Movie News

అల్లు వారి రామాయ‌ణం.. హాట్ అప్‌డేట్స్

రామాయ‌ణం మీద ఇండియాలో వివిధ భాష‌ల్లో చాలా సినిమాలే వ‌చ్చాయి ఇప్ప‌టిదాకా. ఐతే వాట‌న్నింటినీ త‌ల‌ద‌న్నేలా భారీ స్థాయిలో రామాయ‌ణ గాథ‌కు వెండితెర దూరం ఇవ్వాల‌ని కొన్నేళ్ల కింద‌ట టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్, తెలుగువాడే అయిన బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ మధు మంతెన త‌ల‌పోశారు.

వీరి నిర్మాణంలో దాదాపు రూ.500 కోట్ల బ‌డ్జెట్లో రామాయ‌ణం మీద సినిమా తెర‌కెక్క‌బోతున్న‌ట్లు అధికారిక ప్ర‌క‌ట‌నే వ‌చ్చింది. కానీ ఆ సినిమా ప‌ట్టాలెక్క‌డంలో ఆల‌స్యం జ‌రుగుతోంది. మ‌ధ్య‌లో చాలా కాలం పాటు ఈ సినిమా గురించి చ‌ప్పుడు లేక‌పోవ‌డంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింద‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది.

కానీ ఆ ప్ర‌చారాన్ని ఖండిస్తూ మ‌ళ్లీ అప్ డేట్స్ ఇస్తున్నారు. ఇందులో కాస్టింగ్ గురించి ఇప్ప‌టికే కొన్ని ఊహాగానాలు న‌డిచాయి. ఐతే నిర్మాత‌ల్లో ఒక‌రైన మ‌ధు మంతెన తాజాగా త‌మ చిత్రం గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఇండియాలో ఇప్ప‌టిదాకా ఎన్న‌డూ చూడ‌నంత భారీ స్థాయిలో ఈ సినిమాను తీర్చిదిద్దుతామ‌ని.. అలాగే ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీలోని అత్యంత పెద్ద స్టార్లు ఈ సినిమాలో న‌టిస్తార‌ని మ‌ధు చెప్పాడు. ఈ ఏడాది దీపావ‌ళి నాడు త‌మ రామాయ‌ణంలో ముఖ్య పాత్ర‌లు పోషించే న‌టీన‌టుల వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని కూడా మ‌ధు తెలిపాడు. ఈ చిత్రానికి ఇప్ప‌టికే ప్రి ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా జ‌రుగుతున్న‌ట్లు వెల్ల‌డించిన మ‌ధు.. ఆస్కార్ విన్నింగ్ టెక్నీషియ‌న్లు ఈ ప్రాజెక్టు కోసం ప‌ని చేస్తున్న‌ట్లు వెల్ల‌డించాడు.

కాగా ఈ సినిమాకు ద‌ర్శ‌కుడిగా ముందు దంగ‌ల్ ఫేమ్ నితీశ్ తివారి పేరు మాత్రమే ప్ర‌చారంలో ఉంది. కానీ రవి ఉడ్యార్ సైతం ఈ చిత్రానికి ద‌ర్వ‌కత్వం వ‌హిస్తాడ‌ని.. ఇద్ద‌రూ క‌లిసి ఈ భారీ చిత్రాన్ని తీర్చిదిద్దుతార‌ని మ‌ధు వెల్ల‌డించాడు. హృతిక్ రోష‌న్, మ‌హేష్ బాబు, దీపికా ప‌దుకొనే లాంటి తార‌లు ఈ సినిమాలో న‌టిస్తార‌ని ప్ర‌చారం సాగిన సంగ‌తి తెలిసిందే.

This post was last modified on July 1, 2021 11:55 am

Share

Recent Posts

ప్రభాస్ సినిమాల లెక్కలన్నీ తారుమారు

కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…

44 minutes ago

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వెళ్లిందా?

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…

1 hour ago

జనసేనకు 50 నుంచి 60.. బొలిశెట్టి వారి లెక్క‌లు!

జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొంద‌రు నాయ‌కులు త‌మ పంథాను మార్చుకోవ‌డం లేదు.…

3 hours ago

ఢిల్లీ అష్ట‌దిగ్భంధం… ఏంటీ `బ్రిక్స్ స‌ద‌స్సు`?

దేశ రాజ‌ధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు పోలీసుల ప‌హారాలో ఉండ‌నుంది. దాదాపు న‌గ‌రం…

7 hours ago

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

11 hours ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

11 hours ago