మెగాస్టార్ చిరంజీవి లైనప్లో చాలామందికి నచ్చని ప్రాజెక్టు అంటే.. మెహర్ రమేష్ దర్శకత్వంలో చేయబోయేదే. శక్తి, షాడో లాంటి డిజాస్టర్లు తీసిన దర్శకుడితో సినిమా ఏంటని అభిమానులు ఎంతగా సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేసినప్పటికీ చిరు మాత్రం తన సమీప బంధువు, అలాగే తన సేవా కార్యక్రమాలను దగ్గరుండి చూసుకునే మెహర్ రమేష్ మీద అభిమానంతో అతడికి ఓ సినిమా ఇచ్చాడు.
మెహర్ సొంత కథతో కాకుండా తమిళంతలో హిట్టయిన ‘వేదాలం’ను రీమేక్ చేస్తుండటంతో మరీ కంగారు పడాల్సిన పని లేదనే అభిప్రాయాన్ని ఆయన సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును చిరు ఖరారు చేసి ఏడాది దాటింది. కానీ ఇప్పటిదాకా ఆ చిత్రం మొదలు కాలేదు. ఆచార్య ఆలస్యం కావడం, ‘లూసిఫర్’ రీమేక్ లైన్లో ఉండటం ఇందుకు కారణం. ఈ చిత్రం ఇంకా లాంఛనంగా మొదలు కానప్పటికీ.. సినిమా కోసం కొంత షూటింగ్ అయితే జరిగిందని సమాచారం.
చిరుతో మెహర్ చేయనున్న సినిమా కోసం కోల్కతాలో కొన్ని మాంటేజెస్ షాట్లు తీశాడట మెహర్ రమేష్. గత ఏడాది దుర్గాష్టమి సందర్భంగా కోల్కతాలో ఘనంగా జరిగిన దేవీ నవరాత్రుల సమయంలో తన టీంతో వెళ్లి ఈ మాంటేజ్ షాట్లు తీసుకుని వచ్చాడట మెహర్. ఇందుకోసం దాదాపు రూ.30 లక్షల ఖర్చయినట్లు సమాచారం.
కేవలం మాంటేజ్ షాట్లకే ఇంతా అని ఆశ్చర్యం కలగొచ్చు కానీ.. మెహర్ ఏం చేసినా ఇలా భారీగానే ఉంటుంది. అప్పట్లోనే ‘శక్తి’ సినిమాకు రూ.50 కోట్ల దాకా ఖర్చు చేయించిన ఘనుడతను. అంత పెద్ద డిజాస్టర్ తర్వాత కూడా ‘షాడో’ కోసం రూ.30 కోట్ల బడ్జెట్ పెట్టించాడు. ఇప్పుడిక చిరంజీవి సినిమా అంటే ఖర్చు మామూలుగా ఉంటుందా? ‘ఆచార్య’తో పాటు ‘లూసిఫర్’ రీమేక్ను పూర్తి చేయడానికి చిరు ఇంకో ఆరేడు నెలలైనా సమయం తీసుకోవచ్చు. వచ్చే ఏడాదే మెహర్ రమేష్ సినిమాను ఆయన సెట్స్ మీదికి తీసుకెళ్లే అవకాశముంది.
This post was last modified on June 18, 2021 11:11 pm
మనమేదో ఆహా ఓహో అంటూ ఛాన్స్ దొరికినప్పుడంతా మలయాళం సినిమాలను తెగ పొగిడేస్తూ ఉంటాం కాని అక్కడి దర్శకులు కూడా…
డివైడ్ టాక్ తెచ్చుకున్న చిన్న సినిమాలు థియేటర్లలో బలంగా నిలబడ్డం అంటే చిన్న విషయం కాదు. చెన్నై లవ్ స్టోరీ…
ఒకప్పుడు యుఎస్లో తెలుగు సినిమాలు విడుదల కావడాన్నే గొప్పగా భావించేవాళ్లం. అలాంటిది అది తెలుగు సినిమాలకు పెద్ద మార్కెట్గా తయారైంది. మన…
టికెట్ రేటు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ.. మల్టీప్లెక్సుల్లోనే సినిమాలు చూద్దాం అనుకునే ప్రేక్షకులు పెరిగిపోయారు గత కొన్నేళ్లలో. దాని…
వైసీపీ అధినేత జగన్ పర్యటనల్లో భాగంగా ఇటీవల కాలంలో `రప్పా-రప్పా` డైలాగులు తరచుగా వినిపించేవి. రప్పా-రప్పా అని రాసున్న బ్యానర్లు,…
వరుణ్ తేజ్ ప్రస్తుతం మనసులో అనుకుంటున్న మాట ఇదే. కొరియన్ కనకరాజుకి ఒక రోజు ముందే ప్రీమియర్లు వేయడం రిస్కని…