ఈ మధ్యకాలంలో చాలా మంది స్టార్లు డిజిటల్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్లు చాలా మంది వెబ్ సిరీస్ లు, వెబ్ ఫిలిమ్స్ ను ఒప్పుకుంటూ బిజీ అవుతున్నారు. కాజల్, తమన్నా, సమంత ఇలా చాలా మంది ఓటీటీల కోసం పని చేస్తున్నారు. నటి నిత్యామీనన్ కూడా గతేడాది డిజిటల్ ప్లాట్ ఫామ్ పై ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ సరసన ‘బ్రీత్… ఇన్ టు ది షాడోస్’ అనే సిరీస్ ల నటించింది. అమెజాన్ ప్రసారమవుతోన్న ఈ షోకి ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు నిత్యామీనన్ మరో వెబ్ సిరీస్ లో నటించబోతుందని సమాచారం. కాస్త ఫేమ్ ఉన్న తారలను ఓటీటీ సంస్థలు తమ ఆఫర్లతో లాక్ చేస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ నిత్యామీనన్ ను కూడా తమ వెబ్ సిరీస్ కోసం లాక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సిరీస్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఒక్కసారి స్క్రిప్ట్ ఫైనల్ అయితే షూటింగ్ ను మొదలుపెట్టేస్తారు. ఓ కన్నడ దర్శకుడు ఈ సిరీస్ ను డైరెక్ట్ చేయనున్నారట.
తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన నిత్యామీనన్ చివరిగా ‘నిన్నిలా నిన్నిలా’ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఆమె మలయాళంలో రెండు సినిమాల్లో నటిస్తోంది. అలానే తెలుగులో ‘గమనం’ అనే సినిమాలో క్యామియో రోల్ లో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవి కాకుండా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ లో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో కనిపించనుంది.
This post was last modified on June 19, 2021 2:09 pm
ప్యాన్ ఇండియా సినిమాల వాయిదా పర్వం కొనసాగుతూనే ఉంది. జూన్ 13 విడుదలను లాక్ చేసుకుని ఆ మేరకు తమిళనాడు…
సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ గురించి తెలుగు నాట తెలియనివారెవరు.? మీడియాకి సంబంధించి ‘సీఈవో’ అన్న పదానికి పెర్ఫెక్ట్ నిర్వచనంగా రవిప్రకాష్…
బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ రియాల్టీ షో ఫేం శ్యామల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల…
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కలలు గన్న…
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత, సొంత అన్నపై ఆమె తీవ్రస్థాయిలో యుద్ధం…
పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్డేట్స్…