టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ ఎప్పుడో ఏడేళ్ల కిందట భూపతి రాజా అనే తమిళ దర్శకుడితో ఓ సినిమాను మొదలుపెట్టారు. ఐతే షూటింగ్ ఆరంభ దశలో ఉండగానే ఏవో సమస్యలు తలెత్తి.. భూపతి రాజా ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. సీనియర్ దర్శకుడు గోపాల్ ఈ చిత్రాన్ని టేకప్ చేశారు. ఆయనే సినిమాను పూర్తి చేశారు. నయనతార ఇందులో కథానాయిక.
సినిమా నిర్మాణం పూర్తి కావడానికే కొన్నేళ్లు పట్టగా.. అది పూర్తయ్యాక ఏవో సమస్యలు తలెత్తి విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది. మూడేళ్ల కిందట ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి గట్టి ప్రయత్నమే జరిగింది. రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు. ఇక సినిమా విడుదల కావడం లాంఛనమే అనుకుంటున్న సమయంలో మళ్లీ బ్రేక్ పడింది. రిలీజ్ రోజు ఉదయం ఫైనాన్షియర్లు అడ్డు పడటంతో సినిమా థియేటర్లకు రాకుండా ఆగిపోయింది. ఆ తర్వాత దీని గురించి ఊసే లేదు.
ఐతే గత ఏడాది నుంచి ఓటీటీల హవా నడుస్తుండటంతో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి.. నేరుగా డిజిటల్ రిలీజ్కు ఈ సినిమాను సిద్ధం చేసే అవకాశాలున్నట్లు వార్తలొచ్చాయి కానీ.. అది కూడా కార్యరూపం దాల్చలేదు. కాగా ఇప్పుడు ఉన్నట్లుండి ‘ఆరడుగుల బుల్లెట్’ వార్తల్లోకి వచ్చింది. దీని నిర్మాత రమేష్.. ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు. తమ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన నేపథ్యంలో మళ్లీ థియేటర్లు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ‘ఆరడుగుల బుల్లెట్’ థియేటర్లలోకే వస్తుందని స్పష్టం చేశారు.
ఐతే ఎప్పుడో ఏడేళ్ల కిందట మొదలైన సినిమాను ఇప్పుడు చూస్తే అందులో పాత వాసనలు గుప్పుమనడం ఖాయం. గోపీచంద్, నయనతార లుక్స్ కూడా పాతగా అనిపించొచ్చు. మరి ఇలాంటి సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. అన్నింటికీ మించి అసలు ఈసారైనా పక్కాగా ‘ఆరడుగుల బుల్లెట్’ రిలీజవుతుందో లేదో చూడాలి.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…