‘మాయ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి నందిని రాయ్. ఆ తరువాత సుధీర్ బాబు నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. కానీ ఈ సినిమాలేవీ నందినికి క్రేజ్ ను తీసుకురాలేకపోయాయి. ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఈ షోలో తన గ్లామర్ షోతో ప్రేక్షకులకు దగ్గరైంది. కానీ ఈ ఫేమ్ ను ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేకపోయింది. బిగ్ బాస్ తరువాత తెలుగులో ఒకట్రెండు సినిమాల్లో నటించినప్పటికీ ఏవీ వర్కవుట్ కాలేదు.
ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ నటించిన ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సిరీస్ లో ఓ సీన్ లో సహజత్వం కోసం తన కోస్టార్ వికాస్ నిజంగానే తన చెంప వాచిపోయేలా కొట్టాడని నందిని రాయ్ తెలిపింది. షూటింగ్ జరుగుతున్న సమయంలో సీన్ చాలా నేచురల్ గా రావాలనేది డైరెక్టర్ ఆదేశమని చెప్పింది.
అయితే తన తోటి నటుడు వికాస్ ముందుగా తనను పైపైన కొట్టి ఊరుకున్నాడని.. దీంతో సీన్ సరిగ్గా రాలేదని చెప్పింది. వెంటనే ఇద్దరం ఒక అండర్ స్టాండింగ్ కి వచ్చి నిజంగానే కొట్టుకోవాలనే నిర్ణయం తీసుకున్నామని గుర్తుచేసుకుంది. షాట్ రెడీ అనేసరికి ఇద్దరం చెంపలు వాచిపోయేలా కొట్టుకున్నామని.. ఆ సమయంలో వచ్చిన కన్నీళ్లు నిజమైనవని నందిని చెప్పుకొచ్చింది. వికాస్ కొట్టిన దెబ్బకు చాలాసేపటి వరకు తన బుగ్గ వాచిపోయిందని.. ఆ వాపు తగ్గిన తరువాత నెక్స్ట్ సీన్ షూట్ చేశారని తెలిపింది.
ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో నందిని రాయ్ పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తుంది. నటన మీద ఇష్టంతో ఊరి నుండి పట్నంకు వచ్చిన అమ్మాయిగా ఆమె పాత్రను డిజైన్ చేశారు. ‘ఆహా’లో ప్రసారమవుతోన్న ఈ సిరీస్ ను ఏడు ఎపిసోడ్ లతో రూపొందించారు.
పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…