శరత్ మరార్.. కొన్నేళ్ల కిందట టాలీవుడ్లో ఈ పేరు సూపర్ పాపులర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఒకప్పుడు ఈ నిర్మాత, వ్యాపారవేత్త ఎంత క్లోజ్గా ఉండేవాడో తెలిసిందే. పవన్ సినిమాలతో పాటు వ్యక్తిగత వ్యవహారాల్ని కూడా మరార్ చూసుకునేవాడు. ఆ సాన్నిహిత్యంతోనే వరుసగా పవన్ తో మూడు సినిమాలు ప్రొడ్యూస్ చేసే అరుదైన అవకాశం దక్కించుకున్నాడు.
గోపాల గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాల నిర్మాత ఆయనే. పవన్ లాంటి హీరో వరుసగా ఓ నిర్మాతతో మూడు సినిమాలు చేయడం అన్నది నభూతో, నభవిష్యత్ కూడా. ఐతే పవన్తో ఆ స్నేహాన్ని ఎంతో కాలం నిలబెట్టుకోలేకపోయాడు శరత్. వీళ్లిద్దరికీ ఎక్కడో చెడింది. ఉన్నట్లుండి శరత్ సైడైపోయాడు. తర్వాత ఆయన రేంజ్ పడిపోయింది.
పవన్ తో అంత పెద్ద సినిమాలు తీసిన వాడు.. కర్తవ్యం, అదిరింది లాంటి డబ్బింగ్ సినిమాల రేంజికి పడిపోయాడు. ఈ మధ్య శరత్ నుంచి ఏ సినిమా అప్ డేట్లు లేవు. తాజాగా ఆయన వెబ్ సిరీస్ మీద దృష్టిపెట్టాడు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి రాబోతున్న కొత్త వెంచర్ పేరు.. భానుమతి రామకృష్ణ. టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర, కొత్తమ్మాయి సలోని లూథ్రా జంటగా నటించిన వెబ్ ఫిలిం ఇది.
దీని ట్రైలర్ తాజాగా లాంచ్ చేశారు. అది ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఓ కార్పొరేట్ కంపెనీలో పని చేస్తూ 30 ఏళ్ల వయసు వచ్చినా తన టిపికల్ మెంటాలిటీ వల్ల ఇంకా పెళ్లి చేసుకోలేకపోయిన ఓ అమ్మాయి.. ఉద్యోగం కోసం సిటీకి ఎన్నో ఆశలతో వచ్చి ఈ అమ్మాయి కంపెనీలో చేరి ముందు తనను చికాకు పెట్టి ఆ తర్వాత తనకు దగ్గరయ్యే పల్లెటూరి కుర్రాడు.. వీళ్లిద్దరి మధ్య నడిచే కథ ఇది.
ట్రైలర్ చాలా సెన్సిబుల్గా, ఫన్నీగా.. కొన్ని చోట్ల హృద్యంగా అనిపించింది. వెబ్ సిరీస్లు ఇష్టపడే జనాలకు ఇది బాగానే ఎక్కేలా ఉంది. శ్రీకాత్ నాగోతి అనే కొత్త దర్శకుడు ఈ వెబ్ ఫిలింను డైరెక్ట్ చేశాడు. దీని రిలీజ్ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
This post was last modified on May 19, 2020 2:44 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…