ప్రభాష్ చేతిలో ఉన్న భారీ చిత్రాల్లో ‘ఆదిపురుష్’ ఒకటి. ‘బాహుబలి’తో పాన్ ఇండియా లెవెల్లో తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్నాక ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సిినమాలే చేస్తున్నాడు కానీ.. వాటిలో చాలా వరకు బేసిగ్గా తెలుగులో తెరకెక్కుతున్న చిత్రాలే ఉన్నాయి. ఒక్క ‘ఆదిపురుష్’ మాత్రమే మనం పరభాషా చిత్రంగా చెప్పుకోవాలి. ఇది ప్రధానంగా హిందీలో తెరకెక్కుతున్న చిత్రం. మిగతా భాషల్లోకి అనువాదం చేస్తున్నారు. దీన్ని రూపొందిస్తున్నది బాలీవుడ్ దర్శకుడైన ఓం రౌత్. నిర్మాతలూ అక్కడి వాళ్లే.
ఐతే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో తీయాలనుకున్నపుడు దక్షిణాది భాషలకు చెందిన నటీనటుల్ని కూడా ఎంచుకోవాల్సింది. కానీ పూర్తిగా బాలీవుడ్ నటులతోనే ఈ చిత్రాన్ని నింపేస్తున్నారు. కథానాయిక కృతి సనన్కు సౌత్లో పెద్ద గుర్తింపేమీ లేదు. తెలుగులో రెండు సినిమాలు చేసినా కూడా అవి డిజాస్టర్లవడంతో ఆమెను ఇక్కడి వాళ్లు గుర్తుంచుకోలేదు.
ఇక విలన్ పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్, అభిమన్యుడి పాత్ర పోషిస్తున్న సన్నీ సింగ్ బాలీవుడ్ నటులే. ఇప్పుడేమో ఈ చిత్రంలో మరో కీలక పాత్ర కోసం మరాఠీ నటుడైన దేవ్ దత్ను సెలక్ట్ చేశాడట దర్శకుడు ఓం రౌత్. దేవ్ దత్ చేయబోయేది హనుమంతుడి పాత్ర కావడం విశేషం. రామాయణ గాథలో హనుమంతుడి పాత్ర ఎంత కీలకమో తెలిసిందే. కనీసం ఈ పాత్రకైనా దక్షిణాది నుంచి ఎవరో ఒకరిని ఎంచుకోవాల్సిందిది.
ఇలా పూర్తిగా నార్త్ ఇండియా వాళ్లతో నింపేస్తే మన తెలుగు వాళ్లు, సౌత్ ప్రేక్షకులు ‘ఆదిపురుష్’తో ఏమాత్రం కనెక్ట్ అవుతారన్నది సందేహం. ఒక్క ప్రభాస్ను చూసి ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టేస్తారనుకుంటే పొరబాటే. అసలే హిందీ సినిమా, పైగా పూర్తిగా నార్త్ ఇండియన్ నటులు ఉంటే ఈ చిత్రంతో మన వాళ్లు కనెక్ట్ కారేమో అన్న డౌట్లు కొడుతున్నాయి. ఈ సినిమాకు టెక్నీషియన్లు కూడా పూర్తిగా బాలీవుడ్ వాళ్లే పని చేస్తుండటం గమనార్హం.
This post was last modified on June 27, 2021 7:46 am
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…