Movie News

తమిళమ్మాయి.. తెలుగులో జోరు

తెలుగమ్మాయిలు చాలామందే తమిళ సినీ పరిశ్రమలో కథానాయికలుగా మంచి పేరు సంపాదించి.. అక్కడ సెటిలయ్యారు. ఐతే గత కొన్నేళ్లలో అచ్చమైన తమిళ అమ్మాయిలు తెలుగులోకి వచ్చి ఇక్కడ అవకాశాలు అందుకోవడం బాగా తగ్గిపోయింది. ఐతే హీరోయిన్ల సంగతలా ఉంచితే.. ఇప్పుడు ఓ తమిళ అమ్మాయి క్యారెక్టర్, విలన్ పాత్రలతో తెలుగులో బిజీ అయిపోతుండటం విశేషం. ఆ నటి పేరు.. వరలక్ష్మి శరత్ కుమార్.

గ్యాంగ్ లీడర్, బన్నీ, జయజానకి నాయక సహా తెలుగులో కొన్ని డైరెక్ట్ సినిమాలు చేసిన సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసత్వాన్ని కొనసాగిస్తూ ‘తెనాలి రామకృష్ణ’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి. ఐతే ఆ సినిమా వల్ల ఆమెకు పెద్దగా ప్రయోజనం ఏమీ కలగలేదు. కానీ ‘క్రాక్’ సినిమాతో వరలక్ష్మి దశ తిరిగిపోయింది. అందులో జయమ్మ పాత్ర అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘నాంది’లో చేసిన పాత్ర కూడా వరలక్ష్మికి మంచి పేరే తెచ్చింది.

ఈ ఊపులో వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకుంటోంది వరలక్ష్మి. ఇప్పటికే ‘క్రాక్’ దర్శకుడు గోపీచంద్ మలినేని.. నందమూరి బాలకృష్ణతో చేస్తున్న చేయబోతున్న సినిమాలో వరలక్ష్మికి ఒక కీలక పాత్ర దక్కింది. బాలయ్యతో సినిమా అంటే వరలక్ష్మి టాలీవుడ్ కెరీర్ మరో స్థాయికి చేరినట్లే.

ఇప్పుడేమో ఆమె మరో మంచి ఛాన్స్ పట్టేసినట్లు తెలుస్తోంది. జాంబిరెడ్డితో హిట్టు కొట్టిన ప్రశాంత్ వర్మ.. కొత్తగా ‘హనుమాన్’ పేరుతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో ‘జాంబి రెడ్డి’ ఫేమ్ తేజ సజ్జానే హీరో. ఈ చిత్రంలో కీలకమైన లేడీ క్యారెక్టర్లో వరలక్ష్మి నటించనుందట. ఆమెది హీరోయిన్ పాత్ర కాదు. తేజ పక్కన ఆమె కథానాయికగా కూడా సెట్టవ్వదు. హీరోయిన్ని మించి ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లో ఆమె కనిపించనుందట. ఓవైపు తమిళంలో క్యారెక్టర్, విలన్ పాత్రలు చేస్తూనే.. ఇంకోవైపు తెలుగులోనూ మంచి మంచి అవకాశాలతో వరలక్ష్మి కొన్నేళ్ల పాటు ఖాళీ లేకుండా డైరీని నింపేస్తుండటం విశేషం.

This post was last modified on June 19, 2021 1:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

2 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

3 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

4 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

5 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

6 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

6 hours ago