‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్కు జోడీగా ఏరి కోరి ఆలియా భట్ను ఎంచుకున్నాడు రాజమౌళి. ‘బాహుబలి’ తర్వాత ఆయన రేంజ్ ఎంతలా పెరిగిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన స్థాయికి ఇండియలో ఏ స్టార్ హీరోయిన్ను పిలిచినా పరుగెత్తుకొచ్చి సినిమా చేసేస్తుంది. ఐతే ఆలియా మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను కన్ఫమ్ చేయడానికి కొంచెం టైం తీసుకుంది. అలాగే షూటింగ్కు హాజరయ్యే విషయంలోనూ చిత్ర బృందాన్ని కొంత ఇబ్బంది పెట్టినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.
కానీ ఒకసారి ‘ఆర్ఆర్ఆర్’ సెట్లోకి అడుగు పెట్టాక ఆమె వైఖరి పూర్తిగా మారిపోయింది. ఈ సినిమా, ఇందులోని తన పాత్ర కెరీర్లో మైలురాయిలా నిలిచిపోతుందని ఆమెకు అర్థమైనట్లే ఉంది. ఆలియా ఫస్ట్ లుక్ చూసి.. అలాగే తన పాత్ర గురించి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన ఎలివేషన్ విన్నాక ఈ పాత్రపై అందరిలోనూ అంచనాలు పెరిగిపోయాయి. ఈ పాత్రను ఆలియా కూడా ఎంతో ఇష్టపడి చేస్తున్నట్లే ఉంది.
‘ఆర్ఆర్ఆర్’ ఇప్పుడు ఆలియాకు టాప్ ప్రయారిటీగా మారినట్లే కనిపిస్తోంది. చేతిలో గంగూబాయి కథియావాడి, బ్రహ్మాస్త్ర లాంటి భారీ చిత్రాలు ఉన్నప్పటికీ.. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ముందుగా ‘ఆర్ఆర్ఆర్’లో తన పని పూర్తి చేయడానికే ఆలియా చూస్తోందట. బాలీవుడ్ కమిట్మెంట్లన్నింటనీ ఆమె పక్కన పెట్టినట్లు సమాచారం. ముందుగా ‘ఆర్ఆర్ఆర్’లో తన పాత్రకు సంబంధించి షూటింగ్ పూర్తి చేయడానికే ఆమె రెడీగా ఉందట.
రాజమౌళి ఎప్పుడు పిలిస్తే అప్పుడు షూటింగ్కు వచ్చేసి, మొత్తం తన పని పూర్తయ్యే వరకు ఈ టీంతోనే ఉండాలని డిసైడైనట్లు సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణను జులై 1న పున:ప్రారంభిస్తారని అంటున్నారు. కొన్ని రోజుల్లోనే ఆలియా చిత్ర బృందంతో కలిసే అవకాశముంది. అటు ఇటుగా ఇంకో నెల రోజుల చిత్రీకరణ మిగిలి ఉన్నట్లు చెబుతున్నారు. అక్టోబరు 13న ఈ చిత్రం రావడం దాదాపు అసాధ్యం. వచ్చే వేసవికి వాయిదా వేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
This post was last modified on June 16, 2021 10:41 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…