భారతీయ ప్రేక్షకులను అమితంగా ఆకర్షించి.. అత్యధికంగా ఆదరణ పొందిన సీరియల్స్ ఏవి అంటే మరో మాట లేకుండా రామాయణ్, మహాభారత్ అని చెప్పొచ్చు. 80, 90 దశకాల మధ్య ఈ సీరియల్స్ రెండూ భారతీయ టీవీ ప్రేక్షకులనూ ఉర్రూతలూగించాయి. ఆ సీరియల్స్ వస్తే టీవీలకు అతుక్కుపోయేవాళ్లు ప్రేక్షకులు.
ఇటీవల లాక్ డౌన్ నేపథ్యంలో డీడీలో ఈ రెండు సీరియళ్లను పున:ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ వాటికి ఆదరణ దక్కలేదని వ్యూయర్ షిప్ చూస్తే అర్థమవుతుంది.
ఇంత ఆదరణ సంపాదించుకున్న సీరియల్స్లో ఒకటైన ‘రామాయణ్’ను బీబీసీ వాళ్లు సైతం ప్రసారం చేయాలనుకున్నారట. ఆసియాలో తమ ఛానెల్కు ఆదరణ పెంచుకోవడం కోసం వాళ్ల కళ్లు ‘రామాయణ్’ మీదే పడ్డాయట. ఇందుకోసం దీని దర్శకుడు రామానంద్ సాగర్తో సంప్రదింపులు కూడా జరిపారట.
మూడు దశాబ్దాల కిందట బీబీసీ వాళ్లు తన తండ్రితో ‘రామాయణ్’ హక్కుల కోసం సంప్రదింపులు జరిపిన విషయాన్ని రామానంద్ సాగర్ తనయుడు ప్రేమ్ సాగర్ తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో వెల్లడించాడు.
సీరియల్ హక్కుల కోసం సంప్రదింపులు జరిపేందుకు తమ స్టూడియోకే బీబీసీ వాళ్లు పిలిచారని.. దానికి తాను, తన తండ్రి, రాముడి పాత్ర పోషించిన అరుణ్ గోవిల్, రావణుడిగా నటించిన అరవింద్ త్రివేది కలిసి వెళ్లామని.. ఐతే రాముడి వేషంలో ఉన్న అరుణ్ను తమ స్టూడియో అంతటా నడవాలని, దాన్ని షూట్ చేసుకుంటామని బీబీసీ వాళ్లు అడిగారని.. మన వాళ్లు దైవంలా చూసే రాముడిని వాళ్లు ఏ దృష్టితో చూస్తున్నారో అర్థమైందని.. ఈ సీరియల్ తాలూకు భావోద్వేగాలను వారు అర్థం చేసుకోలేదని.. దీంతో రామానంద్ సాగర్కు కోపం వచ్చి వాళ్లతో డీల్కు అంగీకరించకుండా వచ్చేశారని ప్రేమ్ సాగర్ తెలిపాడు.
గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ బాగా గ్యాప్ తీసుకున్నారు. అతిథి పాత్ర కాబట్టి మన…
తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…
ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…