Movie News

దుబాయ్ కి షిఫ్ట్ అవుతున్న హీరో ఫ్యామిలీ!

ప్రముఖ నటుడు నవాజుద్దీన్ ఫ్యామిలీ దుబాయ్ కి షిఫ్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. నవాజుద్ధీ భార్య ఆలియా ఇద్దరు పిల్లల్ని తీసుకొని దుబాయ్ కి వెళ్లిపోతున్నట్లు చెప్పారు. పిల్లల చదువు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి. ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదు. దీంతో అందరూ ఆన్ లైన్ క్లాసులు మొదలుపెట్టారు. ఈ పద్ధతి చాలా మంది పిల్లలపై ప్రభావం చూపుతుంది. తల్లితండ్రులకు కూడా ఆన్ లైన్ క్లాసుల వ్యవహారం నచ్చడం లేదు. కానీ చేసేదేం లేక సైలెంట్ గా ఉంటున్నారు.

అయితే కొందరు మాత్రం దీనికి ప్ర‌త్యామ్నాయం వెతుకుతున్నారు. పిల్లలను విదేశాలకు పంపించి చదివించడానికి సిద్ధమవుతున్నారు. నవాజుద్దీన్ దంపతులు కూడా తమ పిల్లల విషయంలో ఇదే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆన్ లైన్ క్లాసుల వలన పిల్లల ప్రవర్తలో చాలా మార్పొస్తుందని.. అందుకే వాళ్లను స్కూల్ కి పంపించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆలియా చెప్పారు. దుబాయ్ లో వారి బందులు ఉన్నారని.. స్కూల్ కి సంబంధించిన అడ్మిషన్ వ్యవహారాలన్నీ వాళ్లే దగ్గరుండి చూసుకున్నారని ఆలియా అన్నారు.

పిల్లలను విదేశాల్లో చదివించాలనే ఆలోచన ఎప్పటినుండో ఉందని.. కరోనా వలన ఆ ప్లాన్ కాస్త ముందుకు జరిగిందని తెలిపారు. ప్రస్తుతం తను మాత్రమే పిల్లలను తీసుకొని దుబాయ్ కి వెళ్తున్నట్లు చెప్పారు. అప్పుడప్పుడు వర్క్ కోసం, నవాజుద్దీన్ ను కలవడం కోసం ఇండియాకు వస్తుంటానని అలియా అన్నారు. వృత్తిరీత్యా నవాజుద్ధీన్ ముంబైలోనే ఉండాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఆయన ఐదు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో మూడు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నాయి.

This post was last modified on June 14, 2021 1:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

58 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

4 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

7 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago