని సురేష్ బాబు నిర్ణయించుకున్నారట. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని అంటున్నారు.

This post was last modified on July 6, 2021 10:39 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

13 minutes ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

53 minutes ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

1 hour ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

3 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

4 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

5 hours ago