ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17 భాషల్లో.. అది కూడా 190 దేశాల్లో ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద గ్రాండ్ గా రిలీజ్ అయిన మూవీకి ఈ రోజు భారీ షాక్ తగిలింది. తన చిత్రాల ఎంపికలో వినూత్నంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకునే తమిళ స్టార్ హీరో ధనుష్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఈ రోజు (శుక్రవారం) ఆయన నటించిన ‘జగమే తందిరమ్’ ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద రిలీజ్ అయ్యింది.
తెలుగులో ఈ మూవీని ‘జగమే తంత్రం’ పేరుతో ఓటీటీ ఫ్లాట్ ఫాం అయిన నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ ధనుష్ కెరీర్ లో నలభయ్యోది. ఐశ్వర్యా లక్ష్మీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసే అవకాశం లేకపోవటంతో.. వీలైనన్ని భాషల్లో డబ్ చేసి ఏకకాలంలో విడుదల చేశారు.
రోటీన్ కు భిన్నంగా ఈ మూవీని మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం) 12.30 గంటల వేళలో విడుదల చేశారు. అనూహ్యంగా ఈ మూవీ విడుదల చేసిన గంటల్లోనే ఆన్ లైన్ లో లీక్ కావటం షాకింగ్ గా మారింది. ఇదే విషయాన్ని తమిళ వెబ్ సైట్లు కోడై కూస్తున్నాయి. పైరసీ మూవీలు అప్ లోడ్ చేసే వెబ్ సైట్ లో ఫుల్ మూవీ లీకైనట్లుగా చెబుతున్నారు. భారీ అంచనాలతో ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద విడుదలైన మూవీ కాస్తా లీక్ కావటం షాకింగ్ గా మారింది. హీరో ధనుష్ కు ఇదో ఎదురుదెబ్బగా చెప్పక తప్పదు. అదే సమయంలో లీక్ పై చిత్ర యూనిట్ తీవ్ర ఆందోళనతో ఉంది. కష్టం ఇలా లీక్ రూపంలో ఆన్ లైన్ పాలు కావటం ఎవరికైనా ఇబ్బందే.
This post was last modified on June 18, 2021 11:17 pm
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…
స్టార్ హీరోలు నటించిన ప్యాన్ ఇండియా సినిమాలకు శాటిలైట్ ప్రీమియర్లు భారీ స్థాయిలో స్పందన తెచ్చుకుంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం…
గ్యారెంటీ కామెడీ ఉంటుందని అల్లరి నరేష్ సినిమాలకు పేరు. కానీ గత కొన్నేళ్లుగా ఈ జానర్ కు ఆదరణ తగ్గడం,…