సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. చిరు, బాలయ్య, వెంకటేష్, నాగార్జున ఇలాంటి హీరోల సరసన నేటితరం హీరోయిన్లు రొమాన్స్ చేస్తుంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. అందుకే వారి వయసుకి తగ్గట్లుగా ఉన్న తారలను తీసుకొస్తున్నారు. వీరందరిలో బాలకృష్ణకి హీరోయిన్ ను సెట్ చేయడం చాలా కష్టంగా మారింది. ‘అఖండ’ సినిమా సమయంలో కూడా ఇదే సమస్య ఏర్పడింది. చేసేదేం లేక ఫేడౌట్ అయిపోయిన ప్రగ్యాజైస్వాల్ ను తీసుకొచ్చారు. మరో ముఖ్య పాత్ర కోసం పూర్ణని తీసుకున్నారు.
ఇప్పుడు బాలయ్య నెక్స్ట్ సినిమా విషయంలో కూడా దర్శకుడు గోపీచంద్ మలినేనికి ఇదే ఇష్యూ ఎదురవుతోంది. శృతిహాసన్, త్రిష లాంటి హీరోయిన్లను సంప్రదిస్తే వారు ఆఫర్ ని రిజెక్ట్ చేశారు. దీంతో హీరోయిన్ వేటలో పడ్డారు దర్శకుడు గోపీచంద్. ఈ క్రమంలో నటి మెహ్రీన్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే మెహ్రీన్ కి ఎంగేజ్మెంట్ అయింది. పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోదామని అనుకుంది. కానీ లాక్ డౌన్ కారణంగా పెళ్లి వాయిదా వేసుకుంది. పరిస్థితులు చక్కబడిన తరువాత పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో తనకు వస్తోన్న సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘ఎఫ్ 3’ సినిమా ఉండగా.. రీసెంట్ గా మారుతి-సంతోష్ శోభన్ సినిమా ఒప్పుకుంది. ఇప్పుడు బాలయ్య సినిమా ఆఫర్ రావడంతో అమ్మడు ఆలోచనలో పడినట్లు సమాచారం. బాలయ్య సినిమాలో నటిస్తే.. ఇక యంగ్ హీరోల సరసన అవకాశాలు రావేమోనని సందేహ పడుతుంది. ఆ కారణంగానే ఇంకా ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతుందట. మరేం జరుగుతుందో చూడాలి!
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…