ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17 భాషల్లో.. అది కూడా 190 దేశాల్లో ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద గ్రాండ్ గా రిలీజ్ అయిన మూవీకి ఈ రోజు భారీ షాక్ తగిలింది. తన చిత్రాల ఎంపికలో వినూత్నంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకునే తమిళ స్టార్ హీరో ధనుష్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఈ రోజు (శుక్రవారం) ఆయన నటించిన ‘జగమే తందిరమ్’ ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద రిలీజ్ అయ్యింది.
తెలుగులో ఈ మూవీని ‘జగమే తంత్రం’ పేరుతో ఓటీటీ ఫ్లాట్ ఫాం అయిన నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ ధనుష్ కెరీర్ లో నలభయ్యోది. ఐశ్వర్యా లక్ష్మీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసే అవకాశం లేకపోవటంతో.. వీలైనన్ని భాషల్లో డబ్ చేసి ఏకకాలంలో విడుదల చేశారు.
రోటీన్ కు భిన్నంగా ఈ మూవీని మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం) 12.30 గంటల వేళలో విడుదల చేశారు. అనూహ్యంగా ఈ మూవీ విడుదల చేసిన గంటల్లోనే ఆన్ లైన్ లో లీక్ కావటం షాకింగ్ గా మారింది. ఇదే విషయాన్ని తమిళ వెబ్ సైట్లు కోడై కూస్తున్నాయి. పైరసీ మూవీలు అప్ లోడ్ చేసే వెబ్ సైట్ లో ఫుల్ మూవీ లీకైనట్లుగా చెబుతున్నారు. భారీ అంచనాలతో ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద విడుదలైన మూవీ కాస్తా లీక్ కావటం షాకింగ్ గా మారింది. హీరో ధనుష్ కు ఇదో ఎదురుదెబ్బగా చెప్పక తప్పదు. అదే సమయంలో లీక్ పై చిత్ర యూనిట్ తీవ్ర ఆందోళనతో ఉంది. కష్టం ఇలా లీక్ రూపంలో ఆన్ లైన్ పాలు కావటం ఎవరికైనా ఇబ్బందే.
This post was last modified on June 18, 2021 11:17 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…