Movie News

ధనుష్ సినిమాకు నెట్‌ఫ్లిక్స్ రికార్డు రేటు


ఇంకో రెండు రోజుల్లోనే నెట్ ఫ్లిక్స్ ద్వారా నేరుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది తమిళ స్టార్ ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన ‘జగమే తంత్రం’ సినిమా. థియేటర్లలో అయితే ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లోనే విడుదలయ్యేది. కానీ డిజిటల్ రిలీజ్ కావడంతో అనేక భాషల్లో ఆడియోను జోడిస్తున్నారు. ఏకంగా 17 భాషల్లో ‘జగమే తంత్రం’ విడుదలవుతుండటం విశేషం. ఏకంగా 190 దేశాల్లో ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది. మరి ఇంత భారీగా రిలీజ్ చేస్తున్న ఈ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ వాళ్లు ఎంత చెల్లించారో తెలుసా? అక్షరాలా 60 కోట్ల రూపాయలు.

ఓ రీజనల్ లాంగ్వేజ్ చిత్రానికి ఈ రేటు ఎక్కువే అనిపించొచ్చు. కానీ ఈ సినిమాపై ఉన్న అంచనాల దృష్ట్యా అది మరీ ఎక్కువ రేటేమీ కాదు. థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ధనుష్ సినిమాకు 60-70 కోట్ల మేర గ్రాస్ ఈజీగా వస్తుంది. ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్ చేస్తే వచ్చే ఆదాయం అదనం. ఆ లెక్కన చూస్తే ‘జగమే తంత్రం’ రీజనబుల్ రేటుకే నెట్ ఫ్లిక్స్ సొంతమైనట్లు.

తమిళంలోనే కాదు.. దక్షిణాదిన డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన చిత్రాల్లో అత్యధిక రేటు పలికిన చిత్రం ‘జగమే తంత్రం’యే కావడం విశేషం. ఇప్పటిదాకా రికార్డు సూర్య సినిమా ‘సూరారై పొట్రు’ (ఆకాశం నీ హద్దురా) పేరిట ఉంది. ఆ చిత్రానికి అమేజాన్ ప్రైమ్ వాళ్లు రూ.55 కోట్లు చెల్లించారట. దాన్ని ‘జగమే తంత్రం’ అధిగమించింది. దీని నిర్మాత శశికాంత్ మంచి లాభానికే సినిమాను అమ్ముకున్నట్లు తెలుస్తోంది.

ధనుష్ ‘జగమే తంత్రం’ థియేటర్లలోనే రిలీజ్ చేయాలని పట్టుబట్టినప్పటికీ.. కరోనా ఫస్ట్ వేవ్ అనంతర పరిస్థితుల దృష్ట్యా శశికాంత్ మాత్రం ఓటీటీ రిలీజ్‌కు వెళ్లిపోయారు. దీనిపై ధనుష్ మొదట్లో అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. తర్వాత సర్దుకున్నాడు. భారీ రేటు పెట్టి కొన్న రీజనల్ సినిమాను బాగా మార్కెట్ చేసుకుని అందుకు తగ్గ ప్రయోజనం పొందడం కోసం నెట్ ఫ్లిక్స్ భారీ రిలీజే ప్లాన్ చేసింది. ‘పిజ్జా’, ‘జిగర్ తండ’, ‘పేట’ చిత్రాల దర్వకుడు కార్తీక్ సుబ్బరాజ్ ‘జగమే తంత్రం’ను రూపొందించాడు.

This post was last modified on June 16, 2021 8:21 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

10 minutes ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

20 minutes ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

48 minutes ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

2 hours ago

మాజీ సీబీఐ డైరెక్టర్ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

2 hours ago

బ్లాక్ బస్టర్ పాటలకు పెన్ను పెట్టకుండా ఎలా?

వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…

4 hours ago