రామాయణం మీద ఇండియాలో వివిధ భాషల్లో చాలా సినిమాలే వచ్చాయి ఇప్పటిదాకా. ఐతే వాటన్నింటినీ తలదన్నేలా భారీ స్థాయిలో రామాయణ గాథకు వెండితెర దూరం ఇవ్వాలని కొన్నేళ్ల కిందట టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్, తెలుగువాడే అయిన బాలీవుడ్ ప్రొడ్యూసర్ మధు మంతెన తలపోశారు.
వీరి నిర్మాణంలో దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్లో రామాయణం మీద సినిమా తెరకెక్కబోతున్నట్లు అధికారిక ప్రకటనే వచ్చింది. కానీ ఆ సినిమా పట్టాలెక్కడంలో ఆలస్యం జరుగుతోంది. మధ్యలో చాలా కాలం పాటు ఈ సినిమా గురించి చప్పుడు లేకపోవడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే ప్రచారం కూడా జరిగింది.
కానీ ఆ ప్రచారాన్ని ఖండిస్తూ మళ్లీ అప్ డేట్స్ ఇస్తున్నారు. ఇందులో కాస్టింగ్ గురించి ఇప్పటికే కొన్ని ఊహాగానాలు నడిచాయి. ఐతే నిర్మాతల్లో ఒకరైన మధు మంతెన తాజాగా తమ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇండియాలో ఇప్పటిదాకా ఎన్నడూ చూడనంత భారీ స్థాయిలో ఈ సినిమాను తీర్చిదిద్దుతామని.. అలాగే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని అత్యంత పెద్ద స్టార్లు ఈ సినిమాలో నటిస్తారని మధు చెప్పాడు. ఈ ఏడాది దీపావళి నాడు తమ రామాయణంలో ముఖ్య పాత్రలు పోషించే నటీనటుల వివరాలు వెల్లడిస్తామని కూడా మధు తెలిపాడు. ఈ చిత్రానికి ఇప్పటికే ప్రి ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్లు వెల్లడించిన మధు.. ఆస్కార్ విన్నింగ్ టెక్నీషియన్లు ఈ ప్రాజెక్టు కోసం పని చేస్తున్నట్లు వెల్లడించాడు.
కాగా ఈ సినిమాకు దర్శకుడిగా ముందు దంగల్ ఫేమ్ నితీశ్ తివారి పేరు మాత్రమే ప్రచారంలో ఉంది. కానీ రవి ఉడ్యార్ సైతం ఈ చిత్రానికి దర్వకత్వం వహిస్తాడని.. ఇద్దరూ కలిసి ఈ భారీ చిత్రాన్ని తీర్చిదిద్దుతారని మధు వెల్లడించాడు. హృతిక్ రోషన్, మహేష్ బాబు, దీపికా పదుకొనే లాంటి తారలు ఈ సినిమాలో నటిస్తారని ప్రచారం సాగిన సంగతి తెలిసిందే.
This post was last modified on July 1, 2021 11:55 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…