తెలుగు సినిమాలను హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటే యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఇక్కడ పెద్దగా క్రేజ్ లేని హీరోల సినిమాలు కూడా యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్నాయి. దీంతో హిందీ డబ్బింగ్ రైట్స్ కు డిమాండ్ పెరిగింది. బోయపాటి మాస్ సినిమాలను హిందీ ఆడియన్స్ బాగా ఇష్టపడుతున్నారు. అందుకే ఆయన ప్లాప్ సినిమా ‘వినయ విధేయ రామ’ కూడా భారీ రేటుకి అమ్ముడైంది. ఇప్పుడు ఆయన డైరెక్ట్ చేస్తోన్న ‘అఖండ’ సినిమా రైట్స్ ని పదిహేను కోట్లకు అమ్మేశారు.
ఇలాంటి ఓ డీల్ అల్లు అర్జున్ సినిమాకి కూడా వచ్చినట్లు తెలుస్తోంది. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమాకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న భారీ యాక్షన్ సినిమా కావడంతో ప్రేక్షకులను సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా టీజర్ యూట్యూబ్ ని షేక్ చేసింది. దీంతో సినిమా డబ్బింగ్ రైట్స్ కోసం కొన్ని కంపెనీలు ఎగబడ్డాయి.
అయితే ఫైనల్ గా రూ.17.5 కోట్లకు హిందీ డబ్బింగ్ రైట్స్ విక్రయించినట్లు తెలుస్తోంది. ఇది ఒక్క తొలి భాగానికి వచ్చిన రేటే. రెండో పార్ట్ ను సెపరేట్ గా అమ్మనున్నారు. ఇప్పటికే ఈ సినిమా పార్ట్ 1కి సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తయింది. రెండో భాగాన్ని వచ్చే ఏడాది నుండి చిత్రీకరించే అవకాశాలు ఉన్నాయి. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు.
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…