ఈ మధ్యకాలంలో చాలా మంది స్టార్లు డిజిటల్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్లు చాలా మంది వెబ్ సిరీస్ లు, వెబ్ ఫిలిమ్స్ ను ఒప్పుకుంటూ బిజీ అవుతున్నారు. కాజల్, తమన్నా, సమంత ఇలా చాలా మంది ఓటీటీల కోసం పని చేస్తున్నారు. నటి నిత్యామీనన్ కూడా గతేడాది డిజిటల్ ప్లాట్ ఫామ్ పై ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ సరసన ‘బ్రీత్… ఇన్ టు ది షాడోస్’ అనే సిరీస్ ల నటించింది. అమెజాన్ ప్రసారమవుతోన్న ఈ షోకి ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు నిత్యామీనన్ మరో వెబ్ సిరీస్ లో నటించబోతుందని సమాచారం. కాస్త ఫేమ్ ఉన్న తారలను ఓటీటీ సంస్థలు తమ ఆఫర్లతో లాక్ చేస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ నిత్యామీనన్ ను కూడా తమ వెబ్ సిరీస్ కోసం లాక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సిరీస్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఒక్కసారి స్క్రిప్ట్ ఫైనల్ అయితే షూటింగ్ ను మొదలుపెట్టేస్తారు. ఓ కన్నడ దర్శకుడు ఈ సిరీస్ ను డైరెక్ట్ చేయనున్నారట.
తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన నిత్యామీనన్ చివరిగా ‘నిన్నిలా నిన్నిలా’ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఆమె మలయాళంలో రెండు సినిమాల్లో నటిస్తోంది. అలానే తెలుగులో ‘గమనం’ అనే సినిమాలో క్యామియో రోల్ లో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవి కాకుండా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ లో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో కనిపించనుంది.
This post was last modified on June 19, 2021 2:09 pm
ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కి నిజంగానే బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. అదికార డీఎంకేతో…
మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…
టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…