ఇంకో రెండు రోజుల్లోనే నెట్ ఫ్లిక్స్ ద్వారా నేరుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది తమిళ స్టార్ ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన ‘జగమే తంత్రం’ సినిమా. థియేటర్లలో అయితే ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లోనే విడుదలయ్యేది. కానీ డిజిటల్ రిలీజ్ కావడంతో అనేక భాషల్లో ఆడియోను జోడిస్తున్నారు. ఏకంగా 17 భాషల్లో ‘జగమే తంత్రం’ విడుదలవుతుండటం విశేషం. ఏకంగా 190 దేశాల్లో ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది. మరి ఇంత భారీగా రిలీజ్ చేస్తున్న ఈ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ వాళ్లు ఎంత చెల్లించారో తెలుసా? అక్షరాలా 60 కోట్ల రూపాయలు.
ఓ రీజనల్ లాంగ్వేజ్ చిత్రానికి ఈ రేటు ఎక్కువే అనిపించొచ్చు. కానీ ఈ సినిమాపై ఉన్న అంచనాల దృష్ట్యా అది మరీ ఎక్కువ రేటేమీ కాదు. థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ధనుష్ సినిమాకు 60-70 కోట్ల మేర గ్రాస్ ఈజీగా వస్తుంది. ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్ చేస్తే వచ్చే ఆదాయం అదనం. ఆ లెక్కన చూస్తే ‘జగమే తంత్రం’ రీజనబుల్ రేటుకే నెట్ ఫ్లిక్స్ సొంతమైనట్లు.
తమిళంలోనే కాదు.. దక్షిణాదిన డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన చిత్రాల్లో అత్యధిక రేటు పలికిన చిత్రం ‘జగమే తంత్రం’యే కావడం విశేషం. ఇప్పటిదాకా రికార్డు సూర్య సినిమా ‘సూరారై పొట్రు’ (ఆకాశం నీ హద్దురా) పేరిట ఉంది. ఆ చిత్రానికి అమేజాన్ ప్రైమ్ వాళ్లు రూ.55 కోట్లు చెల్లించారట. దాన్ని ‘జగమే తంత్రం’ అధిగమించింది. దీని నిర్మాత శశికాంత్ మంచి లాభానికే సినిమాను అమ్ముకున్నట్లు తెలుస్తోంది.
ధనుష్ ‘జగమే తంత్రం’ థియేటర్లలోనే రిలీజ్ చేయాలని పట్టుబట్టినప్పటికీ.. కరోనా ఫస్ట్ వేవ్ అనంతర పరిస్థితుల దృష్ట్యా శశికాంత్ మాత్రం ఓటీటీ రిలీజ్కు వెళ్లిపోయారు. దీనిపై ధనుష్ మొదట్లో అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. తర్వాత సర్దుకున్నాడు. భారీ రేటు పెట్టి కొన్న రీజనల్ సినిమాను బాగా మార్కెట్ చేసుకుని అందుకు తగ్గ ప్రయోజనం పొందడం కోసం నెట్ ఫ్లిక్స్ భారీ రిలీజే ప్లాన్ చేసింది. ‘పిజ్జా’, ‘జిగర్ తండ’, ‘పేట’ చిత్రాల దర్వకుడు కార్తీక్ సుబ్బరాజ్ ‘జగమే తంత్రం’ను రూపొందించాడు.
This post was last modified on June 16, 2021 8:21 am
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…