గతేడాది విడుదలైన ‘మనసానమః’ అనే షార్ట్ ఫిల్మ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. డిఫరెంట్ లవ్ స్టోరీ, సరికొత్త స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్ యూత్ ని ఆకట్టుకుంది. పదిహేను నిమిషాల నిడివి గల ఈ లఘు చిత్రాన్ని పొగుడుతూ అప్పట్లో అనుష్క, రష్మిక లాంటి స్టార్ హీరోయిన్లు ట్వీట్లు కూడా పెట్టారు. 70కి పైగా అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న షార్ట్ ఫిల్మ్గా రికార్డుల్లోకెక్కింది. దీన్ని దీపక్ అనే వ్యక్తి డైరెక్ట్ చేశారు. గతంలో ఈ డైరెక్టర్ ‘డబ్ల్యూటీఎఫ్'(వాట్ ఈజ్ ది ఫ్యాక్ట్), ‘ఎక్స్క్యూజ్మీ’, ‘హైడెన్ సీక్’ లాంటి షార్ట్ ఫిలిమ్స్ ను తెరకెక్కించారు.
వీటితో పాటు ‘ఫిదా’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా పని చేశారు. ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ కి సినిమా ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ టాలెంట్ ఉన్న దర్శకులకు అవకాశాలు ఇస్తోంది. ఓ పక్క భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తూనే మరోపక్క చిన్న బడ్జెట్ సినిమాలను కూడా నిర్మిస్తోంది. ఇటీవల దీపక్ చెప్పిన కథ నచ్చడంతో యూవీ క్రియేషన్స్ ఆయన్ని లాక్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో శర్వానంద్ లేదా మరో యంగ్ హీరో ఎవరినైనా తీసుకోవాలని అనుకుంటున్నారు. హీరోని బట్టి సినిమా బడ్జెట్ పై ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన రానుంది. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ సంస్థ ‘రాధేశ్యామ్’ లాంటి భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తోంది. అలానే మరికొన్ని ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టింది. ఇటీవల ఈ బ్యానర్ లో నిర్మించిన ‘ఏక్ మినీ కథ’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది!
This post was last modified on June 15, 2021 5:51 pm
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…
ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…
అగ్ర దేశాల్లో ఒకటైన చైనా నిత్యం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తూనే ఉంది. భారత్ సహా పలు దేశాలకు స్నేహ…
తమిళ స్టార్ హీరోల్లో ఒకడైన రవి మోహన్ అలియాస్ జయం రవి.. ఈ మధ్య సినిమాలతో కంటే వ్యక్తిగత జీవితానికి…
ఉమ్మడి రాష్ట్రం ఏపీ, తెలంగాణగా విడిపోయాక సినిమా పరిశ్రమకు సంబంధించిన చర్చలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దల మధ్య ప్రస్తావనకు రావడం…