తెలుగమ్మాయిలు చాలామందే తమిళ సినీ పరిశ్రమలో కథానాయికలుగా మంచి పేరు సంపాదించి.. అక్కడ సెటిలయ్యారు. ఐతే గత కొన్నేళ్లలో అచ్చమైన తమిళ అమ్మాయిలు తెలుగులోకి వచ్చి ఇక్కడ అవకాశాలు అందుకోవడం బాగా తగ్గిపోయింది. ఐతే హీరోయిన్ల సంగతలా ఉంచితే.. ఇప్పుడు ఓ తమిళ అమ్మాయి క్యారెక్టర్, విలన్ పాత్రలతో తెలుగులో బిజీ అయిపోతుండటం విశేషం. ఆ నటి పేరు.. వరలక్ష్మి శరత్ కుమార్.
గ్యాంగ్ లీడర్, బన్నీ, జయజానకి నాయక సహా తెలుగులో కొన్ని డైరెక్ట్ సినిమాలు చేసిన సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసత్వాన్ని కొనసాగిస్తూ ‘తెనాలి రామకృష్ణ’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి. ఐతే ఆ సినిమా వల్ల ఆమెకు పెద్దగా ప్రయోజనం ఏమీ కలగలేదు. కానీ ‘క్రాక్’ సినిమాతో వరలక్ష్మి దశ తిరిగిపోయింది. అందులో జయమ్మ పాత్ర అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘నాంది’లో చేసిన పాత్ర కూడా వరలక్ష్మికి మంచి పేరే తెచ్చింది.
ఈ ఊపులో వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకుంటోంది వరలక్ష్మి. ఇప్పటికే ‘క్రాక్’ దర్శకుడు గోపీచంద్ మలినేని.. నందమూరి బాలకృష్ణతో చేస్తున్న చేయబోతున్న సినిమాలో వరలక్ష్మికి ఒక కీలక పాత్ర దక్కింది. బాలయ్యతో సినిమా అంటే వరలక్ష్మి టాలీవుడ్ కెరీర్ మరో స్థాయికి చేరినట్లే.
ఇప్పుడేమో ఆమె మరో మంచి ఛాన్స్ పట్టేసినట్లు తెలుస్తోంది. జాంబిరెడ్డితో హిట్టు కొట్టిన ప్రశాంత్ వర్మ.. కొత్తగా ‘హనుమాన్’ పేరుతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో ‘జాంబి రెడ్డి’ ఫేమ్ తేజ సజ్జానే హీరో. ఈ చిత్రంలో కీలకమైన లేడీ క్యారెక్టర్లో వరలక్ష్మి నటించనుందట. ఆమెది హీరోయిన్ పాత్ర కాదు. తేజ పక్కన ఆమె కథానాయికగా కూడా సెట్టవ్వదు. హీరోయిన్ని మించి ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లో ఆమె కనిపించనుందట. ఓవైపు తమిళంలో క్యారెక్టర్, విలన్ పాత్రలు చేస్తూనే.. ఇంకోవైపు తెలుగులోనూ మంచి మంచి అవకాశాలతో వరలక్ష్మి కొన్నేళ్ల పాటు ఖాళీ లేకుండా డైరీని నింపేస్తుండటం విశేషం.
This post was last modified on June 19, 2021 1:52 pm
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…