Movie News

చరణ్‌కు వచ్చిన సమస్యే.. రామ్‌కు


‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్.. తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో ఓ సినిమాకు రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంకో నెలా రెండు నెలల్లో ‘ఆర్ఆర్ఆర్’ పని పూర్తి చేసేసి శంకర్ సినిమాను మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు చరణ్. కానీ శంకర్ ఆ సమయానికి సినిమాను ఆరంభించే స్థితిలో ఉంటాడా అన్నది సందేహంగానే ఉంది. ‘ఇండియన్-2’ సంగతేంటో తేల్చకుండా శంకర్ వేరే సినిమా చేయడానిక వీల్లేదంటూ దాని నిర్మాతలైన లైకా ప్రొడక్షన్స్ అధినేతలు న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.

తెలుగు ఫిలిం ఛాంబర్లోనూ ఈ విషయమై ఫిర్యాదు చేసి చరణ్ సినిమాను శంకర్ మొదలుపెట్టకుండా గట్టి ప్రయత్నమే చేస్తున్నారు లైకా అధినేతలు. ఈ నేపథ్యంలో చరణ్-శంకర్ సినిమా మీద సందిగ్ధత నెలకొంది. కాగా ఇప్పుడు మరో టాలీవుడ్ కథానాయకుడికి ఇలాగే ఓ తమిళ దర్శకుడితో తలనొప్పి తప్పేలా లేదు. ఆ హీరో రామ్ కాగా.. దర్శకుడు లింగుస్వామి.

రామ్-లింగుస్వామి కలయికలో సినిమా గురించి కొన్ని నెలల కిందటే ప్రకటన రావడం తెలిసిందే. ఇటీవలే లింగుస్వామి తనకు స్క్రిప్ట్ ఫైనల్ నరేషన్ ఇచ్చాడని.. తనకది బాగా నచ్చిందని.. త్వరలోనే సినిమా మొదలుపెడతామని రామ్ ట్విట్టర్లో వెల్డడించాడు కూడా. ఐతే ఈలోపు లింగుస్వామికి బ్రేక్ వేసేలా కనిపిస్తున్నాడు తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా. సూర్య కజిన్ అయిన జ్ఞానవేల్‌కు, లింగుస్వామికి మధ్య చాన్నాళ్లుగా ఓ వివాదం నడుస్తోంది.

సూర్య హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో జ్ఞానవేల్ నిర్మించిన ‘సికిందర్’ పెద్ద డిజాస్టర్ కావడం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన ఆర్థిక పరమైన విషయాల్లో జ్ఞానవేల్‌కు, లిగుస్వామికి గొడవలున్నాయి. అవి పరిష్కారం అయ్యే వరకు లింగుస్వామి ఇప్పుడు వేరే సినిమా చేయడానికి వీల్లేదంటూ తమిళ ఫిలిం ఛాంబర్లో లింగుస్వామి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ వివాదం పరిష్కరించుకున్నాక కానీ లిగుస్వామి.. రామ్ సినిమాను మొదలుపెట్టడానికి వీల్లేని పరిస్థితి నెలకొంది.

This post was last modified on June 27, 2021 7:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిరస్కరించిన సినిమాకు హడావిడి ఎందుకయ్యా

ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…

31 minutes ago

అప్పులు కట్టుకుంటున్న మంచు లక్ష్మీ

టాలీవుడ్లో ఘ‌న చ‌రిత్ర ఉన్న బేన‌ర్లో ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ ఒక‌టి. ఈ బేన‌ర్ మీద ప‌దుల సంఖ్య‌లో సినిమాలు తీశారు…

1 hour ago

రెండో పెళ్లి మీద హీరోయిన్ ఆసక్తి

‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…

4 hours ago

మరోసారి కన్నీరు పెట్టిన ఎర్రబెల్లి

ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…

5 hours ago

మెరుగైన ఛాయిస్ కోసం రావిపూడి వేట

మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…

5 hours ago

సుప్రీం కోర్టు తీర్పుపై నటి తల్లి ఏమన్నారు?

24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…

6 hours ago