‘మాయ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి నందిని రాయ్. ఆ తరువాత సుధీర్ బాబు నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. కానీ ఈ సినిమాలేవీ నందినికి క్రేజ్ ను తీసుకురాలేకపోయాయి. ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఈ షోలో తన గ్లామర్ షోతో ప్రేక్షకులకు దగ్గరైంది. కానీ ఈ ఫేమ్ ను ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేకపోయింది. బిగ్ బాస్ తరువాత తెలుగులో ఒకట్రెండు సినిమాల్లో నటించినప్పటికీ ఏవీ వర్కవుట్ కాలేదు.
ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ నటించిన ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సిరీస్ లో ఓ సీన్ లో సహజత్వం కోసం తన కోస్టార్ వికాస్ నిజంగానే తన చెంప వాచిపోయేలా కొట్టాడని నందిని రాయ్ తెలిపింది. షూటింగ్ జరుగుతున్న సమయంలో సీన్ చాలా నేచురల్ గా రావాలనేది డైరెక్టర్ ఆదేశమని చెప్పింది.
అయితే తన తోటి నటుడు వికాస్ ముందుగా తనను పైపైన కొట్టి ఊరుకున్నాడని.. దీంతో సీన్ సరిగ్గా రాలేదని చెప్పింది. వెంటనే ఇద్దరం ఒక అండర్ స్టాండింగ్ కి వచ్చి నిజంగానే కొట్టుకోవాలనే నిర్ణయం తీసుకున్నామని గుర్తుచేసుకుంది. షాట్ రెడీ అనేసరికి ఇద్దరం చెంపలు వాచిపోయేలా కొట్టుకున్నామని.. ఆ సమయంలో వచ్చిన కన్నీళ్లు నిజమైనవని నందిని చెప్పుకొచ్చింది. వికాస్ కొట్టిన దెబ్బకు చాలాసేపటి వరకు తన బుగ్గ వాచిపోయిందని.. ఆ వాపు తగ్గిన తరువాత నెక్స్ట్ సీన్ షూట్ చేశారని తెలిపింది.
ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో నందిని రాయ్ పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తుంది. నటన మీద ఇష్టంతో ఊరి నుండి పట్నంకు వచ్చిన అమ్మాయిగా ఆమె పాత్రను డిజైన్ చేశారు. ‘ఆహా’లో ప్రసారమవుతోన్న ఈ సిరీస్ ను ఏడు ఎపిసోడ్ లతో రూపొందించారు.
This post was last modified on June 18, 2021 10:53 pm
సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చేసిన రెండు సినిమాలతోనే చాలా ప్రామిసింగ్గా అనిపించిన వారసుల్లో ధ్రువ్ విక్రమ్ ఒకడు. అర్జున్…
సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తీసే సినిమాలో.. ఓ పెద్ద హీరో నటించినపుడు చిన్న సన్నివేశమైనా సరే సుక్కునే తీయాల్సి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా చాలా ఏళ్ల పాటు జడ్జిగా వ్యవహరించిన జబర్దస్త్ షోలో స్కిట్లు చేసే కమెడియన్లతో ఆమెకు మంచి…
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…