ప్రభాష్ చేతిలో ఉన్న భారీ చిత్రాల్లో ‘ఆదిపురుష్’ ఒకటి. ‘బాహుబలి’తో పాన్ ఇండియా లెవెల్లో తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్నాక ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సిినమాలే చేస్తున్నాడు కానీ.. వాటిలో చాలా వరకు బేసిగ్గా తెలుగులో తెరకెక్కుతున్న చిత్రాలే ఉన్నాయి. ఒక్క ‘ఆదిపురుష్’ మాత్రమే మనం పరభాషా చిత్రంగా చెప్పుకోవాలి. ఇది ప్రధానంగా హిందీలో తెరకెక్కుతున్న చిత్రం. మిగతా భాషల్లోకి అనువాదం చేస్తున్నారు. దీన్ని రూపొందిస్తున్నది బాలీవుడ్ దర్శకుడైన ఓం రౌత్. నిర్మాతలూ అక్కడి వాళ్లే.
ఐతే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో తీయాలనుకున్నపుడు దక్షిణాది భాషలకు చెందిన నటీనటుల్ని కూడా ఎంచుకోవాల్సింది. కానీ పూర్తిగా బాలీవుడ్ నటులతోనే ఈ చిత్రాన్ని నింపేస్తున్నారు. కథానాయిక కృతి సనన్కు సౌత్లో పెద్ద గుర్తింపేమీ లేదు. తెలుగులో రెండు సినిమాలు చేసినా కూడా అవి డిజాస్టర్లవడంతో ఆమెను ఇక్కడి వాళ్లు గుర్తుంచుకోలేదు.
ఇక విలన్ పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్, అభిమన్యుడి పాత్ర పోషిస్తున్న సన్నీ సింగ్ బాలీవుడ్ నటులే. ఇప్పుడేమో ఈ చిత్రంలో మరో కీలక పాత్ర కోసం మరాఠీ నటుడైన దేవ్ దత్ను సెలక్ట్ చేశాడట దర్శకుడు ఓం రౌత్. దేవ్ దత్ చేయబోయేది హనుమంతుడి పాత్ర కావడం విశేషం. రామాయణ గాథలో హనుమంతుడి పాత్ర ఎంత కీలకమో తెలిసిందే. కనీసం ఈ పాత్రకైనా దక్షిణాది నుంచి ఎవరో ఒకరిని ఎంచుకోవాల్సిందిది.
ఇలా పూర్తిగా నార్త్ ఇండియా వాళ్లతో నింపేస్తే మన తెలుగు వాళ్లు, సౌత్ ప్రేక్షకులు ‘ఆదిపురుష్’తో ఏమాత్రం కనెక్ట్ అవుతారన్నది సందేహం. ఒక్క ప్రభాస్ను చూసి ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టేస్తారనుకుంటే పొరబాటే. అసలే హిందీ సినిమా, పైగా పూర్తిగా నార్త్ ఇండియన్ నటులు ఉంటే ఈ చిత్రంతో మన వాళ్లు కనెక్ట్ కారేమో అన్న డౌట్లు కొడుతున్నాయి. ఈ సినిమాకు టెక్నీషియన్లు కూడా పూర్తిగా బాలీవుడ్ వాళ్లే పని చేస్తుండటం గమనార్హం.
This post was last modified on June 27, 2021 7:46 am
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…