టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన నటి తాప్సీ.. స్టార్ స్టేటస్ ని మాత్రం అందుకోలేపోయింది. కొన్నాళ్లకు ఆమెకి తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ వరుస అవకాశాలను చేజిక్కించుకుంటూ హిట్టు మీద హిట్టు అందుకుంటుంది. బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ కథల కోసం తాప్సీను సంప్రదించే వారి సంఖ్య ఎక్కవైంది. అందుకే ఆమె ఏడాదికి అరడజను సినిమాలతో బిజీగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఆమె తిరిగి తెలుగు సినిమాల్లో నటించదని అంతా అనుకున్నారు.
కానీ రీసెంట్ గా ఆమె ఓ తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. టాలీవుడ్ లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన స్వరూప్ తన రెండో సినిమాగా ‘మిషన్ ఇంపాజిబుల్’ని తెరకెక్కిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా తిరుపతి నేపథ్యంలో సాగుతుందట.
అయితే లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమాలో కీలకపాత్ర కోసం తాప్సీను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ రకంగా ఈ సినిమాలో హీరో ఆమె అనే చెప్పాలి. తాప్సీకి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ను కూడా వాడుకోవాలనేది దర్శకనిర్మాతల ప్లాన్. అయితే ఆమె ఒప్పుకుంటుందో లేదో అనే సందేహాలతోనే సంప్రదించినట్లు తెలుస్తోంది. బౌండెడ్ స్క్రిప్ట్ ను ఆమె చేతిలో పెట్టగా.. స్క్రిప్ట్ చదివి సినిమా చేయడానికి అంగీకరించిందట. త్వరలోనే హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. ఇందులో తాప్సీ పాల్గొనే అవకాశం ఉంది.
This post was last modified on June 14, 2021 1:57 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…