ఇంకో రెండు రోజుల్లోనే నెట్ ఫ్లిక్స్ ద్వారా నేరుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది తమిళ స్టార్ ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన ‘జగమే తంత్రం’ సినిమా. థియేటర్లలో అయితే ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లోనే విడుదలయ్యేది. కానీ డిజిటల్ రిలీజ్ కావడంతో అనేక భాషల్లో ఆడియోను జోడిస్తున్నారు. ఏకంగా 17 భాషల్లో ‘జగమే తంత్రం’ విడుదలవుతుండటం విశేషం. ఏకంగా 190 దేశాల్లో ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది. మరి ఇంత భారీగా రిలీజ్ చేస్తున్న ఈ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ వాళ్లు ఎంత చెల్లించారో తెలుసా? అక్షరాలా 60 కోట్ల రూపాయలు.
ఓ రీజనల్ లాంగ్వేజ్ చిత్రానికి ఈ రేటు ఎక్కువే అనిపించొచ్చు. కానీ ఈ సినిమాపై ఉన్న అంచనాల దృష్ట్యా అది మరీ ఎక్కువ రేటేమీ కాదు. థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ధనుష్ సినిమాకు 60-70 కోట్ల మేర గ్రాస్ ఈజీగా వస్తుంది. ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్ చేస్తే వచ్చే ఆదాయం అదనం. ఆ లెక్కన చూస్తే ‘జగమే తంత్రం’ రీజనబుల్ రేటుకే నెట్ ఫ్లిక్స్ సొంతమైనట్లు.
తమిళంలోనే కాదు.. దక్షిణాదిన డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన చిత్రాల్లో అత్యధిక రేటు పలికిన చిత్రం ‘జగమే తంత్రం’యే కావడం విశేషం. ఇప్పటిదాకా రికార్డు సూర్య సినిమా ‘సూరారై పొట్రు’ (ఆకాశం నీ హద్దురా) పేరిట ఉంది. ఆ చిత్రానికి అమేజాన్ ప్రైమ్ వాళ్లు రూ.55 కోట్లు చెల్లించారట. దాన్ని ‘జగమే తంత్రం’ అధిగమించింది. దీని నిర్మాత శశికాంత్ మంచి లాభానికే సినిమాను అమ్ముకున్నట్లు తెలుస్తోంది.
ధనుష్ ‘జగమే తంత్రం’ థియేటర్లలోనే రిలీజ్ చేయాలని పట్టుబట్టినప్పటికీ.. కరోనా ఫస్ట్ వేవ్ అనంతర పరిస్థితుల దృష్ట్యా శశికాంత్ మాత్రం ఓటీటీ రిలీజ్కు వెళ్లిపోయారు. దీనిపై ధనుష్ మొదట్లో అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. తర్వాత సర్దుకున్నాడు. భారీ రేటు పెట్టి కొన్న రీజనల్ సినిమాను బాగా మార్కెట్ చేసుకుని అందుకు తగ్గ ప్రయోజనం పొందడం కోసం నెట్ ఫ్లిక్స్ భారీ రిలీజే ప్లాన్ చేసింది. ‘పిజ్జా’, ‘జిగర్ తండ’, ‘పేట’ చిత్రాల దర్వకుడు కార్తీక్ సుబ్బరాజ్ ‘జగమే తంత్రం’ను రూపొందించాడు.
This post was last modified on June 16, 2021 8:21 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…