మెగాస్టార్ చిరంజీవి లైనప్లో చాలామందికి నచ్చని ప్రాజెక్టు అంటే.. మెహర్ రమేష్ దర్శకత్వంలో చేయబోయేదే. శక్తి, షాడో లాంటి డిజాస్టర్లు తీసిన దర్శకుడితో సినిమా ఏంటని అభిమానులు ఎంతగా సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేసినప్పటికీ చిరు మాత్రం తన సమీప బంధువు, అలాగే తన సేవా కార్యక్రమాలను దగ్గరుండి చూసుకునే మెహర్ రమేష్ మీద అభిమానంతో అతడికి ఓ సినిమా ఇచ్చాడు.
మెహర్ సొంత కథతో కాకుండా తమిళంతలో హిట్టయిన ‘వేదాలం’ను రీమేక్ చేస్తుండటంతో మరీ కంగారు పడాల్సిన పని లేదనే అభిప్రాయాన్ని ఆయన సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును చిరు ఖరారు చేసి ఏడాది దాటింది. కానీ ఇప్పటిదాకా ఆ చిత్రం మొదలు కాలేదు. ఆచార్య ఆలస్యం కావడం, ‘లూసిఫర్’ రీమేక్ లైన్లో ఉండటం ఇందుకు కారణం. ఈ చిత్రం ఇంకా లాంఛనంగా మొదలు కానప్పటికీ.. సినిమా కోసం కొంత షూటింగ్ అయితే జరిగిందని సమాచారం.
చిరుతో మెహర్ చేయనున్న సినిమా కోసం కోల్కతాలో కొన్ని మాంటేజెస్ షాట్లు తీశాడట మెహర్ రమేష్. గత ఏడాది దుర్గాష్టమి సందర్భంగా కోల్కతాలో ఘనంగా జరిగిన దేవీ నవరాత్రుల సమయంలో తన టీంతో వెళ్లి ఈ మాంటేజ్ షాట్లు తీసుకుని వచ్చాడట మెహర్. ఇందుకోసం దాదాపు రూ.30 లక్షల ఖర్చయినట్లు సమాచారం.
కేవలం మాంటేజ్ షాట్లకే ఇంతా అని ఆశ్చర్యం కలగొచ్చు కానీ.. మెహర్ ఏం చేసినా ఇలా భారీగానే ఉంటుంది. అప్పట్లోనే ‘శక్తి’ సినిమాకు రూ.50 కోట్ల దాకా ఖర్చు చేయించిన ఘనుడతను. అంత పెద్ద డిజాస్టర్ తర్వాత కూడా ‘షాడో’ కోసం రూ.30 కోట్ల బడ్జెట్ పెట్టించాడు. ఇప్పుడిక చిరంజీవి సినిమా అంటే ఖర్చు మామూలుగా ఉంటుందా? ‘ఆచార్య’తో పాటు ‘లూసిఫర్’ రీమేక్ను పూర్తి చేయడానికి చిరు ఇంకో ఆరేడు నెలలైనా సమయం తీసుకోవచ్చు. వచ్చే ఏడాదే మెహర్ రమేష్ సినిమాను ఆయన సెట్స్ మీదికి తీసుకెళ్లే అవకాశముంది.
ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార కూటమి, విపక్ష వైసీపీ మధ్య నిత్యం వాగ్యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి…
యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి తిరిగి ప్రబలుతోందా? అంటే... ఇతర ప్రాంతాల గురించి అటుంచితే... ఏపీ విషయంలో మాత్రం నిజమేనేమోననే…
దేశంలో తెలుగు ప్రేక్షకులంత పెద్ద మనసు ఇంకెవరికీ ఉండదంటూ ఇతర భాషల ఫిలిం మేకర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా తమిళ…
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…