ఈ మధ్యకాలంలో చాలా మంది స్టార్లు డిజిటల్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్లు చాలా మంది వెబ్ సిరీస్ లు, వెబ్ ఫిలిమ్స్ ను ఒప్పుకుంటూ బిజీ అవుతున్నారు. కాజల్, తమన్నా, సమంత ఇలా చాలా మంది ఓటీటీల కోసం పని చేస్తున్నారు. నటి నిత్యామీనన్ కూడా గతేడాది డిజిటల్ ప్లాట్ ఫామ్ పై ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ సరసన ‘బ్రీత్… ఇన్ టు ది షాడోస్’ అనే సిరీస్ ల నటించింది. అమెజాన్ ప్రసారమవుతోన్న ఈ షోకి ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు నిత్యామీనన్ మరో వెబ్ సిరీస్ లో నటించబోతుందని సమాచారం. కాస్త ఫేమ్ ఉన్న తారలను ఓటీటీ సంస్థలు తమ ఆఫర్లతో లాక్ చేస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ నిత్యామీనన్ ను కూడా తమ వెబ్ సిరీస్ కోసం లాక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సిరీస్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఒక్కసారి స్క్రిప్ట్ ఫైనల్ అయితే షూటింగ్ ను మొదలుపెట్టేస్తారు. ఓ కన్నడ దర్శకుడు ఈ సిరీస్ ను డైరెక్ట్ చేయనున్నారట.
తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన నిత్యామీనన్ చివరిగా ‘నిన్నిలా నిన్నిలా’ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఆమె మలయాళంలో రెండు సినిమాల్లో నటిస్తోంది. అలానే తెలుగులో ‘గమనం’ అనే సినిమాలో క్యామియో రోల్ లో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవి కాకుండా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ లో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో కనిపించనుంది.
This post was last modified on June 19, 2021 2:09 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…