గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. బాలీవుడ్ సినిమాల నుండి హాలీవుడ్ రేంజ్ కి వెళ్లింది. పాపులర్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకొని అమెరికాలోనే సెటిల్ అయిపోయింది. అమెరికన్ సినిమాలు, వెబ్ డ్రామాలు చేస్తూ బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా యాడ్స్, ప్రమోషన్స్ ద్వారా ఇంకా ఎక్కువ సంపాదిస్తుందని తెలుస్తోంది. ప్రియాంక చోప్రాకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.
ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఆమెకి 65 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అందుకే ఆమె షేర్ చేసే ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు ఆ పాపులారిటీని క్యాష్ చేసుకుంటుంది ప్రియాంక. తన అకౌంట్ లో ఏదైనా ఒక కమర్షియల్ యాడ్ కి సంబంధించిన పోస్ట్ పెట్టాలంటే రూ.3 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటుందట. ఒక్క పోస్ట్ కి మూడు కోట్లు అంటే మాములు విషయం కాదు. సాధారణంగా బాలీవుడ్ హీరోయిన్లు తమ అకౌంట్ లో పోస్ట్ లు పెట్టడానికి రూ.8 నుండి రూ.10 లక్షలు తీసుకుంటారు.
వారితో పోలిస్తే ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్ ఎన్నో రెట్లు ఎక్కువ. మొత్తానికి కష్టపడకుండానే ప్రియాంక కోట్లు సంపాదించేస్తుంది. ఈమె కాకుండా ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కొహ్లీ ఒక్కో పోస్ట్ కి రూ.5 కోట్లు తీసుకుంటారట. అలానే ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఒక్కో ఇన్స్టాగ్రామ్ కమర్షియల్ పోస్ట్ కి రూ.11.9 కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
This post was last modified on July 3, 2021 7:43 am
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…