‘మాయ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి నందిని రాయ్. ఆ తరువాత సుధీర్ బాబు నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. కానీ ఈ సినిమాలేవీ నందినికి క్రేజ్ ను తీసుకురాలేకపోయాయి. ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఈ షోలో తన గ్లామర్ షోతో ప్రేక్షకులకు దగ్గరైంది. కానీ ఈ ఫేమ్ ను ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేకపోయింది. బిగ్ బాస్ తరువాత తెలుగులో ఒకట్రెండు సినిమాల్లో నటించినప్పటికీ ఏవీ వర్కవుట్ కాలేదు.
ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ నటించిన ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సిరీస్ లో ఓ సీన్ లో సహజత్వం కోసం తన కోస్టార్ వికాస్ నిజంగానే తన చెంప వాచిపోయేలా కొట్టాడని నందిని రాయ్ తెలిపింది. షూటింగ్ జరుగుతున్న సమయంలో సీన్ చాలా నేచురల్ గా రావాలనేది డైరెక్టర్ ఆదేశమని చెప్పింది.
అయితే తన తోటి నటుడు వికాస్ ముందుగా తనను పైపైన కొట్టి ఊరుకున్నాడని.. దీంతో సీన్ సరిగ్గా రాలేదని చెప్పింది. వెంటనే ఇద్దరం ఒక అండర్ స్టాండింగ్ కి వచ్చి నిజంగానే కొట్టుకోవాలనే నిర్ణయం తీసుకున్నామని గుర్తుచేసుకుంది. షాట్ రెడీ అనేసరికి ఇద్దరం చెంపలు వాచిపోయేలా కొట్టుకున్నామని.. ఆ సమయంలో వచ్చిన కన్నీళ్లు నిజమైనవని నందిని చెప్పుకొచ్చింది. వికాస్ కొట్టిన దెబ్బకు చాలాసేపటి వరకు తన బుగ్గ వాచిపోయిందని.. ఆ వాపు తగ్గిన తరువాత నెక్స్ట్ సీన్ షూట్ చేశారని తెలిపింది.
ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో నందిని రాయ్ పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తుంది. నటన మీద ఇష్టంతో ఊరి నుండి పట్నంకు వచ్చిన అమ్మాయిగా ఆమె పాత్రను డిజైన్ చేశారు. ‘ఆహా’లో ప్రసారమవుతోన్న ఈ సిరీస్ ను ఏడు ఎపిసోడ్ లతో రూపొందించారు.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…