Movie News

‘రామాయణ్’ను బీబీసీ వాళ్లు కొనాలనుకున్నారా?

భారతీయ ప్రేక్షకులను అమితంగా ఆకర్షించి.. అత్యధికంగా ఆదరణ పొందిన సీరియల్స్ ఏవి అంటే మరో మాట లేకుండా రామాయణ్, మహాభారత్ అని చెప్పొచ్చు. 80, 90 దశకాల మధ్య ఈ సీరియల్స్ రెండూ భారతీయ టీవీ ప్రేక్షకులనూ ఉర్రూతలూగించాయి. ఆ సీరియల్స్ వస్తే టీవీలకు అతుక్కుపోయేవాళ్లు ప్రేక్షకులు.

ఇటీవల లాక్ డౌన్ నేపథ్యంలో డీడీలో ఈ రెండు సీరియళ్లను పున:ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ వాటికి ఆదరణ దక్కలేదని వ్యూయర్ షిప్ చూస్తే అర్థమవుతుంది.

ఇంత ఆదరణ సంపాదించుకున్న సీరియల్స్‌లో ఒకటైన ‘రామాయణ్’ను బీబీసీ వాళ్లు సైతం ప్రసారం చేయాలనుకున్నారట. ఆసియాలో తమ ఛానెల్‌కు ఆదరణ పెంచుకోవడం కోసం వాళ్ల కళ్లు ‘రామాయణ్’ మీదే పడ్డాయట. ఇందుకోసం దీని దర్శకుడు రామానంద్ సాగర్‌తో సంప్రదింపులు కూడా జరిపారట.

మూడు దశాబ్దాల కిందట బీబీసీ వాళ్లు తన తండ్రితో ‘రామాయణ్’ హక్కుల కోసం సంప్రదింపులు జరిపిన విషయాన్ని రామానంద్ సాగర్ తనయుడు ప్రేమ్ సాగర్ తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో వెల్లడించాడు.

సీరియల్ హక్కుల కోసం సంప్రదింపులు జరిపేందుకు తమ స్టూడియోకే బీబీసీ వాళ్లు పిలిచారని.. దానికి తాను, తన తండ్రి, రాముడి పాత్ర పోషించిన అరుణ్ గోవిల్, రావణుడిగా నటించిన అరవింద్ త్రివేది కలిసి వెళ్లామని.. ఐతే రాముడి వేషంలో ఉన్న అరుణ్‌ను తమ స్టూడియో అంతటా నడవాలని, దాన్ని షూట్ చేసుకుంటామని బీబీసీ వాళ్లు అడిగారని.. మన వాళ్లు దైవంలా చూసే రాముడిని వాళ్లు ఏ దృష్టితో చూస్తున్నారో అర్థమైందని.. ఈ సీరియల్ తాలూకు భావోద్వేగాలను వారు అర్థం చేసుకోలేదని.. దీంతో రామానంద్ సాగర్‌కు కోపం వచ్చి వాళ్లతో డీల్‌కు అంగీకరించకుండా వచ్చేశారని ప్రేమ్ సాగర్ తెలిపాడు.

This post was last modified on May 19, 2020 2:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago