ప్రభాష్ చేతిలో ఉన్న భారీ చిత్రాల్లో ‘ఆదిపురుష్’ ఒకటి. ‘బాహుబలి’తో పాన్ ఇండియా లెవెల్లో తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్నాక ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సిినమాలే చేస్తున్నాడు కానీ.. వాటిలో చాలా వరకు బేసిగ్గా తెలుగులో తెరకెక్కుతున్న చిత్రాలే ఉన్నాయి. ఒక్క ‘ఆదిపురుష్’ మాత్రమే మనం పరభాషా చిత్రంగా చెప్పుకోవాలి. ఇది ప్రధానంగా హిందీలో తెరకెక్కుతున్న చిత్రం. మిగతా భాషల్లోకి అనువాదం చేస్తున్నారు. దీన్ని రూపొందిస్తున్నది బాలీవుడ్ దర్శకుడైన ఓం రౌత్. నిర్మాతలూ అక్కడి వాళ్లే.
ఐతే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో తీయాలనుకున్నపుడు దక్షిణాది భాషలకు చెందిన నటీనటుల్ని కూడా ఎంచుకోవాల్సింది. కానీ పూర్తిగా బాలీవుడ్ నటులతోనే ఈ చిత్రాన్ని నింపేస్తున్నారు. కథానాయిక కృతి సనన్కు సౌత్లో పెద్ద గుర్తింపేమీ లేదు. తెలుగులో రెండు సినిమాలు చేసినా కూడా అవి డిజాస్టర్లవడంతో ఆమెను ఇక్కడి వాళ్లు గుర్తుంచుకోలేదు.
ఇక విలన్ పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్, అభిమన్యుడి పాత్ర పోషిస్తున్న సన్నీ సింగ్ బాలీవుడ్ నటులే. ఇప్పుడేమో ఈ చిత్రంలో మరో కీలక పాత్ర కోసం మరాఠీ నటుడైన దేవ్ దత్ను సెలక్ట్ చేశాడట దర్శకుడు ఓం రౌత్. దేవ్ దత్ చేయబోయేది హనుమంతుడి పాత్ర కావడం విశేషం. రామాయణ గాథలో హనుమంతుడి పాత్ర ఎంత కీలకమో తెలిసిందే. కనీసం ఈ పాత్రకైనా దక్షిణాది నుంచి ఎవరో ఒకరిని ఎంచుకోవాల్సిందిది.
ఇలా పూర్తిగా నార్త్ ఇండియా వాళ్లతో నింపేస్తే మన తెలుగు వాళ్లు, సౌత్ ప్రేక్షకులు ‘ఆదిపురుష్’తో ఏమాత్రం కనెక్ట్ అవుతారన్నది సందేహం. ఒక్క ప్రభాస్ను చూసి ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టేస్తారనుకుంటే పొరబాటే. అసలే హిందీ సినిమా, పైగా పూర్తిగా నార్త్ ఇండియన్ నటులు ఉంటే ఈ చిత్రంతో మన వాళ్లు కనెక్ట్ కారేమో అన్న డౌట్లు కొడుతున్నాయి. ఈ సినిమాకు టెక్నీషియన్లు కూడా పూర్తిగా బాలీవుడ్ వాళ్లే పని చేస్తుండటం గమనార్హం.
This post was last modified on June 27, 2021 7:46 am
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…