తెలుగు సినిమాలను హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటే యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఇక్కడ పెద్దగా క్రేజ్ లేని హీరోల సినిమాలు కూడా యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్నాయి. దీంతో హిందీ డబ్బింగ్ రైట్స్ కు డిమాండ్ పెరిగింది. బోయపాటి మాస్ సినిమాలను హిందీ ఆడియన్స్ బాగా ఇష్టపడుతున్నారు. అందుకే ఆయన ప్లాప్ సినిమా ‘వినయ విధేయ రామ’ కూడా భారీ రేటుకి అమ్ముడైంది. ఇప్పుడు ఆయన డైరెక్ట్ చేస్తోన్న ‘అఖండ’ సినిమా రైట్స్ ని పదిహేను కోట్లకు అమ్మేశారు.
ఇలాంటి ఓ డీల్ అల్లు అర్జున్ సినిమాకి కూడా వచ్చినట్లు తెలుస్తోంది. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమాకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న భారీ యాక్షన్ సినిమా కావడంతో ప్రేక్షకులను సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా టీజర్ యూట్యూబ్ ని షేక్ చేసింది. దీంతో సినిమా డబ్బింగ్ రైట్స్ కోసం కొన్ని కంపెనీలు ఎగబడ్డాయి.
అయితే ఫైనల్ గా రూ.17.5 కోట్లకు హిందీ డబ్బింగ్ రైట్స్ విక్రయించినట్లు తెలుస్తోంది. ఇది ఒక్క తొలి భాగానికి వచ్చిన రేటే. రెండో పార్ట్ ను సెపరేట్ గా అమ్మనున్నారు. ఇప్పటికే ఈ సినిమా పార్ట్ 1కి సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తయింది. రెండో భాగాన్ని వచ్చే ఏడాది నుండి చిత్రీకరించే అవకాశాలు ఉన్నాయి. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు.
This post was last modified on June 25, 2021 9:07 am
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…