Movie News

ఫ్యాన్సీ రేటుకి ‘పుష్ప’ డబ్బింగ్ రైట్స్!

తెలుగు సినిమాలను హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటే యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఇక్కడ పెద్దగా క్రేజ్ లేని హీరోల సినిమాలు కూడా యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్నాయి. దీంతో హిందీ డబ్బింగ్ రైట్స్ కు డిమాండ్ పెరిగింది. బోయపాటి మాస్ సినిమాలను హిందీ ఆడియన్స్ బాగా ఇష్టపడుతున్నారు. అందుకే ఆయన ప్లాప్ సినిమా ‘వినయ విధేయ రామ’ కూడా భారీ రేటుకి అమ్ముడైంది. ఇప్పుడు ఆయన డైరెక్ట్ చేస్తోన్న ‘అఖండ’ సినిమా రైట్స్ ని పదిహేను కోట్లకు అమ్మేశారు.

ఇలాంటి ఓ డీల్ అల్లు అర్జున్ సినిమాకి కూడా వచ్చినట్లు తెలుస్తోంది. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమాకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న భారీ యాక్షన్ సినిమా కావడంతో ప్రేక్షకులను సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా టీజర్ యూట్యూబ్ ని షేక్ చేసింది. దీంతో సినిమా డబ్బింగ్ రైట్స్ కోసం కొన్ని కంపెనీలు ఎగబడ్డాయి.

అయితే ఫైనల్ గా రూ.17.5 కోట్లకు హిందీ డబ్బింగ్ రైట్స్ విక్రయించినట్లు తెలుస్తోంది. ఇది ఒక్క తొలి భాగానికి వచ్చిన రేటే. రెండో పార్ట్ ను సెపరేట్ గా అమ్మనున్నారు. ఇప్పటికే ఈ సినిమా పార్ట్ 1కి సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తయింది. రెండో భాగాన్ని వచ్చే ఏడాది నుండి చిత్రీకరించే అవకాశాలు ఉన్నాయి. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు.

This post was last modified on June 25, 2021 9:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ట్రంప్ ఇమేజ్ ఎంత దారుణంగా పడిదంటే

అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…

1 hour ago

జగన్ ‘మావిగన్’… ట్రోల్ మెటీరియల్ అయిందే

‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…

1 hour ago

ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…

3 hours ago

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

4 hours ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

6 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

6 hours ago