లాక్ డౌన్ కారణంగా మూతపడిన థియేటర్లను తిరిగి తెరిచేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. తెలంగాణలో వంద శాతం కెపాసిటీతో, ఏపీలో యాభై శాతం కెపాసిటీతో థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చు. కానీ బిజినెస్ పుంజుకోవడానికి మరింత సమయం పట్టేలా ఉంది. లాక్ డౌన్ సమయంలో నిర్మాతలకు ఓటీటీ బెస్ట్ ఆప్షన్ అయింది. అమెజాన్, హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు భారీ మొత్తాలను ఆఫర్ చేయడంతో నిర్మాతలు కూడా ఓటీటీ రిలీజ్ లకు ఒప్పుకున్నారు.
దీంతో రీసెంట్ గా ఎగ్జిబిటర్ల సమావేశం జరిగింది. పెద్ద సినిమాలను ఓటీటీలకు అమ్మొద్దని వారు రిక్వెస్ట్ చేశారు. మరి దగ్గుబాటి సురేష్ ఈ రిక్వెస్ట్ ను కన్సిడర్ చేస్తారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయన నిర్మాత మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ కూడా. ఇప్పటికే తను నిర్మించిన ‘దృశ్యం 2’ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి సంబంధించిన డీల్ కూడా క్లోజ్ అయింది.
అలానే వెంకటేష్ నటించిన మరో సినిమా ‘నారప్ప’ను కూడా ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ డీల్ ఇంకా ఫైనల్ కాలేదు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘నారప్ప’ డీల్ ను ఆపేసి థియేటర్ లో సినిమాను రిలీజ్ చేయడానికి సురేష్ బాబు ముందుకొస్తారా..? అనే విషయాన్ని ఆరా తీయగా.. ఆయన మాత్రం థియేటర్ రిలీజ్ కు సముఖంగా లేరని సమాచారం. ‘దృశ్యం 2’, ‘నారప్ప’ సినెమాలను ఓటీటీ వేదికల్లోనే విడుదల చేయాలని సురేష్ బాబు నిర్ణయించుకున్నారట. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని అంటున్నారు.
This post was last modified on July 6, 2021 10:39 am
మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 40 ప్లస్ వయసులోనూ ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా, పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న…
తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన స్టార్ హీరో దళపతి విజయ్… ప్రతి అడుగులోనూ తనదైన శైలి ప్రత్యేకతను చాటుతున్నారు.…
కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.…
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఎనిమిది నెలల వ్యవధిలో మూడు సినిమాలు రిలీజవడం ఆయన అభిమానులకు అరుదైన…
కొన్ని నెలలు వెనక్కి వెళ్తే.. ప్రభాస్ సినిమా రాజాసాబ్ గురించి ఆ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్లో కమెడియన్ సప్తగిరి…
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాణ స్వీకార…