టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ ఎప్పుడో ఏడేళ్ల కిందట భూపతి రాజా అనే తమిళ దర్శకుడితో ఓ సినిమాను మొదలుపెట్టారు. ఐతే షూటింగ్ ఆరంభ దశలో ఉండగానే ఏవో సమస్యలు తలెత్తి.. భూపతి రాజా ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. సీనియర్ దర్శకుడు గోపాల్ ఈ చిత్రాన్ని టేకప్ చేశారు. ఆయనే సినిమాను పూర్తి చేశారు. నయనతార ఇందులో కథానాయిక.
సినిమా నిర్మాణం పూర్తి కావడానికే కొన్నేళ్లు పట్టగా.. అది పూర్తయ్యాక ఏవో సమస్యలు తలెత్తి విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది. మూడేళ్ల కిందట ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి గట్టి ప్రయత్నమే జరిగింది. రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు. ఇక సినిమా విడుదల కావడం లాంఛనమే అనుకుంటున్న సమయంలో మళ్లీ బ్రేక్ పడింది. రిలీజ్ రోజు ఉదయం ఫైనాన్షియర్లు అడ్డు పడటంతో సినిమా థియేటర్లకు రాకుండా ఆగిపోయింది. ఆ తర్వాత దీని గురించి ఊసే లేదు.
ఐతే గత ఏడాది నుంచి ఓటీటీల హవా నడుస్తుండటంతో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి.. నేరుగా డిజిటల్ రిలీజ్కు ఈ సినిమాను సిద్ధం చేసే అవకాశాలున్నట్లు వార్తలొచ్చాయి కానీ.. అది కూడా కార్యరూపం దాల్చలేదు. కాగా ఇప్పుడు ఉన్నట్లుండి ‘ఆరడుగుల బుల్లెట్’ వార్తల్లోకి వచ్చింది. దీని నిర్మాత రమేష్.. ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు. తమ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన నేపథ్యంలో మళ్లీ థియేటర్లు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ‘ఆరడుగుల బుల్లెట్’ థియేటర్లలోకే వస్తుందని స్పష్టం చేశారు.
ఐతే ఎప్పుడో ఏడేళ్ల కిందట మొదలైన సినిమాను ఇప్పుడు చూస్తే అందులో పాత వాసనలు గుప్పుమనడం ఖాయం. గోపీచంద్, నయనతార లుక్స్ కూడా పాతగా అనిపించొచ్చు. మరి ఇలాంటి సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. అన్నింటికీ మించి అసలు ఈసారైనా పక్కాగా ‘ఆరడుగుల బుల్లెట్’ రిలీజవుతుందో లేదో చూడాలి.
This post was last modified on June 21, 2021 1:12 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…