ఈ రోజు ఫాదర్స్ డే. సినీ ప్రముఖుల్లో చాలామంది తమ తండ్రుల గొప్పదనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మీడియాతో మాట్లాడుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగిన కన్నడ భామ రష్మిక మందన్నా సైతం ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి మదన్తో అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. ఈ సందర్భంగా ఒకప్పుడు తాను తెలుగులో సినిమాలు చేయడం గురించి భయపడుతుంటే తన తండ్రే ధైర్యం చెప్పి టాలీవుడ్కు పంపించాడని.. ఈ రోజు తాను ఇంతమంది తెలుగు ప్రేక్షకుల అభిమానం సంపాదించుకుని ఇక్కడ పెద్ద హీరోయిన్ అయ్యానంటే ఆయనే కారణమని చెప్పింది.
మా నాన్న మదన్ వ్యాపార రీత్యా ఎప్పుడూ బిజీగా ఉండేవారు. నేను చాలా వరకు హాస్టల్లో ఉండి చదువుకున్నా. దీంతో చిన్నతనంలో నాన్నతో అంతగా అనుబంధం ఉండేది కాదు. ఆయనతో ఎక్కువగా గడపలేకపోయా. దీంతో తండ్రి ప్రేమపై సందేహాలు నెలకొన్నాయి. కానీ పెద్దయ్యాక మా నాన్న ప్రేమ ఎంత గొప్పదో అర్థమైంది. ఆయనెంత పని ఒత్తిడిలో ఉన్నా నాకు ప్రతి విషయంలోనూ అండగా ఉండేవారు. నేను కన్నడ సినిమాల్లో తొలి అడుగులు వేస్తున్నపుడు వెంకీ కుడుముల నన్ను ‘ఛలో’ సినిమాతో తెలుగులో పరిచయం చేయాలనుకున్నారు. కానీ పెద్ద ఇండస్ట్రీ అయిన టాలీవుడ్లో సినిమా చేయడానికి నేను భయపడ్డా. అప్పుడు నాన్నే తెలుగు సినీ పరిశ్రమ చాలా మంచిదని, గొప్పదని చెప్పి నాతో ఇక్కడ సినిమా చేయించారు.
కాబట్టి నేనిప్పుడు టాలీవుడ్లో ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు నాన్నే కారణం అని చెప్పింది రష్మిక. ‘ఛలో’ సూపర్ హిట్ కావడం.. ఆ తర్వాత నటించిన ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ కావడంతో రష్మిక వెనుదిరిగి చూసుకోలేదు. మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా మంచి విజయం సాధించంతో రష్మిక ఇప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది.
This post was last modified on June 20, 2021 4:48 pm
సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులో ఇప్పుడు ఒక కొత్త పవర్ హిట్టర్ పేరు గట్టిగా వినిపిస్తోంది.. అతనే అనికేత్ వర్మ.…
సాధారణంగా పేదలకు ప్రభుత్వాలు కట్టించి ఇచ్చే ఇళ్లు.. అనగానే ఎలాంటి వసతులు ఉండవని.. ఇరుకు ఇరుగ్గా ఉంటాయని భావిస్తారు. సాధారణంగా…
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తన బలహీనతలను బయటపెట్టుకుంది. బౌలింగ్లో పస లేదు, బ్యాటింగ్లో…
రిలీజ్ డేట్ల వ్యవహారం భలే మలుపులు తిరుగుతోంది. నిన్న లెనిన్ టీమ్ తమ విడుదల తేదీని జూన్ 26కి వాయిదా…
రాములమ్మగా యావత్తు తెలుగు ప్రజల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న విజయశాంతి...ప్రస్తుతం అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అయినప్పటికీ…
సోషల్ మీడియాలో కొన్ని టాపిక్స్ విపరీతమైన డిస్కషన్ కు నోచుకుంటున్నాయి. వాటిలో మొదటిది పెద్ది పోస్ట్ పోన్. ఏప్రిల్ 30…