గతేడాది విడుదలైన ‘మనసానమః’ అనే షార్ట్ ఫిల్మ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. డిఫరెంట్ లవ్ స్టోరీ, సరికొత్త స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్ యూత్ ని ఆకట్టుకుంది. పదిహేను నిమిషాల నిడివి గల ఈ లఘు చిత్రాన్ని పొగుడుతూ అప్పట్లో అనుష్క, రష్మిక లాంటి స్టార్ హీరోయిన్లు ట్వీట్లు కూడా పెట్టారు. 70కి పైగా అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న షార్ట్ ఫిల్మ్గా రికార్డుల్లోకెక్కింది. దీన్ని దీపక్ అనే వ్యక్తి డైరెక్ట్ చేశారు. గతంలో ఈ డైరెక్టర్ ‘డబ్ల్యూటీఎఫ్'(వాట్ ఈజ్ ది ఫ్యాక్ట్), ‘ఎక్స్క్యూజ్మీ’, ‘హైడెన్ సీక్’ లాంటి షార్ట్ ఫిలిమ్స్ ను తెరకెక్కించారు.
వీటితో పాటు ‘ఫిదా’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా పని చేశారు. ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ కి సినిమా ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ టాలెంట్ ఉన్న దర్శకులకు అవకాశాలు ఇస్తోంది. ఓ పక్క భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తూనే మరోపక్క చిన్న బడ్జెట్ సినిమాలను కూడా నిర్మిస్తోంది. ఇటీవల దీపక్ చెప్పిన కథ నచ్చడంతో యూవీ క్రియేషన్స్ ఆయన్ని లాక్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో శర్వానంద్ లేదా మరో యంగ్ హీరో ఎవరినైనా తీసుకోవాలని అనుకుంటున్నారు. హీరోని బట్టి సినిమా బడ్జెట్ పై ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన రానుంది. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ సంస్థ ‘రాధేశ్యామ్’ లాంటి భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తోంది. అలానే మరికొన్ని ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టింది. ఇటీవల ఈ బ్యానర్ లో నిర్మించిన ‘ఏక్ మినీ కథ’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది!
This post was last modified on June 15, 2021 5:51 pm
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…