మెగాస్టార్ చిరంజీవి లైనప్లో చాలామందికి నచ్చని ప్రాజెక్టు అంటే.. మెహర్ రమేష్ దర్శకత్వంలో చేయబోయేదే. శక్తి, షాడో లాంటి డిజాస్టర్లు తీసిన దర్శకుడితో సినిమా ఏంటని అభిమానులు ఎంతగా సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేసినప్పటికీ చిరు మాత్రం తన సమీప బంధువు, అలాగే తన సేవా కార్యక్రమాలను దగ్గరుండి చూసుకునే మెహర్ రమేష్ మీద అభిమానంతో అతడికి ఓ సినిమా ఇచ్చాడు.
మెహర్ సొంత కథతో కాకుండా తమిళంతలో హిట్టయిన ‘వేదాలం’ను రీమేక్ చేస్తుండటంతో మరీ కంగారు పడాల్సిన పని లేదనే అభిప్రాయాన్ని ఆయన సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును చిరు ఖరారు చేసి ఏడాది దాటింది. కానీ ఇప్పటిదాకా ఆ చిత్రం మొదలు కాలేదు. ఆచార్య ఆలస్యం కావడం, ‘లూసిఫర్’ రీమేక్ లైన్లో ఉండటం ఇందుకు కారణం. ఈ చిత్రం ఇంకా లాంఛనంగా మొదలు కానప్పటికీ.. సినిమా కోసం కొంత షూటింగ్ అయితే జరిగిందని సమాచారం.
చిరుతో మెహర్ చేయనున్న సినిమా కోసం కోల్కతాలో కొన్ని మాంటేజెస్ షాట్లు తీశాడట మెహర్ రమేష్. గత ఏడాది దుర్గాష్టమి సందర్భంగా కోల్కతాలో ఘనంగా జరిగిన దేవీ నవరాత్రుల సమయంలో తన టీంతో వెళ్లి ఈ మాంటేజ్ షాట్లు తీసుకుని వచ్చాడట మెహర్. ఇందుకోసం దాదాపు రూ.30 లక్షల ఖర్చయినట్లు సమాచారం.
కేవలం మాంటేజ్ షాట్లకే ఇంతా అని ఆశ్చర్యం కలగొచ్చు కానీ.. మెహర్ ఏం చేసినా ఇలా భారీగానే ఉంటుంది. అప్పట్లోనే ‘శక్తి’ సినిమాకు రూ.50 కోట్ల దాకా ఖర్చు చేయించిన ఘనుడతను. అంత పెద్ద డిజాస్టర్ తర్వాత కూడా ‘షాడో’ కోసం రూ.30 కోట్ల బడ్జెట్ పెట్టించాడు. ఇప్పుడిక చిరంజీవి సినిమా అంటే ఖర్చు మామూలుగా ఉంటుందా? ‘ఆచార్య’తో పాటు ‘లూసిఫర్’ రీమేక్ను పూర్తి చేయడానికి చిరు ఇంకో ఆరేడు నెలలైనా సమయం తీసుకోవచ్చు. వచ్చే ఏడాదే మెహర్ రమేష్ సినిమాను ఆయన సెట్స్ మీదికి తీసుకెళ్లే అవకాశముంది.
This post was last modified on June 18, 2021 11:11 pm
టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…