జబర్దస్త్ తరహా కామెడీ షోల్లో కమెడియన్లు హద్దులు దాటి మాట్లాడటం.. ఒకరి మీద ఒకరు పంచ్లేసుకోవడం.. కొన్ని సందర్భాల్లో జడ్జిలు, యాంకర్ల మీద పంచ్లు పడిపోవడం మామూలే. చూసేవాళ్లకు అతిగా అనిపించినా.. షోలో భాగమైన వాళ్లు మాత్రం అన్నింటినీ సరదాగానే తీసుకుంటుంటారు. అవి వివాదం కావడం అరుదు. ఐతే షో మధ్యలో కొన్నిసార్లు మాత్రం ఏదో జరిగిపోయినట్లు ప్రోమోలు కట్ చేసి వదులుతుంటారు. తీరా ఎపిసోడ్ చూస్తే ప్రోమోలో ఉన్నంత సీరియస్నెస్ షోలో లేదని అర్థమవుతుంది.
మరి జబర్దస్త్ షోకు సంబంధించిన కొత్త ప్రోమో ఈ టైపుదేనో ఏమో చెప్పలేం కానీ.. అందులో యాంకర్ అనసూయ ఓ మాటకు హర్ట్ అయి షో నుంచి సీరియస్గా వాకౌట్ చేసి వెళ్లిపోయినట్లు చూపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రోమో ఇప్పుడు యూట్యూబ్లో వైరల్ అవుతోంది. ఈ నెల 24న ప్రసారం కాబోయే షోకు సంబంధించిన ప్రోమో ఇది. యూట్యూబ్లో ఇంటర్వ్యూలతో ఫేమస్ అయిన శివను హైపర్ ఆది తన స్కిట్ కోసం తీసుకొచ్చాడు. ఐతే షో చివర్లో శివ అనసూయను ఓ ప్రశ్న అడిగాడు.
ఇలాంటి పొట్టి పొట్టి డ్రెస్సులేంటి అంటూ సోషల్ మీడియాలో జనాలు కామెంట్లు పెడతారు కదా.. మీకేమనిపిస్తుంది అని అడిగాడు. దీనికి అనసూయ బదులిస్తూ.. బయటి వాళ్లకు ఇండస్ట్రీ గురించి తెలియదు కాబట్టి ఇలా అడగొచ్చు. కానీ మీరు ఇక్కడే ఉంటూ ఇలా అడిగారేంటి అని ఎదురు ప్రశ్నించింది. దీనికి కొనసాగింపుగా ఇది నా పర్సనల్ అని వ్యాఖ్యానించింది. ఐతే శివ దానికి ఊరుకోకుండా మీ పర్సనల్ అయితే మీ ఇంట్లో చూసుకోవచ్చు కదా అన్నాడు. దీనికి అనసూయ హర్టయింది. ఆది వైపు చూస్తూ ఎవరెవరినో తీసుకొచ్చి ఏంటీ ప్రశ్నలు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
కెమెరా నుంచి ఔట్ ఫోకస్ అయ్యాక కూడా మీకు తెలియకుండానే ఇదంతా జరుగుతోందా అంటూ ఆగ్రహంగా బయటికి నడిచింది అనసూయ. ఆమెకు సర్దిచెప్పి లోపలికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు చూపిస్తూ ప్రోమోను ముగించారు. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ నెల 24న రాబోయే కొత్త ఎపిసోడ్ చూడాల్సిందే.
This post was last modified on June 21, 2021 10:36 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…