Movie News

‘రామాయణ్’ను బీబీసీ వాళ్లు కొనాలనుకున్నారా?

భారతీయ ప్రేక్షకులను అమితంగా ఆకర్షించి.. అత్యధికంగా ఆదరణ పొందిన సీరియల్స్ ఏవి అంటే మరో మాట లేకుండా రామాయణ్, మహాభారత్ అని చెప్పొచ్చు. 80, 90 దశకాల మధ్య ఈ సీరియల్స్ రెండూ భారతీయ టీవీ ప్రేక్షకులనూ ఉర్రూతలూగించాయి. ఆ సీరియల్స్ వస్తే టీవీలకు అతుక్కుపోయేవాళ్లు ప్రేక్షకులు.

ఇటీవల లాక్ డౌన్ నేపథ్యంలో డీడీలో ఈ రెండు సీరియళ్లను పున:ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ వాటికి ఆదరణ దక్కలేదని వ్యూయర్ షిప్ చూస్తే అర్థమవుతుంది.

ఇంత ఆదరణ సంపాదించుకున్న సీరియల్స్‌లో ఒకటైన ‘రామాయణ్’ను బీబీసీ వాళ్లు సైతం ప్రసారం చేయాలనుకున్నారట. ఆసియాలో తమ ఛానెల్‌కు ఆదరణ పెంచుకోవడం కోసం వాళ్ల కళ్లు ‘రామాయణ్’ మీదే పడ్డాయట. ఇందుకోసం దీని దర్శకుడు రామానంద్ సాగర్‌తో సంప్రదింపులు కూడా జరిపారట.

మూడు దశాబ్దాల కిందట బీబీసీ వాళ్లు తన తండ్రితో ‘రామాయణ్’ హక్కుల కోసం సంప్రదింపులు జరిపిన విషయాన్ని రామానంద్ సాగర్ తనయుడు ప్రేమ్ సాగర్ తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో వెల్లడించాడు.

సీరియల్ హక్కుల కోసం సంప్రదింపులు జరిపేందుకు తమ స్టూడియోకే బీబీసీ వాళ్లు పిలిచారని.. దానికి తాను, తన తండ్రి, రాముడి పాత్ర పోషించిన అరుణ్ గోవిల్, రావణుడిగా నటించిన అరవింద్ త్రివేది కలిసి వెళ్లామని.. ఐతే రాముడి వేషంలో ఉన్న అరుణ్‌ను తమ స్టూడియో అంతటా నడవాలని, దాన్ని షూట్ చేసుకుంటామని బీబీసీ వాళ్లు అడిగారని.. మన వాళ్లు దైవంలా చూసే రాముడిని వాళ్లు ఏ దృష్టితో చూస్తున్నారో అర్థమైందని.. ఈ సీరియల్ తాలూకు భావోద్వేగాలను వారు అర్థం చేసుకోలేదని.. దీంతో రామానంద్ సాగర్‌కు కోపం వచ్చి వాళ్లతో డీల్‌కు అంగీకరించకుండా వచ్చేశారని ప్రేమ్ సాగర్ తెలిపాడు.

Satya

Recent Posts

రాయ‌ల‌సీమ‌కు మరో పేరు

రాయ‌లసీమ‌ను కూట‌మి ప్ర‌భుత్వం పెట్టుబ‌డుల సీమ‌గా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు త‌ర‌లి వ‌స్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…

4 seconds ago

ప‌నికిరాని రూల్స్ మీద బాబు గారి కన్ను

బూజు ప‌ట్టిన‌, ప్ర‌జ‌ల‌కు ప‌నికిరాని రూల్స్‌ను బుట్ట‌దాఖ‌లు చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ…

49 minutes ago

పులిని చూసి వాత పెట్టుకోకూడదు

ప్రమోషన్లు చేసే పద్ధతిని సమూలంగా మార్చిన దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ముందు వరసలో ఉంటుంది. సినిమాతో సంబంధం లేని…

1 hour ago

ఆటలు ఆడుతూనే ఉన్న జన నాయకుడు

రాజకీయాల్లోకి రాకముందు తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించిన జన నాయకుడు ఆరు నెలల తర్వాత విడుదలవుతున్నా కూడా రిలీజ్…

1 hour ago

దెయ్యాలంటే మనోళ్లకు ప్రేమ ఎక్కువే

ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…

3 hours ago

ముద్రగడ పద్మనాభం కన్నుమూత

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…

3 hours ago