స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి మేకింగ్ టైంలో ఏ చిన్న విశేషం లీక్ అయినా అది వైరల్ అయిపోతుంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల పట్ల ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తి ఎలాంటిదో తెలిసిందే. ‘పింక్’ సినిమాకు సంబంధించి అప్పట్లో లొకేషన్ నుంచి బయటికొచ్చిన ఒక పిక్ ఎంతటి సంచలనం రేపిందో గుర్తుండే ఉంటుంది.
అంతగా క్లారిటీ లేని ఆ పిక్ వైరల్ అవగా.. స్పోర్టివ్గానే తీసుకున్న చిత్ర బృందం దాన్నే టైటిల్ లోగోలో పెట్టేయడం విశేషం. మేకింగ్ టైంలో ఒక ఫైట్కు సంబంధించిన వీడియో సైతం అప్పట్లో వైరల్ అయింది. కాగా ఇప్పుడు పవన్ నటిస్తున్న కొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’ నుంచి కూడా ఒక వీడియో బయటికి వచ్చి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో పవన్ మల్ల యోధులతో పోరాడే సన్నివేశాలుంటాయని ఇంతకుముందే సంకేతాలు అందాయి. పవన్ బరిసె పట్టుకుని పోజులిస్తున్న ఫొటోలు.. అలాగే మల్ల యోధుల ఫొటోలు అధికారికంగానే విడుదలయ్యాయి.
కాగా ఇప్పుడు ఆ యోధులతో పవన్ పోరాడే సన్నివేశాలకు సంబంధించి ఒక చిన్న వీడియో బయటికి వచ్చింది. ఒకవైపు ఆరేడుగురు మల్ల యోధులు సై అంటుంటే.. మరోవైపు పవన్ నిలబడి ఉన్నాడు ఆ వీడియోలో. చుట్టూ మనుషులు కిందికి వంగి కాళ్ల మీద కూర్చున్నారు. చూస్తుంటే ఇది ఒక కీలకమైన పోరాట దృశ్యానికి సంబంధించింది లాగుంది.
‘హరిహర వీరమల్లు’ కొన్ని దశాబ్దాల కిందటి నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా. ఇందులో పోరాట దృశ్యాలే హైలైట్ అని ఆ మధ్య రిలీజ్ చేసిన టీజర్తోనే స్పష్టమైంది. ఇంతకుముందు రిలీజ్ చేసిన ఫొటోలు, ఇప్పుడు బయటికి వచ్చిన వీడియో చూశాక క్రిష్ ఇందులో యాక్షన్ ఘట్టాలను గట్టిగానే ప్లాన్ చేసినట్లు స్పష్టమవుతోంది. ఎ.ఎం.రత్నం నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఐతే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా ఆలస్యమయ్యేలా ఉంది.
This post was last modified on June 28, 2021 3:12 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…