పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాక ఖరారు చేసుకున్న ప్రాజెక్టుల్లో ఆయన అభిమానులను ఎంతో ఎగ్జైట్ చేసిన సినిమా అంటే హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నదే. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్బస్టర్ తర్వాత ఈ కాంబోలో సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో చెప్పేదేముంది? అసలు పవన్ రీఎంట్రీ మూవీ ఇదే అయితే బాగుండని అభిమానులు కోరుకున్నారు. కానీ ఈ సినిమా అనుకున్న దాని కంటే చాలా ఆలస్యం అవుతూ వచ్చింది.
ముందుగా వకీల్ సాబ్ పని ముగించిన పవన్.. ఆ తర్వాత హరహర వీరమల్లు, అయ్యప్పనుం కోషీయుం రీమేక్లో నటిస్తున్నాడు. ఇవి పూర్తయ్యాకే హరీష్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు. ఐతే ఎంత ఆలస్యం అయినప్పటికీ.. వేరే ప్రాజెక్టు చూసుకోకుండా ఈ సినిమా మీదే తన ఫోకస్ మొత్తం పెట్టేసి కూర్చున్నాడు హరీష్.
ఈ సినిమా ఆలస్యం అవుతున్నప్పటికీ.. దాని విషయంలో పవన్ అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ తగ్గకుండా చూసుకుంటున్నాడు హరీష్. కొన్ని సినిమా వేడుకల్లో.. ట్విట్టర్లో పవన్తో చేయబోయే సినిమా ఎలా ఉండబోతోందో హింట్లు ఇస్తున్నాడతను. అభిమానుల ఆకాంక్షలకు తగ్గట్లే సినిమా ఉంటుందని.. తాను కూడా ఒక అభిమాని లాగే ఈ సినిమా తీయబోతున్నానని ఇంతకుముందు చెప్పిన హరీష్.. తాజాగా తన సినిమాలో పవన్ పాత్ర ఎలా ఉండబోతోందో సంకేతాలు ఇచ్చాడు.
బద్రి సినిమాలో పవన్ యాటిట్యూడ్ చూపించే షాట్లతో ఒక షో రీల్ వీడియోను హరీష్ పంచుకున్నాడు. ఈ ఎనర్జీని మళ్లీ చూద్దాం అంటూ హరీష్ కామెంట్ పెట్టడం విశేషం. దీంతో పవర్ స్టార్ అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. హరీష్ సినిమాలో పవన్ యాటిట్యూడ్, ఎనర్జీకి లోటుండదంటూ పోస్టులు పెడుతూ ఎగ్జైట్ అవుతున్నారు. పవన్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సైతం హరీష్ పోస్టు చూసి వెయిటింగ్ అంటూ ట్వీట్ వేయడం విశేషం.
This post was last modified on June 27, 2021 2:14 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…