నేచురల్ స్టార్ నాని నిర్మిచిన ‘అ!’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు ప్రశాంత్ వర్మ. తొలి సినిమాలతోనే విమర్శకుల ప్రసంశలు అందుకున్నారు. ఆ తరువాత ‘కల్కి’, ‘జాంబీ రెడ్డి’ లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తేజ సజ్జ హీరోగా నటించిన ‘జాంబీ రెడ్డి’ సినిమా ఓ వర్గం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఇందులో కామెడీ కూడా బాగా వర్కవుట్ అయింది. ఒక్కో సినిమాని ఒక్కో జోనర్ లో తీసే ప్రశాంత్ వర్మ తన తదుపరి సినిమా కోసం మరో డిఫరెంట్ జోనర్ ని ఎన్నుకున్నాడు.
సూపర్ హీరో కాన్సెప్ట్ తో ‘హనుమాన్’ అనే సినిమాను తెరకెక్కించనున్నారు. కొన్నిరోజుల క్రితం ఈ సినిమా టైటిల్ టీజర్ ను రిలీజ్ చేశారు. పురాణాల్లో సూపర్ మ్యాన్ అంటే హనుమాన్ అనే చెప్పాలి. అందుకే అదే క్యారెక్టర్ తో తెలుగులో సూపర్ హీరో సినిమా తీస్తానని అంటున్నారు ప్రశాంత్ వర్మ. అయితే హనుమాన్ గా ఎవరు నటించబోతున్నారనే విషయం మాత్రం చెప్పలేదు. మొన్నటివరకు మెగాహీరో సాయి ధరమ్ తేజ్ ఇందులో నటించే ఛాన్స్ ఉందని అన్నారు.
తాజా సమాచారం ప్రకారం.. ఇందులో యంగ్ హీరో తేజ సజ్జను తీసుకున్నారట. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన తేజ ‘ఓ బేబీ’ సినిమాలో కీలకపాత్ర పోషించారు. ఆ తరువాత ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘జాంబీ రెడ్డి’ సినిమాతో హీరోగా మారారు. ఈ సినిమా అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పుడు మరోసారి తేజనే తన సినిమాలో తీసుకోవాలని భావిస్తున్నారట ప్రశాంత్ వర్మ. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందించనున్న ఈ సినిమాను పలు భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు.
This post was last modified on June 16, 2021 3:16 pm
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…