ఇంకో రెండు రోజుల్లోనే నెట్ ఫ్లిక్స్ ద్వారా నేరుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది తమిళ స్టార్ ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన ‘జగమే తంత్రం’ సినిమా. థియేటర్లలో అయితే ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లోనే విడుదలయ్యేది. కానీ డిజిటల్ రిలీజ్ కావడంతో అనేక భాషల్లో ఆడియోను జోడిస్తున్నారు. ఏకంగా 17 భాషల్లో ‘జగమే తంత్రం’ విడుదలవుతుండటం విశేషం. ఏకంగా 190 దేశాల్లో ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది. మరి ఇంత భారీగా రిలీజ్ చేస్తున్న ఈ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ వాళ్లు ఎంత చెల్లించారో తెలుసా? అక్షరాలా 60 కోట్ల రూపాయలు.
ఓ రీజనల్ లాంగ్వేజ్ చిత్రానికి ఈ రేటు ఎక్కువే అనిపించొచ్చు. కానీ ఈ సినిమాపై ఉన్న అంచనాల దృష్ట్యా అది మరీ ఎక్కువ రేటేమీ కాదు. థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ధనుష్ సినిమాకు 60-70 కోట్ల మేర గ్రాస్ ఈజీగా వస్తుంది. ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్ చేస్తే వచ్చే ఆదాయం అదనం. ఆ లెక్కన చూస్తే ‘జగమే తంత్రం’ రీజనబుల్ రేటుకే నెట్ ఫ్లిక్స్ సొంతమైనట్లు.
తమిళంలోనే కాదు.. దక్షిణాదిన డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన చిత్రాల్లో అత్యధిక రేటు పలికిన చిత్రం ‘జగమే తంత్రం’యే కావడం విశేషం. ఇప్పటిదాకా రికార్డు సూర్య సినిమా ‘సూరారై పొట్రు’ (ఆకాశం నీ హద్దురా) పేరిట ఉంది. ఆ చిత్రానికి అమేజాన్ ప్రైమ్ వాళ్లు రూ.55 కోట్లు చెల్లించారట. దాన్ని ‘జగమే తంత్రం’ అధిగమించింది. దీని నిర్మాత శశికాంత్ మంచి లాభానికే సినిమాను అమ్ముకున్నట్లు తెలుస్తోంది.
ధనుష్ ‘జగమే తంత్రం’ థియేటర్లలోనే రిలీజ్ చేయాలని పట్టుబట్టినప్పటికీ.. కరోనా ఫస్ట్ వేవ్ అనంతర పరిస్థితుల దృష్ట్యా శశికాంత్ మాత్రం ఓటీటీ రిలీజ్కు వెళ్లిపోయారు. దీనిపై ధనుష్ మొదట్లో అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. తర్వాత సర్దుకున్నాడు. భారీ రేటు పెట్టి కొన్న రీజనల్ సినిమాను బాగా మార్కెట్ చేసుకుని అందుకు తగ్గ ప్రయోజనం పొందడం కోసం నెట్ ఫ్లిక్స్ భారీ రిలీజే ప్లాన్ చేసింది. ‘పిజ్జా’, ‘జిగర్ తండ’, ‘పేట’ చిత్రాల దర్వకుడు కార్తీక్ సుబ్బరాజ్ ‘జగమే తంత్రం’ను రూపొందించాడు.
This post was last modified on June 16, 2021 8:21 am
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…