‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్కు జోడీగా ఏరి కోరి ఆలియా భట్ను ఎంచుకున్నాడు రాజమౌళి. ‘బాహుబలి’ తర్వాత ఆయన రేంజ్ ఎంతలా పెరిగిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన స్థాయికి ఇండియలో ఏ స్టార్ హీరోయిన్ను పిలిచినా పరుగెత్తుకొచ్చి సినిమా చేసేస్తుంది. ఐతే ఆలియా మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను కన్ఫమ్ చేయడానికి కొంచెం టైం తీసుకుంది. అలాగే షూటింగ్కు హాజరయ్యే విషయంలోనూ చిత్ర బృందాన్ని కొంత ఇబ్బంది పెట్టినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.
కానీ ఒకసారి ‘ఆర్ఆర్ఆర్’ సెట్లోకి అడుగు పెట్టాక ఆమె వైఖరి పూర్తిగా మారిపోయింది. ఈ సినిమా, ఇందులోని తన పాత్ర కెరీర్లో మైలురాయిలా నిలిచిపోతుందని ఆమెకు అర్థమైనట్లే ఉంది. ఆలియా ఫస్ట్ లుక్ చూసి.. అలాగే తన పాత్ర గురించి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన ఎలివేషన్ విన్నాక ఈ పాత్రపై అందరిలోనూ అంచనాలు పెరిగిపోయాయి. ఈ పాత్రను ఆలియా కూడా ఎంతో ఇష్టపడి చేస్తున్నట్లే ఉంది.
‘ఆర్ఆర్ఆర్’ ఇప్పుడు ఆలియాకు టాప్ ప్రయారిటీగా మారినట్లే కనిపిస్తోంది. చేతిలో గంగూబాయి కథియావాడి, బ్రహ్మాస్త్ర లాంటి భారీ చిత్రాలు ఉన్నప్పటికీ.. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ముందుగా ‘ఆర్ఆర్ఆర్’లో తన పని పూర్తి చేయడానికే ఆలియా చూస్తోందట. బాలీవుడ్ కమిట్మెంట్లన్నింటనీ ఆమె పక్కన పెట్టినట్లు సమాచారం. ముందుగా ‘ఆర్ఆర్ఆర్’లో తన పాత్రకు సంబంధించి షూటింగ్ పూర్తి చేయడానికే ఆమె రెడీగా ఉందట.
రాజమౌళి ఎప్పుడు పిలిస్తే అప్పుడు షూటింగ్కు వచ్చేసి, మొత్తం తన పని పూర్తయ్యే వరకు ఈ టీంతోనే ఉండాలని డిసైడైనట్లు సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణను జులై 1న పున:ప్రారంభిస్తారని అంటున్నారు. కొన్ని రోజుల్లోనే ఆలియా చిత్ర బృందంతో కలిసే అవకాశముంది. అటు ఇటుగా ఇంకో నెల రోజుల చిత్రీకరణ మిగిలి ఉన్నట్లు చెబుతున్నారు. అక్టోబరు 13న ఈ చిత్రం రావడం దాదాపు అసాధ్యం. వచ్చే వేసవికి వాయిదా వేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
This post was last modified on June 16, 2021 10:41 am
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…