Movie News

అల్లు వారి రామాయ‌ణం.. హాట్ అప్‌డేట్స్

రామాయ‌ణం మీద ఇండియాలో వివిధ భాష‌ల్లో చాలా సినిమాలే వ‌చ్చాయి ఇప్ప‌టిదాకా. ఐతే వాట‌న్నింటినీ త‌ల‌ద‌న్నేలా భారీ స్థాయిలో రామాయ‌ణ గాథ‌కు వెండితెర దూరం ఇవ్వాల‌ని కొన్నేళ్ల కింద‌ట టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్, తెలుగువాడే అయిన బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ మధు మంతెన త‌ల‌పోశారు.

వీరి నిర్మాణంలో దాదాపు రూ.500 కోట్ల బ‌డ్జెట్లో రామాయ‌ణం మీద సినిమా తెర‌కెక్క‌బోతున్న‌ట్లు అధికారిక ప్ర‌క‌ట‌నే వ‌చ్చింది. కానీ ఆ సినిమా ప‌ట్టాలెక్క‌డంలో ఆల‌స్యం జ‌రుగుతోంది. మ‌ధ్య‌లో చాలా కాలం పాటు ఈ సినిమా గురించి చ‌ప్పుడు లేక‌పోవ‌డంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింద‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది.

కానీ ఆ ప్ర‌చారాన్ని ఖండిస్తూ మ‌ళ్లీ అప్ డేట్స్ ఇస్తున్నారు. ఇందులో కాస్టింగ్ గురించి ఇప్ప‌టికే కొన్ని ఊహాగానాలు న‌డిచాయి. ఐతే నిర్మాత‌ల్లో ఒక‌రైన మ‌ధు మంతెన తాజాగా త‌మ చిత్రం గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఇండియాలో ఇప్ప‌టిదాకా ఎన్న‌డూ చూడ‌నంత భారీ స్థాయిలో ఈ సినిమాను తీర్చిదిద్దుతామ‌ని.. అలాగే ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీలోని అత్యంత పెద్ద స్టార్లు ఈ సినిమాలో న‌టిస్తార‌ని మ‌ధు చెప్పాడు. ఈ ఏడాది దీపావ‌ళి నాడు త‌మ రామాయ‌ణంలో ముఖ్య పాత్ర‌లు పోషించే న‌టీన‌టుల వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని కూడా మ‌ధు తెలిపాడు. ఈ చిత్రానికి ఇప్ప‌టికే ప్రి ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా జ‌రుగుతున్న‌ట్లు వెల్ల‌డించిన మ‌ధు.. ఆస్కార్ విన్నింగ్ టెక్నీషియ‌న్లు ఈ ప్రాజెక్టు కోసం ప‌ని చేస్తున్న‌ట్లు వెల్ల‌డించాడు.

కాగా ఈ సినిమాకు ద‌ర్శ‌కుడిగా ముందు దంగ‌ల్ ఫేమ్ నితీశ్ తివారి పేరు మాత్రమే ప్ర‌చారంలో ఉంది. కానీ రవి ఉడ్యార్ సైతం ఈ చిత్రానికి ద‌ర్వ‌కత్వం వ‌హిస్తాడ‌ని.. ఇద్ద‌రూ క‌లిసి ఈ భారీ చిత్రాన్ని తీర్చిదిద్దుతార‌ని మ‌ధు వెల్ల‌డించాడు. హృతిక్ రోష‌న్, మ‌హేష్ బాబు, దీపికా ప‌దుకొనే లాంటి తార‌లు ఈ సినిమాలో న‌టిస్తార‌ని ప్ర‌చారం సాగిన సంగ‌తి తెలిసిందే.

This post was last modified on July 1, 2021 11:55 am

Share

Recent Posts

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

2 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

2 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

2 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

3 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

3 hours ago

దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా

జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…

4 hours ago