గత ఏడాది సంక్రాంతికి విడుదలైన భారీ విజయం సాధించిన తెలుగు చిత్రం ‘అల వైకుంఠపురములో’. అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం అంచనాల్ని మించిపోయి అనూహ్య విజయాన్నందుకుంది. దానికి వచ్చిన టాక్కు సూపర్ హిట్టో బ్లాక్బస్టరో కావాలి కానీ.. ఏకంగా నాన్-బాహుబలి హిట్ కావడమే ఆశ్చర్యం.
చాన్నాళ్ల తర్వాత త్రివిక్రమ్ నుంచి వచ్చిన ఈ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు సంక్రాంతి టైం బాగా కలిసొచ్చింది. ఈ చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతుండటం విశేషం. ఐతే ఇక్కడ అల్లు అర్జున్ మాదిరి అక్కడ పెద్ద స్టార్ ఏమీ హీరోగా నటించట్లేదు. వర్ధమాన కథానాయకుడు కార్తీక్ ఆర్యన్.. అతడికి జోడీగా కృతి సనన్ నటిస్తున్నారు. రోహిత్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏక్తా కపూర్తో కలిసి ఒరిజినల్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మిస్తుండటం విశేషం.
‘అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్కు టైటిల్ కూడా ఖరారైపోయింది. ‘షెజాదా’ అనే పేరు పెట్టారు ఈ సినిమాకు. షెజాద్ అంటే హిందీలో యువరాజు అని అర్థం. కథ ప్రకారం చూస్తే ఈ సినిమాకు ఇది యాప్ట్ టైటిల్ అనడంలో సందేహం లేదు. ఇక ఒరిజినల్లో టబు చేసిన కీలక పాత్రను హిందీలో మనీషా కొయిరాలా చేయబోతోంది. విలక్షణ నటుడు పరేష్ రావల్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. బహుశా ఆయన సచిన్ ఖేద్కర్ చేసిన టబు తండ్రి పాత్రలో కనిపించే అవకాశముంది.
జయరాం, సుశాంత్ పాత్రలకు ఎవరిని ఎంచుకున్నారో వెల్లడి కాలేదు. సీనియర్ దర్శకుడు డేవిడ్ ధావన్ తనయుడైన రోహిత్ ధావన్ డిషూమ్, దేశీ బాయ్జ్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఎంటర్టైనర్లు బాగా తీస్తాడని పేరు తెచ్చుకున్న రోహిత్కు ఇంకా పెద్ద విజయం అయితే దక్కలేదు. ‘అల వైకుంఠపురములో’ రీమేక్ ఆ లోటును తీరుస్తుందేమో చూడాలి.
This post was last modified on June 21, 2021 12:15 pm
తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ భాషా భేదం లేదు. కంటెంట్ బాగుంటే చాలు కన్నడ, తమిళ, మలయాళం, ఇంగ్లీష్ అనే తేడాలు…
గత ఏడాది డిసెంబర్ లో అఖండ 2 తాండవం తర్వాత బాలకృష్ణ నుంచి కొత్త సినిమా రాలేదు. ముందు పీరియాడిక్…
వరుసగా ఆరు ఫ్లాపులు ఎదుర్కొన్న రవితేజకు.. ‘ఇరుముడి’ రూపంలో ఒక మోస్తరు విజయం దక్కినా చాలని చూశారు అభిమానులు. కానీ…
ఇటీవల ఇద్దరు ఫోక్ డ్యాన్సర్లకు సంబంధించిన వ్యక్తిగత వివాదం సోషల్ మీడియాలో, మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే…
ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలోని సత్య నికేతన్ ప్రాంతంలో 4 అంతస్తుల భవనం హఠాత్తుగా కుప్పుకూలిన ఘటన షాకింగ్…
మలయాళం నుంచి కథానాయికలను తెలుగులోకి తీసుకురావడం కొత్త కాదు. నయనతార, మమత మోహన్ దాస్, కీర్తి సురేష్ లాంటి చాలామంది…