నేచురల్ స్టార్ నాని నిర్మిచిన ‘అ!’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు ప్రశాంత్ వర్మ. తొలి సినిమాలతోనే విమర్శకుల ప్రసంశలు అందుకున్నారు. ఆ తరువాత ‘కల్కి’, ‘జాంబీ రెడ్డి’ లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తేజ సజ్జ హీరోగా నటించిన ‘జాంబీ రెడ్డి’ సినిమా ఓ వర్గం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఇందులో కామెడీ కూడా బాగా వర్కవుట్ అయింది. ఒక్కో సినిమాని ఒక్కో జోనర్ లో తీసే ప్రశాంత్ వర్మ తన తదుపరి సినిమా కోసం మరో డిఫరెంట్ జోనర్ ని ఎన్నుకున్నాడు.
సూపర్ హీరో కాన్సెప్ట్ తో ‘హనుమాన్’ అనే సినిమాను తెరకెక్కించనున్నారు. కొన్నిరోజుల క్రితం ఈ సినిమా టైటిల్ టీజర్ ను రిలీజ్ చేశారు. పురాణాల్లో సూపర్ మ్యాన్ అంటే హనుమాన్ అనే చెప్పాలి. అందుకే అదే క్యారెక్టర్ తో తెలుగులో సూపర్ హీరో సినిమా తీస్తానని అంటున్నారు ప్రశాంత్ వర్మ. అయితే హనుమాన్ గా ఎవరు నటించబోతున్నారనే విషయం మాత్రం చెప్పలేదు. మొన్నటివరకు మెగాహీరో సాయి ధరమ్ తేజ్ ఇందులో నటించే ఛాన్స్ ఉందని అన్నారు.
తాజా సమాచారం ప్రకారం.. ఇందులో యంగ్ హీరో తేజ సజ్జను తీసుకున్నారట. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన తేజ ‘ఓ బేబీ’ సినిమాలో కీలకపాత్ర పోషించారు. ఆ తరువాత ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘జాంబీ రెడ్డి’ సినిమాతో హీరోగా మారారు. ఈ సినిమా అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పుడు మరోసారి తేజనే తన సినిమాలో తీసుకోవాలని భావిస్తున్నారట ప్రశాంత్ వర్మ. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందించనున్న ఈ సినిమాను పలు భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు.
This post was last modified on June 16, 2021 3:16 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…