శరత్ మరార్.. కొన్నేళ్ల కిందట టాలీవుడ్లో ఈ పేరు సూపర్ పాపులర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఒకప్పుడు ఈ నిర్మాత, వ్యాపారవేత్త ఎంత క్లోజ్గా ఉండేవాడో తెలిసిందే. పవన్ సినిమాలతో పాటు వ్యక్తిగత వ్యవహారాల్ని కూడా మరార్ చూసుకునేవాడు. ఆ సాన్నిహిత్యంతోనే వరుసగా పవన్ తో మూడు సినిమాలు ప్రొడ్యూస్ చేసే అరుదైన అవకాశం దక్కించుకున్నాడు.
గోపాల గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాల నిర్మాత ఆయనే. పవన్ లాంటి హీరో వరుసగా ఓ నిర్మాతతో మూడు సినిమాలు చేయడం అన్నది నభూతో, నభవిష్యత్ కూడా. ఐతే పవన్తో ఆ స్నేహాన్ని ఎంతో కాలం నిలబెట్టుకోలేకపోయాడు శరత్. వీళ్లిద్దరికీ ఎక్కడో చెడింది. ఉన్నట్లుండి శరత్ సైడైపోయాడు. తర్వాత ఆయన రేంజ్ పడిపోయింది.
పవన్ తో అంత పెద్ద సినిమాలు తీసిన వాడు.. కర్తవ్యం, అదిరింది లాంటి డబ్బింగ్ సినిమాల రేంజికి పడిపోయాడు. ఈ మధ్య శరత్ నుంచి ఏ సినిమా అప్ డేట్లు లేవు. తాజాగా ఆయన వెబ్ సిరీస్ మీద దృష్టిపెట్టాడు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి రాబోతున్న కొత్త వెంచర్ పేరు.. భానుమతి రామకృష్ణ. టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర, కొత్తమ్మాయి సలోని లూథ్రా జంటగా నటించిన వెబ్ ఫిలిం ఇది.
దీని ట్రైలర్ తాజాగా లాంచ్ చేశారు. అది ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఓ కార్పొరేట్ కంపెనీలో పని చేస్తూ 30 ఏళ్ల వయసు వచ్చినా తన టిపికల్ మెంటాలిటీ వల్ల ఇంకా పెళ్లి చేసుకోలేకపోయిన ఓ అమ్మాయి.. ఉద్యోగం కోసం సిటీకి ఎన్నో ఆశలతో వచ్చి ఈ అమ్మాయి కంపెనీలో చేరి ముందు తనను చికాకు పెట్టి ఆ తర్వాత తనకు దగ్గరయ్యే పల్లెటూరి కుర్రాడు.. వీళ్లిద్దరి మధ్య నడిచే కథ ఇది.
ట్రైలర్ చాలా సెన్సిబుల్గా, ఫన్నీగా.. కొన్ని చోట్ల హృద్యంగా అనిపించింది. వెబ్ సిరీస్లు ఇష్టపడే జనాలకు ఇది బాగానే ఎక్కేలా ఉంది. శ్రీకాత్ నాగోతి అనే కొత్త దర్శకుడు ఈ వెబ్ ఫిలింను డైరెక్ట్ చేశాడు. దీని రిలీజ్ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
This post was last modified on May 19, 2020 2:44 pm
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…