జబర్దస్త్ తరహా కామెడీ షోల్లో కమెడియన్లు హద్దులు దాటి మాట్లాడటం.. ఒకరి మీద ఒకరు పంచ్లేసుకోవడం.. కొన్ని సందర్భాల్లో జడ్జిలు, యాంకర్ల మీద పంచ్లు పడిపోవడం మామూలే. చూసేవాళ్లకు అతిగా అనిపించినా.. షోలో భాగమైన వాళ్లు మాత్రం అన్నింటినీ సరదాగానే తీసుకుంటుంటారు. అవి వివాదం కావడం అరుదు. ఐతే షో మధ్యలో కొన్నిసార్లు మాత్రం ఏదో జరిగిపోయినట్లు ప్రోమోలు కట్ చేసి వదులుతుంటారు. తీరా ఎపిసోడ్ చూస్తే ప్రోమోలో ఉన్నంత సీరియస్నెస్ షోలో లేదని అర్థమవుతుంది.
మరి జబర్దస్త్ షోకు సంబంధించిన కొత్త ప్రోమో ఈ టైపుదేనో ఏమో చెప్పలేం కానీ.. అందులో యాంకర్ అనసూయ ఓ మాటకు హర్ట్ అయి షో నుంచి సీరియస్గా వాకౌట్ చేసి వెళ్లిపోయినట్లు చూపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రోమో ఇప్పుడు యూట్యూబ్లో వైరల్ అవుతోంది. ఈ నెల 24న ప్రసారం కాబోయే షోకు సంబంధించిన ప్రోమో ఇది. యూట్యూబ్లో ఇంటర్వ్యూలతో ఫేమస్ అయిన శివను హైపర్ ఆది తన స్కిట్ కోసం తీసుకొచ్చాడు. ఐతే షో చివర్లో శివ అనసూయను ఓ ప్రశ్న అడిగాడు.
ఇలాంటి పొట్టి పొట్టి డ్రెస్సులేంటి అంటూ సోషల్ మీడియాలో జనాలు కామెంట్లు పెడతారు కదా.. మీకేమనిపిస్తుంది అని అడిగాడు. దీనికి అనసూయ బదులిస్తూ.. బయటి వాళ్లకు ఇండస్ట్రీ గురించి తెలియదు కాబట్టి ఇలా అడగొచ్చు. కానీ మీరు ఇక్కడే ఉంటూ ఇలా అడిగారేంటి అని ఎదురు ప్రశ్నించింది. దీనికి కొనసాగింపుగా ఇది నా పర్సనల్ అని వ్యాఖ్యానించింది. ఐతే శివ దానికి ఊరుకోకుండా మీ పర్సనల్ అయితే మీ ఇంట్లో చూసుకోవచ్చు కదా అన్నాడు. దీనికి అనసూయ హర్టయింది. ఆది వైపు చూస్తూ ఎవరెవరినో తీసుకొచ్చి ఏంటీ ప్రశ్నలు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
కెమెరా నుంచి ఔట్ ఫోకస్ అయ్యాక కూడా మీకు తెలియకుండానే ఇదంతా జరుగుతోందా అంటూ ఆగ్రహంగా బయటికి నడిచింది అనసూయ. ఆమెకు సర్దిచెప్పి లోపలికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు చూపిస్తూ ప్రోమోను ముగించారు. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ నెల 24న రాబోయే కొత్త ఎపిసోడ్ చూడాల్సిందే.
This post was last modified on June 21, 2021 10:36 am
రాజమౌళి కంటే ముందు సౌత్ ఇండియన్ సినిమా స్థాయిని పెంచి.. అద్భుతమైన కథలు, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, సాంకేతిక…
హిరణ్యకశ్యప.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చర్చల్లో ఉన్న చిత్రం. సీనియర్ దర్శకుడు గుణశేఖర్.. రుద్రమదేవి తర్వాత తీయాలనుకున్న సినిమా…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…
విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్కు న్యూజిలాండ్ షాక్…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక…