ఓ వైపు ‘రాధేశ్యామ్’ చేస్తూనే.. గత ఏడాది కొన్ని నెలల వ్యవధిలో మూడు సినిమాలను ప్రకటించాడు ప్రభాస్. అప్పట్నుంచి ఆ మూడు చిత్రాల పనులూ సమాంతరంగా సాగుతున్నాయి. ప్రభాస్ మొత్తంగా నాలుగు చిత్రాలకు సంబంధించిన పనుల్లోనూ ఏదో రకంగా ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నాడు. ‘రాధేశ్యామ్’ షూటింగ్ పూర్తి చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తూనే.. సలార్, ఆదిపురుష్ చిత్రాలనూ కూడా కొంచెం ముందు వెనుకగా మొదలుపెట్టేశాడు. వీలును బట్టి ఒక్కోదాని షూటింగ్లో పాల్గొంటున్నాడు.
‘రాధేశ్యామ్’ షూటింగ్ రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండగా కరోనా సెకండ్ వేవ్ అడ్డం పడింది. ఇటీవలే చిత్రీకరణ పున:ప్రారంభం కాగా.. ముందుగా ఈ చిత్రానికే డేట్లు కేటాయించాడు రెబల్ స్టార్. మరి కొన్ని రోజుల్లోనే ఆ సినిమా పూర్తవుతుందంటున్నారు. తర్వాత ప్రభాస్ కెమెరాను ఫేస్ చేయబోయేది ‘ఆదిపురుష్’ కోసమే. ఈ సినిమా కోసం భారీ షెడ్యూలే ప్లాన్ చేశారు.
ఐతే ప్రభాస్ రావడానికి ఇంకా టైం పట్టేలా ఉండగా.. ఈలోపే ‘ఆదిపురుష్’ టీం సెట్స్ లోకి అడుగు పెట్టేసింది. ముంబయిలో ఈ రోజు నుంచే ‘ఆదిపురుష్’ కొత్త షెడ్యూల్ మొదలుపెట్టేశారు. దీని గురించి అధికారికంగానే అప్డేట్ బయటికి వచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్కు జోడీగా సీత పాత్ర చేస్తున్న కృతి సనన్ మీద సీన్లు తీస్తున్నాడు ఓం రౌత్. సీన్ నంబర్ 33 అంటూ కృతి మీద తీస్తున్న సన్నివేశానికి సంబంధించిన క్లాప్ బోర్డ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్లాప్ బోర్డ్ చూసి అప్పుడే 32 సీన్లు తీసేసి, 33వ సన్నివేశానికి వెళ్లిపోయారా.. లేక ముందుగా మధ్యలో సీన్లు తీస్తున్నారా అని డిస్కషన్లు పెడుతున్నారు నెటిజన్లు.
మరోవైపు ఓం రౌత్ షూటింగ్కు వెళ్తూ తీసుకున్న సెల్ఫీని కూడా ట్విట్టర్లో షేర్ చేశాడు. ఈ సమాచారంతోనే #Adipurush హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతుండటం విశేషం. ప్రభాస్ వచ్చేలోపు అతను లేని చిన్న చిన్న సీన్లను తీసేసి.. తర్వాత కీలకమైన సన్నివేశాలు తీయబోతున్నాడట ఓం రౌత్. ‘ఆదిపురుష్’ కోసం కొన్ని రోజులు పని చేశాక ప్రభాస్ ‘సలార్’ను కూడా పున:ప్రారంభించబోతున్నాడు.
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…
హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…