టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ ఎప్పుడో ఏడేళ్ల కిందట భూపతి రాజా అనే తమిళ దర్శకుడితో ఓ సినిమాను మొదలుపెట్టారు. ఐతే షూటింగ్ ఆరంభ దశలో ఉండగానే ఏవో సమస్యలు తలెత్తి.. భూపతి రాజా ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. సీనియర్ దర్శకుడు గోపాల్ ఈ చిత్రాన్ని టేకప్ చేశారు. ఆయనే సినిమాను పూర్తి చేశారు. నయనతార ఇందులో కథానాయిక.
సినిమా నిర్మాణం పూర్తి కావడానికే కొన్నేళ్లు పట్టగా.. అది పూర్తయ్యాక ఏవో సమస్యలు తలెత్తి విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది. మూడేళ్ల కిందట ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి గట్టి ప్రయత్నమే జరిగింది. రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు. ఇక సినిమా విడుదల కావడం లాంఛనమే అనుకుంటున్న సమయంలో మళ్లీ బ్రేక్ పడింది. రిలీజ్ రోజు ఉదయం ఫైనాన్షియర్లు అడ్డు పడటంతో సినిమా థియేటర్లకు రాకుండా ఆగిపోయింది. ఆ తర్వాత దీని గురించి ఊసే లేదు.
ఐతే గత ఏడాది నుంచి ఓటీటీల హవా నడుస్తుండటంతో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి.. నేరుగా డిజిటల్ రిలీజ్కు ఈ సినిమాను సిద్ధం చేసే అవకాశాలున్నట్లు వార్తలొచ్చాయి కానీ.. అది కూడా కార్యరూపం దాల్చలేదు. కాగా ఇప్పుడు ఉన్నట్లుండి ‘ఆరడుగుల బుల్లెట్’ వార్తల్లోకి వచ్చింది. దీని నిర్మాత రమేష్.. ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు. తమ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన నేపథ్యంలో మళ్లీ థియేటర్లు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ‘ఆరడుగుల బుల్లెట్’ థియేటర్లలోకే వస్తుందని స్పష్టం చేశారు.
ఐతే ఎప్పుడో ఏడేళ్ల కిందట మొదలైన సినిమాను ఇప్పుడు చూస్తే అందులో పాత వాసనలు గుప్పుమనడం ఖాయం. గోపీచంద్, నయనతార లుక్స్ కూడా పాతగా అనిపించొచ్చు. మరి ఇలాంటి సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. అన్నింటికీ మించి అసలు ఈసారైనా పక్కాగా ‘ఆరడుగుల బుల్లెట్’ రిలీజవుతుందో లేదో చూడాలి.
This post was last modified on June 21, 2021 1:12 pm
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత గత రెండు రోజులుగా నిరవధిక…
కొత్త తరం దర్శకులతో పని చేసేందుకు చిరంజీవి పరుగులు పెడుతున్నారు. కొంచెం ఆలస్యంగా అయినా రజనీకాంత్ రూటు పట్టి విజయాలు…