కరోనా వ్యాప్తితో దేశం అల్లాడుతున్న వేళ.. దీనిని అడ్డు పెట్టుకుని సంపాయించుకునేందుకు అనేక మంది ప్రయత్నించిన విషయం తెలిసిందే. ప్రాణాధారమైన మందులు, ఔషధాలను.. బ్లాక్మార్కెట్ చేసిన వారు వేలలో ఉన్నారు. ఇక, ఇదికూడా కాకుండా.. ఏకంగా.. ఆయా మందుల పేర్లు చెప్పి.. ఆన్లైన్లో మోసాలకు తెగబడిన వారు కూడా ఉన్నారు. మరికొందరు ఆన్లైన్లో ముందుగానే డబ్బులు కట్టించుకుని.. తర్వాత పక్కాగా కుచ్చుటోపీ పెట్టినోళ్లు కూడా ఉన్నారు.
ఇక, ఇప్పుడు కరోనా టీకా వంతు వచ్చింది. కరోనా టీకా పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ వ్యక్తి సినీ హీరో, విక్టరీ వెంకటేష్.. అన్న.. ప్రముఖ నిర్మాత సురేశ్ బాబునే మోసం చేశాడు. కరోనా నుంచి రక్షణ పొందేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో తమ కుటుంబాలు, బంధువులకు వ్యాక్సిన్ వేయించేందుకు సురేష్బాబు ప్రయత్నించారు. పెద్దమొత్తంలో 500 వ్యాక్సిన్ డోసులు కొనుగోలుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నాగార్జున రెడ్డి అనే వ్యక్తి పరిచయమయ్యారు. అది కూడా ఫోన్లోనే.
ఓ రోజు.. నాగార్జున రెడ్డే ఫోన్ చేసి.. 500 డోసుల వ్యాక్సిన్ ఉందని చెప్పడంతోపాటు వెంటనే అమ్ముతానని.. లక్ష రూపాయలు ఖర్చవుతుందని చెప్పాడు. దీంతో సురేష్బాబు ఓకే అని.. నాగార్జున రెడ్డి భార్య లక్ష్మి అకౌంట్లో లక్ష రూపాయలు వేశారు. అయితే.. ఎంతకీ వ్యాక్సిన్ చేరకపోవడంతో.. అతను మాటలు నమ్మిన సురేశ్ బాబు… మోసపోయినట్టు గుర్తించారు. నిందితుడు డబ్బులు డ్రా చేసుకుని.. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. దీంతో సురేశ్ బాబు పీఏ రాజేంద్రప్రసాద్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రజలు ఇలాంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…