‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీల జనాల్ని, ప్రేక్షకులను ఆకర్షించిన దర్శకుడు ప్రశాంత్ నీల్. టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు కూడా అతడి పట్ల ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిచారు. ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోలు అతడితో పని చేయడానికి ముందుకొచ్చినట్లు వార్తలొచ్చాయి. వీరిలో తారక్ నిజంగానే ప్రశాంత్తో సినిమాను ఓకే చేసుకున్నాడు. ఈ చిత్రం కోసం ప్రశాంత్కు మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. తాను తారక్తో పని చేయబోతున్న విషయాన్ని నిన్న అతడి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే క్రమంలో పరోక్షంగా వెల్లడించాడు ప్రశాంత్. ఐతే నిన్న తారక్ గురించి ప్రశాంత్ ట్వీట్ వేశాడో లేదో.. కన్నడ సినీ అభిమానుల్లో వేడి మొదలైంది. అదే పనిగా ప్రశాంత్ను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలతో ట్వీట్లు వేస్తున్నారు.
ప్రశాంత్కు దర్శకుడిగా అవకాశమిచ్చింది, గుర్తింపు తెచ్చింది కన్నడ సినీ పరిశ్రమ అని.. ఐతే ‘కేజీఎఫ్’తో పేరు రాగానే అతడి దృష్టి టాలీవుడ్ హీరోల మీద పడిందని.. భారీ పారితోషకానికి ఆశపడి ఎన్టీఆర్తో సినిమాకు రెడీ అయిపోయాడని వాళ్లు విమర్శిస్తున్నారు. ఇక్కడ ఎంతోమంది స్టార్లు ఉండగా.. వెంటనే తెలుగులో సినిమా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అంటున్నారు. అతను కన్నడ సినిమాను వాడుకుని వెళ్లిపోతున్నాడని ఆరోపిస్తున్నారు. ఇంతకుముందు రష్మిక మందన్నా కూడా ఇదే పని చేసిందని.. కన్నడ సినిమాలో ఫేమ్ రాగానే టాలీవుడ్ వైపు చూసిందని.. అక్కడ కొంచెం పేరు రాగానే పారితోషకాలకు ఆశపడి అక్కడే సెటిలైపోయిందని గుర్తు చేస్తున్నారు. ఆమెతో ప్రశాంత్ను పోలుస్తూ ఏకిపడేస్తున్నారు. ‘గెటౌట్ ప్రశాంత్ నీల్’ అని హ్యాష్ ట్యాగ్ పెట్టి అతడిని తిట్టిపోస్తున్నారు. ఐతే దీనికి కౌంటర్గా తెలుగు అభిమానులు ‘వెల్కం టు టీఎఫ్ఐ ప్రశాంత్ నీల్’ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్వీట్లు గుప్పిస్తుండటం విశేషం.
This post was last modified on May 21, 2020 8:19 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…