టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన నటి తాప్సీ.. స్టార్ స్టేటస్ ని మాత్రం అందుకోలేపోయింది. కొన్నాళ్లకు ఆమెకి తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ వరుస అవకాశాలను చేజిక్కించుకుంటూ హిట్టు మీద హిట్టు అందుకుంటుంది. బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ కథల కోసం తాప్సీను సంప్రదించే వారి సంఖ్య ఎక్కవైంది. అందుకే ఆమె ఏడాదికి అరడజను సినిమాలతో బిజీగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఆమె తిరిగి తెలుగు సినిమాల్లో నటించదని అంతా అనుకున్నారు.
కానీ రీసెంట్ గా ఆమె ఓ తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. టాలీవుడ్ లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన స్వరూప్ తన రెండో సినిమాగా ‘మిషన్ ఇంపాజిబుల్’ని తెరకెక్కిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా తిరుపతి నేపథ్యంలో సాగుతుందట.
అయితే లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమాలో కీలకపాత్ర కోసం తాప్సీను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ రకంగా ఈ సినిమాలో హీరో ఆమె అనే చెప్పాలి. తాప్సీకి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ను కూడా వాడుకోవాలనేది దర్శకనిర్మాతల ప్లాన్. అయితే ఆమె ఒప్పుకుంటుందో లేదో అనే సందేహాలతోనే సంప్రదించినట్లు తెలుస్తోంది. బౌండెడ్ స్క్రిప్ట్ ను ఆమె చేతిలో పెట్టగా.. స్క్రిప్ట్ చదివి సినిమా చేయడానికి అంగీకరించిందట. త్వరలోనే హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. ఇందులో తాప్సీ పాల్గొనే అవకాశం ఉంది.
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…