Movie News

రష్మిక భయపడ్డా.. తండ్రే చేయించాడట


ఈ రోజు ఫాదర్స్ డే. సినీ ప్రముఖుల్లో చాలామంది తమ తండ్రుల గొప్పదనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మీడియాతో మాట్లాడుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కన్నడ భామ రష్మిక మందన్నా సైతం ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి మదన్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. ఈ సందర్భంగా ఒకప్పుడు తాను తెలుగులో సినిమాలు చేయడం గురించి భయపడుతుంటే తన తండ్రే ధైర్యం చెప్పి టాలీవుడ్‌కు పంపించాడని.. ఈ రోజు తాను ఇంతమంది తెలుగు ప్రేక్షకుల అభిమానం సంపాదించుకుని ఇక్కడ పెద్ద హీరోయిన్ అయ్యానంటే ఆయనే కారణమని చెప్పింది.

మా నాన్న మదన్ వ్యాపార రీత్యా ఎప్పుడూ బిజీగా ఉండేవారు. నేను చాలా వరకు హాస్టల్లో ఉండి చదువుకున్నా. దీంతో చిన్నతనంలో నాన్నతో అంతగా అనుబంధం ఉండేది కాదు. ఆయనతో ఎక్కువగా గడపలేకపోయా. దీంతో తండ్రి ప్రేమపై సందేహాలు నెలకొన్నాయి. కానీ పెద్దయ్యాక మా నాన్న ప్రేమ ఎంత గొప్పదో అర్థమైంది. ఆయనెంత పని ఒత్తిడిలో ఉన్నా నాకు ప్రతి విషయంలోనూ అండగా ఉండేవారు. నేను కన్నడ సినిమాల్లో తొలి అడుగులు వేస్తున్నపుడు వెంకీ కుడుముల నన్ను ‘ఛలో’ సినిమాతో తెలుగులో పరిచయం చేయాలనుకున్నారు. కానీ పెద్ద ఇండస్ట్రీ అయిన టాలీవుడ్లో సినిమా చేయడానికి నేను భయపడ్డా. అప్పుడు నాన్నే తెలుగు సినీ పరిశ్రమ చాలా మంచిదని, గొప్పదని చెప్పి నాతో ఇక్కడ సినిమా చేయించారు.

కాబట్టి నేనిప్పుడు టాలీవుడ్లో ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు నాన్నే కారణం అని చెప్పింది రష్మిక. ‘ఛలో’ సూపర్ హిట్ కావడం.. ఆ తర్వాత నటించిన ‘గీత గోవిందం’ బ్లాక్ ‌బస్టర్ కావడంతో రష్మిక వెనుదిరిగి చూసుకోలేదు. మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా మంచి విజయం సాధించంతో రష్మిక ఇప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది.

This post was last modified on June 20, 2021 4:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు మాటనే పెడచెవిన పెడుతున్నారా..?

సుపరిపాలనలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిది అందె వేసిన చెయ్యి. ప్రజలకు మెరుగైన పాలన అందించే విషయంలో నిత్యం…

47 minutes ago

వారం గ్యాప్ – మెగాస్టార్ VS మాస్ రాజా ?

పెద్ద సినిమాలకు విడుదల తేదీ దోబూచులాటలు తప్పడం లేదు. ముందు ఒక డేట్ అనుకోవడం, తర్వాత దానికి కట్టుబడలేక మార్చుకోవడం,…

1 hour ago

వదినమ్మకు మద్దతు.. అన్నయ్యకు చీవాట్లు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డిపై ఐటీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు చేబ్రోలు…

1 hour ago

పిలవంగానే వచ్చిన జోగి… విచారణలో ఏం చెప్పారు?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ శుక్రవారం సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. టీడీపీ అధినేత,…

2 hours ago

ప్ర‌భుత్వం అంటే ఇదీ.. బాబు గురించి జాతీయ మీడియా!

ప్ర‌భుత్వం అంటే ఇదీ.. అంటూ జాతీయ మీడియా ఏపీలోని చంద్ర‌బాబు నేతృత్వంలో ఉన్న కూట‌మి స‌ర్కారుపై ప్ర‌శంస‌లు గుప్పించింది. నేటితో…

3 hours ago

‘గూగుల్’లో లేఆఫ్ లు!.. ఏఐ ప్రభావమేనా?

టెక్నాలజీ రంగంలో ప్రపంచంలోనే దిగ్గజ సంస్థగా పేరుగాంచిన గూగుల్… వరుసబెట్టి ఉద్యోగులను ఇంటికి పంపేస్తోంది. 2023 నుంచి గూగుల్ లో…

3 hours ago