ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17 భాషల్లో.. అది కూడా 190 దేశాల్లో ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద గ్రాండ్ గా రిలీజ్ అయిన మూవీకి ఈ రోజు భారీ షాక్ తగిలింది. తన చిత్రాల ఎంపికలో వినూత్నంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకునే తమిళ స్టార్ హీరో ధనుష్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఈ రోజు (శుక్రవారం) ఆయన నటించిన ‘జగమే తందిరమ్’ ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద రిలీజ్ అయ్యింది.
తెలుగులో ఈ మూవీని ‘జగమే తంత్రం’ పేరుతో ఓటీటీ ఫ్లాట్ ఫాం అయిన నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ ధనుష్ కెరీర్ లో నలభయ్యోది. ఐశ్వర్యా లక్ష్మీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసే అవకాశం లేకపోవటంతో.. వీలైనన్ని భాషల్లో డబ్ చేసి ఏకకాలంలో విడుదల చేశారు.
రోటీన్ కు భిన్నంగా ఈ మూవీని మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం) 12.30 గంటల వేళలో విడుదల చేశారు. అనూహ్యంగా ఈ మూవీ విడుదల చేసిన గంటల్లోనే ఆన్ లైన్ లో లీక్ కావటం షాకింగ్ గా మారింది. ఇదే విషయాన్ని తమిళ వెబ్ సైట్లు కోడై కూస్తున్నాయి. పైరసీ మూవీలు అప్ లోడ్ చేసే వెబ్ సైట్ లో ఫుల్ మూవీ లీకైనట్లుగా చెబుతున్నారు. భారీ అంచనాలతో ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద విడుదలైన మూవీ కాస్తా లీక్ కావటం షాకింగ్ గా మారింది. హీరో ధనుష్ కు ఇదో ఎదురుదెబ్బగా చెప్పక తప్పదు. అదే సమయంలో లీక్ పై చిత్ర యూనిట్ తీవ్ర ఆందోళనతో ఉంది. కష్టం ఇలా లీక్ రూపంలో ఆన్ లైన్ పాలు కావటం ఎవరికైనా ఇబ్బందే.
This post was last modified on June 18, 2021 11:17 pm
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…