టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన నటి తాప్సీ.. స్టార్ స్టేటస్ ని మాత్రం అందుకోలేపోయింది. కొన్నాళ్లకు ఆమెకి తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ వరుస అవకాశాలను చేజిక్కించుకుంటూ హిట్టు మీద హిట్టు అందుకుంటుంది. బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ కథల కోసం తాప్సీను సంప్రదించే వారి సంఖ్య ఎక్కవైంది. అందుకే ఆమె ఏడాదికి అరడజను సినిమాలతో బిజీగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఆమె తిరిగి తెలుగు సినిమాల్లో నటించదని అంతా అనుకున్నారు.
కానీ రీసెంట్ గా ఆమె ఓ తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. టాలీవుడ్ లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన స్వరూప్ తన రెండో సినిమాగా ‘మిషన్ ఇంపాజిబుల్’ని తెరకెక్కిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా తిరుపతి నేపథ్యంలో సాగుతుందట.
అయితే లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమాలో కీలకపాత్ర కోసం తాప్సీను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ రకంగా ఈ సినిమాలో హీరో ఆమె అనే చెప్పాలి. తాప్సీకి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ను కూడా వాడుకోవాలనేది దర్శకనిర్మాతల ప్లాన్. అయితే ఆమె ఒప్పుకుంటుందో లేదో అనే సందేహాలతోనే సంప్రదించినట్లు తెలుస్తోంది. బౌండెడ్ స్క్రిప్ట్ ను ఆమె చేతిలో పెట్టగా.. స్క్రిప్ట్ చదివి సినిమా చేయడానికి అంగీకరించిందట. త్వరలోనే హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. ఇందులో తాప్సీ పాల్గొనే అవకాశం ఉంది.
This post was last modified on June 14, 2021 1:57 pm
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…