మెగాస్టార్ చిరంజీవి చేతిలో ఒకటికి మూడు ప్రాజెక్టులున్నాయి ఇప్పుడు. కొరటాల శివతో చేస్తున్న ‘ఆచార్య’ చివరి దశలో ఉండగా.. ‘లూసిఫర్’ను సెట్స్ మీదికి తీసుకెళ్లడానికి రంగం సిద్ధమైంది. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్ను కూడా టైం చూసి పట్టాలెక్కించాల్సి ఉంది. ‘ఆచార్య’ కోసం చిరు కొన్ని రోజులే పని చేయాల్సి ఉంది. లాక్ డౌన్ షరతులు సడలించిన నేపథ్యంలో త్వరలోనే ఈ సినిమాను మొదలుపెట్టాలని చూస్తున్నారు.
ఐతే చిరు ఈ విరామం తర్వాత ముందుగా చిత్రీకరణలో పాల్గొనబోయేది ‘లూసిఫర్’ రీమేక్లో అని అంటున్నారు. ముందు ఆ సినిమా కోసం ఒక షెడ్యూల్ చేసి.. ఆ తర్వాత ‘ఆచార్య’ మీదికి వస్తారట. చిరు తాజా లుక్ చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. మెగాస్టార్ ప్రస్తుతం ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త లుక్లో కనిపిస్తుండటం విశేషం.
కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి తన ప్రాంతంలో రైతుల కోసం చేస్తున్న సేవ గురించి చెబుతూ, ఆయన్ని అభినందిస్తూ చిరంజీవి తాజాగా ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో రఘువీరాతో తనకున్న అనుబంధం గురించి వివరించారు. ఈ విషయాలను మించి ఇందులో నెటిజన్లన దృష్టిని ఆకర్షించింది చిరు లుక్. జుట్టును చక్కగా స్టైలింగ్ చేసుకున్న చిరు.. గడ్డం పెంచారు. ఐతే ఆ గడ్డం తెల్లబడి ఉండటం విశేషం. ఊరికే అలా పెంచి వదిలేసినట్లు కాకుండా లుక్ కోసం దాన్ని మెయింటైన్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది.
ఇది కచ్చితంగా ‘లూసిఫర్’ రీమేక్ కోసం సిద్ధమైన లుక్కే అని అందరూ చాలామంది అంటున్నారు. ‘లూసిఫర్’ ఒరిజినల్లో మోహన్ లాల్ దాదాపుగా ఇలాంటి లుక్తోనే కనిపిస్తారు. చిరు ఇలా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్తో కనిపిస్తే అది కచ్చితంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా అభిమానులకు ఈ లుక్ బాగా నచ్చేస్తుందనే అంచనా వేస్తున్నారు.
This post was last modified on June 19, 2021 4:00 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…