Movie News

బాలయ్య కోసం మెహ్రీన్?

సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. చిరు, బాలయ్య, వెంకటేష్, నాగార్జున ఇలాంటి హీరోల సరసన నేటితరం హీరోయిన్లు రొమాన్స్ చేస్తుంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. అందుకే వారి వయసుకి తగ్గట్లుగా ఉన్న తారలను తీసుకొస్తున్నారు. వీరందరిలో బాలకృష్ణకి హీరోయిన్ ను సెట్ చేయడం చాలా కష్టంగా మారింది. ‘అఖండ’ సినిమా సమయంలో కూడా ఇదే సమస్య ఏర్పడింది. చేసేదేం లేక ఫేడౌట్ అయిపోయిన ప్రగ్యాజైస్వాల్ ను తీసుకొచ్చారు. మరో ముఖ్య పాత్ర కోసం పూర్ణని తీసుకున్నారు.

ఇప్పుడు బాలయ్య నెక్స్ట్ సినిమా విషయంలో కూడా దర్శకుడు గోపీచంద్ మలినేనికి ఇదే ఇష్యూ ఎదురవుతోంది. శృతిహాసన్, త్రిష లాంటి హీరోయిన్లను సంప్రదిస్తే వారు ఆఫర్ ని రిజెక్ట్ చేశారు. దీంతో హీరోయిన్ వేటలో పడ్డారు దర్శకుడు గోపీచంద్. ఈ క్రమంలో నటి మెహ్రీన్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే మెహ్రీన్ కి ఎంగేజ్మెంట్ అయింది. పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోదామని అనుకుంది. కానీ లాక్ డౌన్ కారణంగా పెళ్లి వాయిదా వేసుకుంది. పరిస్థితులు చక్కబడిన తరువాత పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో తనకు వస్తోన్న సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘ఎఫ్ 3’ సినిమా ఉండగా.. రీసెంట్ గా మారుతి-సంతోష్ శోభన్ సినిమా ఒప్పుకుంది. ఇప్పుడు బాలయ్య సినిమా ఆఫర్ రావడంతో అమ్మడు ఆలోచనలో పడినట్లు సమాచారం. బాలయ్య సినిమాలో నటిస్తే.. ఇక యంగ్ హీరోల సరసన అవకాశాలు రావేమోనని సందేహ పడుతుంది. ఆ కారణంగానే ఇంకా ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతుందట. మరేం జరుగుతుందో చూడాలి!

This post was last modified on June 20, 2021 12:24 pm

Share

Recent Posts

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

10 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

53 minutes ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

2 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

2 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

2 hours ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

5 hours ago