గత కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా రేంజ్ అనే ఆలోచనలు ఎక్కువైపోయాయి. అందుకే తెలుగు సినిమాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన నటీనటులను తీసుకుంటున్నారు. ఒకప్పుడు కూడా ఇలా చేసేవారు కానీ ఇప్పుడు కంపల్సరీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో పరభాషా నటీనటులు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు మన నిర్మాతలు. పైగా సినిమాలో వారి క్యారెక్టర్లను కూడా బాగా డిజైన్ చేస్తున్నారు.
ఇప్పుడు మలయాళ హీరో మమ్ముట్టికి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసి టాలీవుడ్ కి తీసుకొస్తున్నారు. అక్కినేని అఖిల్-సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దీనికి ‘ఏజెంట్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇందులో ఓ ప్రధాన పాత్ర కోసం మమ్ముట్టిని సంప్రదించారు. దాని కోసం మమ్ముట్టి రూ.3 కోట్లు డిమాండ్ చేశారట. అంత మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు ఓకే చెప్పేశారు.
మలయాళంలో మమ్ముట్టి పెద్ద స్టార్ హీరో. కానీ ఈ మధ్యకాలంలో ఆయన హవా కాస్త తగ్గింది. ఆయన సినిమాలు పెద్దగా ఆడడం లేదు. ఈ ఏడాది ఆయన నటించిన రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను నిరాశ పరిచాయి. అయినప్పటికీ ఆయనకి మూడు కోట్లు ఇవ్వడానికి ‘ఏజెంట్’ టీమ్ రెడీ అయింది. సురేందర్ రెడ్డి తన సినిమాలను ఎంతో స్టైలిష్ గా తెరకెక్కిస్తుంటారు. మమ్ముట్టి పాత్ర కూడా చాలా క్లాస్ గా ఉంటుందట. కానీ విలన్ రోల్ మాత్రం కాదు. మరి ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి!
This post was last modified on July 3, 2021 3:18 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…