జబర్దస్త్ తరహా కామెడీ షోల్లో కమెడియన్లు హద్దులు దాటి మాట్లాడటం.. ఒకరి మీద ఒకరు పంచ్లేసుకోవడం.. కొన్ని సందర్భాల్లో జడ్జిలు, యాంకర్ల మీద పంచ్లు పడిపోవడం మామూలే. చూసేవాళ్లకు అతిగా అనిపించినా.. షోలో భాగమైన వాళ్లు మాత్రం అన్నింటినీ సరదాగానే తీసుకుంటుంటారు. అవి వివాదం కావడం అరుదు. ఐతే షో మధ్యలో కొన్నిసార్లు మాత్రం ఏదో జరిగిపోయినట్లు ప్రోమోలు కట్ చేసి వదులుతుంటారు. తీరా ఎపిసోడ్ చూస్తే ప్రోమోలో ఉన్నంత సీరియస్నెస్ షోలో లేదని అర్థమవుతుంది.
మరి జబర్దస్త్ షోకు సంబంధించిన కొత్త ప్రోమో ఈ టైపుదేనో ఏమో చెప్పలేం కానీ.. అందులో యాంకర్ అనసూయ ఓ మాటకు హర్ట్ అయి షో నుంచి సీరియస్గా వాకౌట్ చేసి వెళ్లిపోయినట్లు చూపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రోమో ఇప్పుడు యూట్యూబ్లో వైరల్ అవుతోంది. ఈ నెల 24న ప్రసారం కాబోయే షోకు సంబంధించిన ప్రోమో ఇది. యూట్యూబ్లో ఇంటర్వ్యూలతో ఫేమస్ అయిన శివను హైపర్ ఆది తన స్కిట్ కోసం తీసుకొచ్చాడు. ఐతే షో చివర్లో శివ అనసూయను ఓ ప్రశ్న అడిగాడు.
ఇలాంటి పొట్టి పొట్టి డ్రెస్సులేంటి అంటూ సోషల్ మీడియాలో జనాలు కామెంట్లు పెడతారు కదా.. మీకేమనిపిస్తుంది అని అడిగాడు. దీనికి అనసూయ బదులిస్తూ.. బయటి వాళ్లకు ఇండస్ట్రీ గురించి తెలియదు కాబట్టి ఇలా అడగొచ్చు. కానీ మీరు ఇక్కడే ఉంటూ ఇలా అడిగారేంటి అని ఎదురు ప్రశ్నించింది. దీనికి కొనసాగింపుగా ఇది నా పర్సనల్ అని వ్యాఖ్యానించింది. ఐతే శివ దానికి ఊరుకోకుండా మీ పర్సనల్ అయితే మీ ఇంట్లో చూసుకోవచ్చు కదా అన్నాడు. దీనికి అనసూయ హర్టయింది. ఆది వైపు చూస్తూ ఎవరెవరినో తీసుకొచ్చి ఏంటీ ప్రశ్నలు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
కెమెరా నుంచి ఔట్ ఫోకస్ అయ్యాక కూడా మీకు తెలియకుండానే ఇదంతా జరుగుతోందా అంటూ ఆగ్రహంగా బయటికి నడిచింది అనసూయ. ఆమెకు సర్దిచెప్పి లోపలికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు చూపిస్తూ ప్రోమోను ముగించారు. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ నెల 24న రాబోయే కొత్త ఎపిసోడ్ చూడాల్సిందే.
This post was last modified on June 21, 2021 10:36 am
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…