వరుస హిట్స్ తో ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీనువైట్ల. అయితే గత కొన్నేళ్లుగా ఆయన నుండి ఒక్క హిట్టు సినిమా కూడా రాలేదు. ఆయన తెరకెక్కించిన ‘మిస్టర్’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ లాంటి సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో తన తదుపరి సినిమా మొదలుపెట్టడానికి చాలా టైమ్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ‘ఢీ అండ్ ఢీ’ అనే సినిమా తీస్తున్నారు. ‘డబుల్ డోస్’ అనేది ట్యాగ్ లైన్. మంచు విష్ణు హీరోగా త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించనున్నారు.
ఈలోగా మరో రెండు కథలను సిద్ధం చేసుకున్నారు శ్రీనువైట్ల. అందులో ఒక దానికి ‘డబుల్స్’ అనే టైటిల్ పెట్టుకున్నారు. ఇదొక మల్టీస్టారర్ అని తెలుస్తోంది. ఇందులో ఇద్దరు హీరోలు ఉంటారు. ఇందులో స్టార్ హీరోలే కనిపిస్తారని సమాచారం. కానీ ఆ హీరోలు ఎవరనేది మాత్రం చెప్పడం లేదు. ఇదిలా ఉండగా.. ‘ఢీ అండ్ ఢీ’ సినిమాకి ‘డబుల్స్’ కి మధ్య మరో సినిమా ఉంటుందని.. ఆ సినిమా తరువాతే ‘డబుల్స్’ సెట్స్ పైకి వెళ్తుందని చెబుతున్నారు శ్రీనువైట్ల.
ఇక సీక్వెల్స్ గురించి మాట్లాడుతూ.. ‘ఢీ అండ్ ఢీ’ సినిమా అందరూ అనుకుంటున్నట్లుగా ‘ఢీ’ సినిమాకి సీక్వెల్ కాదని.. పూర్తిగా వేరే కథ అని చెప్పారు. కానీ సినిమా చూస్తున్న ఏదోక క్షణంలో ‘ఢీ’ గుర్తొస్తుందని అన్నారు. అలానే ‘దూకుడు’ సీక్వెల్ గురించి మాట్లాడుతూ అసలు తనకు సీక్వెల్ తీయాలనే ఆలోచనే లేదని అన్నారు. సీక్వెల్స్ తో మ్యాజిక్ ను రిపీట్ చేయలేమని అన్నారు. మహేష్ తో సినిమా ఛాన్స్ వస్తే.. దూకుడు కంటే మంచి కథతో వెళ్లాలని చెప్పుకొచ్చారు.
This post was last modified on June 17, 2021 12:18 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…