కరోనా వ్యాప్తితో దేశం అల్లాడుతున్న వేళ.. దీనిని అడ్డు పెట్టుకుని సంపాయించుకునేందుకు అనేక మంది ప్రయత్నించిన విషయం తెలిసిందే. ప్రాణాధారమైన మందులు, ఔషధాలను.. బ్లాక్మార్కెట్ చేసిన వారు వేలలో ఉన్నారు. ఇక, ఇదికూడా కాకుండా.. ఏకంగా.. ఆయా మందుల పేర్లు చెప్పి.. ఆన్లైన్లో మోసాలకు తెగబడిన వారు కూడా ఉన్నారు. మరికొందరు ఆన్లైన్లో ముందుగానే డబ్బులు కట్టించుకుని.. తర్వాత పక్కాగా కుచ్చుటోపీ పెట్టినోళ్లు కూడా ఉన్నారు.
ఇక, ఇప్పుడు కరోనా టీకా వంతు వచ్చింది. కరోనా టీకా పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ వ్యక్తి సినీ హీరో, విక్టరీ వెంకటేష్.. అన్న.. ప్రముఖ నిర్మాత సురేశ్ బాబునే మోసం చేశాడు. కరోనా నుంచి రక్షణ పొందేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో తమ కుటుంబాలు, బంధువులకు వ్యాక్సిన్ వేయించేందుకు సురేష్బాబు ప్రయత్నించారు. పెద్దమొత్తంలో 500 వ్యాక్సిన్ డోసులు కొనుగోలుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నాగార్జున రెడ్డి అనే వ్యక్తి పరిచయమయ్యారు. అది కూడా ఫోన్లోనే.
ఓ రోజు.. నాగార్జున రెడ్డే ఫోన్ చేసి.. 500 డోసుల వ్యాక్సిన్ ఉందని చెప్పడంతోపాటు వెంటనే అమ్ముతానని.. లక్ష రూపాయలు ఖర్చవుతుందని చెప్పాడు. దీంతో సురేష్బాబు ఓకే అని.. నాగార్జున రెడ్డి భార్య లక్ష్మి అకౌంట్లో లక్ష రూపాయలు వేశారు. అయితే.. ఎంతకీ వ్యాక్సిన్ చేరకపోవడంతో.. అతను మాటలు నమ్మిన సురేశ్ బాబు… మోసపోయినట్టు గుర్తించారు. నిందితుడు డబ్బులు డ్రా చేసుకుని.. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. దీంతో సురేశ్ బాబు పీఏ రాజేంద్రప్రసాద్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రజలు ఇలాంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
This post was last modified on June 22, 2021 11:43 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…