ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17 భాషల్లో.. అది కూడా 190 దేశాల్లో ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద గ్రాండ్ గా రిలీజ్ అయిన మూవీకి ఈ రోజు భారీ షాక్ తగిలింది. తన చిత్రాల ఎంపికలో వినూత్నంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకునే తమిళ స్టార్ హీరో ధనుష్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఈ రోజు (శుక్రవారం) ఆయన నటించిన ‘జగమే తందిరమ్’ ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద రిలీజ్ అయ్యింది.
తెలుగులో ఈ మూవీని ‘జగమే తంత్రం’ పేరుతో ఓటీటీ ఫ్లాట్ ఫాం అయిన నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ ధనుష్ కెరీర్ లో నలభయ్యోది. ఐశ్వర్యా లక్ష్మీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసే అవకాశం లేకపోవటంతో.. వీలైనన్ని భాషల్లో డబ్ చేసి ఏకకాలంలో విడుదల చేశారు.
రోటీన్ కు భిన్నంగా ఈ మూవీని మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం) 12.30 గంటల వేళలో విడుదల చేశారు. అనూహ్యంగా ఈ మూవీ విడుదల చేసిన గంటల్లోనే ఆన్ లైన్ లో లీక్ కావటం షాకింగ్ గా మారింది. ఇదే విషయాన్ని తమిళ వెబ్ సైట్లు కోడై కూస్తున్నాయి. పైరసీ మూవీలు అప్ లోడ్ చేసే వెబ్ సైట్ లో ఫుల్ మూవీ లీకైనట్లుగా చెబుతున్నారు. భారీ అంచనాలతో ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద విడుదలైన మూవీ కాస్తా లీక్ కావటం షాకింగ్ గా మారింది. హీరో ధనుష్ కు ఇదో ఎదురుదెబ్బగా చెప్పక తప్పదు. అదే సమయంలో లీక్ పై చిత్ర యూనిట్ తీవ్ర ఆందోళనతో ఉంది. కష్టం ఇలా లీక్ రూపంలో ఆన్ లైన్ పాలు కావటం ఎవరికైనా ఇబ్బందే.
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…
ముంబైలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో…
తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది.…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…