‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్.. తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్తో ఓ సినిమాకు రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంకో నెలా రెండు నెలల్లో ‘ఆర్ఆర్ఆర్’ పని పూర్తి చేసేసి శంకర్ సినిమాను మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు చరణ్. కానీ శంకర్ ఆ సమయానికి సినిమాను ఆరంభించే స్థితిలో ఉంటాడా అన్నది సందేహంగానే ఉంది. ‘ఇండియన్-2’ సంగతేంటో తేల్చకుండా శంకర్ వేరే సినిమా చేయడానిక వీల్లేదంటూ దాని నిర్మాతలైన లైకా ప్రొడక్షన్స్ అధినేతలు న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.
తెలుగు ఫిలిం ఛాంబర్లోనూ ఈ విషయమై ఫిర్యాదు చేసి చరణ్ సినిమాను శంకర్ మొదలుపెట్టకుండా గట్టి ప్రయత్నమే చేస్తున్నారు లైకా అధినేతలు. ఈ నేపథ్యంలో చరణ్-శంకర్ సినిమా మీద సందిగ్ధత నెలకొంది. కాగా ఇప్పుడు మరో టాలీవుడ్ కథానాయకుడికి ఇలాగే ఓ తమిళ దర్శకుడితో తలనొప్పి తప్పేలా లేదు. ఆ హీరో రామ్ కాగా.. దర్శకుడు లింగుస్వామి.
రామ్-లింగుస్వామి కలయికలో సినిమా గురించి కొన్ని నెలల కిందటే ప్రకటన రావడం తెలిసిందే. ఇటీవలే లింగుస్వామి తనకు స్క్రిప్ట్ ఫైనల్ నరేషన్ ఇచ్చాడని.. తనకది బాగా నచ్చిందని.. త్వరలోనే సినిమా మొదలుపెడతామని రామ్ ట్విట్టర్లో వెల్డడించాడు కూడా. ఐతే ఈలోపు లింగుస్వామికి బ్రేక్ వేసేలా కనిపిస్తున్నాడు తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా. సూర్య కజిన్ అయిన జ్ఞానవేల్కు, లింగుస్వామికి మధ్య చాన్నాళ్లుగా ఓ వివాదం నడుస్తోంది.
సూర్య హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో జ్ఞానవేల్ నిర్మించిన ‘సికిందర్’ పెద్ద డిజాస్టర్ కావడం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన ఆర్థిక పరమైన విషయాల్లో జ్ఞానవేల్కు, లిగుస్వామికి గొడవలున్నాయి. అవి పరిష్కారం అయ్యే వరకు లింగుస్వామి ఇప్పుడు వేరే సినిమా చేయడానికి వీల్లేదంటూ తమిళ ఫిలిం ఛాంబర్లో లింగుస్వామి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ వివాదం పరిష్కరించుకున్నాక కానీ లిగుస్వామి.. రామ్ సినిమాను మొదలుపెట్టడానికి వీల్లేని పరిస్థితి నెలకొంది.
This post was last modified on June 27, 2021 7:38 am
నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…
తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…