Movie News

శ్రీనువైట్ల మల్టీస్టారర్!

వరుస హిట్స్ తో ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీనువైట్ల. అయితే గత కొన్నేళ్లుగా ఆయన నుండి ఒక్క హిట్టు సినిమా కూడా రాలేదు. ఆయన తెరకెక్కించిన ‘మిస్టర్’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ లాంటి సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో తన తదుపరి సినిమా మొదలుపెట్టడానికి చాలా టైమ్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ‘ఢీ అండ్ ఢీ’ అనే సినిమా తీస్తున్నారు. ‘డబుల్ డోస్’ అనేది ట్యాగ్ లైన్. మంచు విష్ణు హీరోగా త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించనున్నారు.

ఈలోగా మరో రెండు కథలను సిద్ధం చేసుకున్నారు శ్రీనువైట్ల. అందులో ఒక దానికి ‘డబుల్స్’ అనే టైటిల్ పెట్టుకున్నారు. ఇదొక మల్టీస్టారర్ అని తెలుస్తోంది. ఇందులో ఇద్దరు హీరోలు ఉంటారు. ఇందులో స్టార్ హీరోలే కనిపిస్తారని సమాచారం. కానీ ఆ హీరోలు ఎవరనేది మాత్రం చెప్పడం లేదు. ఇదిలా ఉండగా.. ‘ఢీ అండ్ ఢీ’ సినిమాకి ‘డబుల్స్’ కి మధ్య మరో సినిమా ఉంటుందని.. ఆ సినిమా తరువాతే ‘డబుల్స్’ సెట్స్ పైకి వెళ్తుందని చెబుతున్నారు శ్రీనువైట్ల.

ఇక సీక్వెల్స్ గురించి మాట్లాడుతూ.. ‘ఢీ అండ్ ఢీ’ సినిమా అందరూ అనుకుంటున్నట్లుగా ‘ఢీ’ సినిమాకి సీక్వెల్ కాదని.. పూర్తిగా వేరే కథ అని చెప్పారు. కానీ సినిమా చూస్తున్న ఏదోక క్షణంలో ‘ఢీ’ గుర్తొస్తుందని అన్నారు. అలానే ‘దూకుడు’ సీక్వెల్ గురించి మాట్లాడుతూ అసలు తనకు సీక్వెల్ తీయాలనే ఆలోచనే లేదని అన్నారు. సీక్వెల్స్ తో మ్యాజిక్ ను రిపీట్ చేయలేమని అన్నారు. మహేష్ తో సినిమా ఛాన్స్ వస్తే.. దూకుడు కంటే మంచి కథతో వెళ్లాలని చెప్పుకొచ్చారు.

This post was last modified on June 17, 2021 12:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

16 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

22 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

53 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago