తెలుగు సినిమాలను హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటే యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఇక్కడ పెద్దగా క్రేజ్ లేని హీరోల సినిమాలు కూడా యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్నాయి. దీంతో హిందీ డబ్బింగ్ రైట్స్ కు డిమాండ్ పెరిగింది. బోయపాటి మాస్ సినిమాలను హిందీ ఆడియన్స్ బాగా ఇష్టపడుతున్నారు. అందుకే ఆయన ప్లాప్ సినిమా ‘వినయ విధేయ రామ’ కూడా భారీ రేటుకి అమ్ముడైంది. ఇప్పుడు ఆయన డైరెక్ట్ చేస్తోన్న ‘అఖండ’ సినిమా రైట్స్ ని పదిహేను కోట్లకు అమ్మేశారు.
ఇలాంటి ఓ డీల్ అల్లు అర్జున్ సినిమాకి కూడా వచ్చినట్లు తెలుస్తోంది. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమాకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న భారీ యాక్షన్ సినిమా కావడంతో ప్రేక్షకులను సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా టీజర్ యూట్యూబ్ ని షేక్ చేసింది. దీంతో సినిమా డబ్బింగ్ రైట్స్ కోసం కొన్ని కంపెనీలు ఎగబడ్డాయి.
అయితే ఫైనల్ గా రూ.17.5 కోట్లకు హిందీ డబ్బింగ్ రైట్స్ విక్రయించినట్లు తెలుస్తోంది. ఇది ఒక్క తొలి భాగానికి వచ్చిన రేటే. రెండో పార్ట్ ను సెపరేట్ గా అమ్మనున్నారు. ఇప్పటికే ఈ సినిమా పార్ట్ 1కి సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తయింది. రెండో భాగాన్ని వచ్చే ఏడాది నుండి చిత్రీకరించే అవకాశాలు ఉన్నాయి. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు.
This post was last modified on June 25, 2021 9:07 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…