నేచురల్ స్టార్ నాని నిర్మిచిన ‘అ!’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు ప్రశాంత్ వర్మ. తొలి సినిమాలతోనే విమర్శకుల ప్రసంశలు అందుకున్నారు. ఆ తరువాత ‘కల్కి’, ‘జాంబీ రెడ్డి’ లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తేజ సజ్జ హీరోగా నటించిన ‘జాంబీ రెడ్డి’ సినిమా ఓ వర్గం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఇందులో కామెడీ కూడా బాగా వర్కవుట్ అయింది. ఒక్కో సినిమాని ఒక్కో జోనర్ లో తీసే ప్రశాంత్ వర్మ తన తదుపరి సినిమా కోసం మరో డిఫరెంట్ జోనర్ ని ఎన్నుకున్నాడు.
సూపర్ హీరో కాన్సెప్ట్ తో ‘హనుమాన్’ అనే సినిమాను తెరకెక్కించనున్నారు. కొన్నిరోజుల క్రితం ఈ సినిమా టైటిల్ టీజర్ ను రిలీజ్ చేశారు. పురాణాల్లో సూపర్ మ్యాన్ అంటే హనుమాన్ అనే చెప్పాలి. అందుకే అదే క్యారెక్టర్ తో తెలుగులో సూపర్ హీరో సినిమా తీస్తానని అంటున్నారు ప్రశాంత్ వర్మ. అయితే హనుమాన్ గా ఎవరు నటించబోతున్నారనే విషయం మాత్రం చెప్పలేదు. మొన్నటివరకు మెగాహీరో సాయి ధరమ్ తేజ్ ఇందులో నటించే ఛాన్స్ ఉందని అన్నారు.
తాజా సమాచారం ప్రకారం.. ఇందులో యంగ్ హీరో తేజ సజ్జను తీసుకున్నారట. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన తేజ ‘ఓ బేబీ’ సినిమాలో కీలకపాత్ర పోషించారు. ఆ తరువాత ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘జాంబీ రెడ్డి’ సినిమాతో హీరోగా మారారు. ఈ సినిమా అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పుడు మరోసారి తేజనే తన సినిమాలో తీసుకోవాలని భావిస్తున్నారట ప్రశాంత్ వర్మ. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందించనున్న ఈ సినిమాను పలు భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…