ఈ మధ్యకాలంలో చాలా మంది స్టార్లు డిజిటల్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్లు చాలా మంది వెబ్ సిరీస్ లు, వెబ్ ఫిలిమ్స్ ను ఒప్పుకుంటూ బిజీ అవుతున్నారు. కాజల్, తమన్నా, సమంత ఇలా చాలా మంది ఓటీటీల కోసం పని చేస్తున్నారు. నటి నిత్యామీనన్ కూడా గతేడాది డిజిటల్ ప్లాట్ ఫామ్ పై ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ సరసన ‘బ్రీత్… ఇన్ టు ది షాడోస్’ అనే సిరీస్ ల నటించింది. అమెజాన్ ప్రసారమవుతోన్న ఈ షోకి ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు నిత్యామీనన్ మరో వెబ్ సిరీస్ లో నటించబోతుందని సమాచారం. కాస్త ఫేమ్ ఉన్న తారలను ఓటీటీ సంస్థలు తమ ఆఫర్లతో లాక్ చేస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ నిత్యామీనన్ ను కూడా తమ వెబ్ సిరీస్ కోసం లాక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సిరీస్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఒక్కసారి స్క్రిప్ట్ ఫైనల్ అయితే షూటింగ్ ను మొదలుపెట్టేస్తారు. ఓ కన్నడ దర్శకుడు ఈ సిరీస్ ను డైరెక్ట్ చేయనున్నారట.
తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన నిత్యామీనన్ చివరిగా ‘నిన్నిలా నిన్నిలా’ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఆమె మలయాళంలో రెండు సినిమాల్లో నటిస్తోంది. అలానే తెలుగులో ‘గమనం’ అనే సినిమాలో క్యామియో రోల్ లో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవి కాకుండా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ లో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో కనిపించనుంది.
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…