టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన నటి తాప్సీ.. స్టార్ స్టేటస్ ని మాత్రం అందుకోలేపోయింది. కొన్నాళ్లకు ఆమెకి తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ వరుస అవకాశాలను చేజిక్కించుకుంటూ హిట్టు మీద హిట్టు అందుకుంటుంది. బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ కథల కోసం తాప్సీను సంప్రదించే వారి సంఖ్య ఎక్కవైంది. అందుకే ఆమె ఏడాదికి అరడజను సినిమాలతో బిజీగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఆమె తిరిగి తెలుగు సినిమాల్లో నటించదని అంతా అనుకున్నారు.
కానీ రీసెంట్ గా ఆమె ఓ తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. టాలీవుడ్ లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన స్వరూప్ తన రెండో సినిమాగా ‘మిషన్ ఇంపాజిబుల్’ని తెరకెక్కిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా తిరుపతి నేపథ్యంలో సాగుతుందట.
అయితే లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమాలో కీలకపాత్ర కోసం తాప్సీను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ రకంగా ఈ సినిమాలో హీరో ఆమె అనే చెప్పాలి. తాప్సీకి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ను కూడా వాడుకోవాలనేది దర్శకనిర్మాతల ప్లాన్. అయితే ఆమె ఒప్పుకుంటుందో లేదో అనే సందేహాలతోనే సంప్రదించినట్లు తెలుస్తోంది. బౌండెడ్ స్క్రిప్ట్ ను ఆమె చేతిలో పెట్టగా.. స్క్రిప్ట్ చదివి సినిమా చేయడానికి అంగీకరించిందట. త్వరలోనే హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. ఇందులో తాప్సీ పాల్గొనే అవకాశం ఉంది.
This post was last modified on June 14, 2021 1:57 pm
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…
యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…
ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14…