మెగాస్టార్ చిరంజీవి లైనప్లో చాలామందికి నచ్చని ప్రాజెక్టు అంటే.. మెహర్ రమేష్ దర్శకత్వంలో చేయబోయేదే. శక్తి, షాడో లాంటి డిజాస్టర్లు తీసిన దర్శకుడితో సినిమా ఏంటని అభిమానులు ఎంతగా సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేసినప్పటికీ చిరు మాత్రం తన సమీప బంధువు, అలాగే తన సేవా కార్యక్రమాలను దగ్గరుండి చూసుకునే మెహర్ రమేష్ మీద అభిమానంతో అతడికి ఓ సినిమా ఇచ్చాడు.
మెహర్ సొంత కథతో కాకుండా తమిళంతలో హిట్టయిన ‘వేదాలం’ను రీమేక్ చేస్తుండటంతో మరీ కంగారు పడాల్సిన పని లేదనే అభిప్రాయాన్ని ఆయన సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును చిరు ఖరారు చేసి ఏడాది దాటింది. కానీ ఇప్పటిదాకా ఆ చిత్రం మొదలు కాలేదు. ఆచార్య ఆలస్యం కావడం, ‘లూసిఫర్’ రీమేక్ లైన్లో ఉండటం ఇందుకు కారణం. ఈ చిత్రం ఇంకా లాంఛనంగా మొదలు కానప్పటికీ.. సినిమా కోసం కొంత షూటింగ్ అయితే జరిగిందని సమాచారం.
చిరుతో మెహర్ చేయనున్న సినిమా కోసం కోల్కతాలో కొన్ని మాంటేజెస్ షాట్లు తీశాడట మెహర్ రమేష్. గత ఏడాది దుర్గాష్టమి సందర్భంగా కోల్కతాలో ఘనంగా జరిగిన దేవీ నవరాత్రుల సమయంలో తన టీంతో వెళ్లి ఈ మాంటేజ్ షాట్లు తీసుకుని వచ్చాడట మెహర్. ఇందుకోసం దాదాపు రూ.30 లక్షల ఖర్చయినట్లు సమాచారం.
కేవలం మాంటేజ్ షాట్లకే ఇంతా అని ఆశ్చర్యం కలగొచ్చు కానీ.. మెహర్ ఏం చేసినా ఇలా భారీగానే ఉంటుంది. అప్పట్లోనే ‘శక్తి’ సినిమాకు రూ.50 కోట్ల దాకా ఖర్చు చేయించిన ఘనుడతను. అంత పెద్ద డిజాస్టర్ తర్వాత కూడా ‘షాడో’ కోసం రూ.30 కోట్ల బడ్జెట్ పెట్టించాడు. ఇప్పుడిక చిరంజీవి సినిమా అంటే ఖర్చు మామూలుగా ఉంటుందా? ‘ఆచార్య’తో పాటు ‘లూసిఫర్’ రీమేక్ను పూర్తి చేయడానికి చిరు ఇంకో ఆరేడు నెలలైనా సమయం తీసుకోవచ్చు. వచ్చే ఏడాదే మెహర్ రమేష్ సినిమాను ఆయన సెట్స్ మీదికి తీసుకెళ్లే అవకాశముంది.
This post was last modified on June 18, 2021 11:11 pm
ఏపీ ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వాన్ని చక్కటి సమన్వయంతో ముందుకు నడిపిస్తున్న చంద్రబాబుకు 10 నెలలు పూర్తయ్యాయి. గత ఏడాది జూన్…
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…
యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…