ప్రముఖ నటుడు నవాజుద్దీన్ ఫ్యామిలీ దుబాయ్ కి షిఫ్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. నవాజుద్ధీ భార్య ఆలియా ఇద్దరు పిల్లల్ని తీసుకొని దుబాయ్ కి వెళ్లిపోతున్నట్లు చెప్పారు. పిల్లల చదువు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి. ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదు. దీంతో అందరూ ఆన్ లైన్ క్లాసులు మొదలుపెట్టారు. ఈ పద్ధతి చాలా మంది పిల్లలపై ప్రభావం చూపుతుంది. తల్లితండ్రులకు కూడా ఆన్ లైన్ క్లాసుల వ్యవహారం నచ్చడం లేదు. కానీ చేసేదేం లేక సైలెంట్ గా ఉంటున్నారు.
అయితే కొందరు మాత్రం దీనికి ప్రత్యామ్నాయం వెతుకుతున్నారు. పిల్లలను విదేశాలకు పంపించి చదివించడానికి సిద్ధమవుతున్నారు. నవాజుద్దీన్ దంపతులు కూడా తమ పిల్లల విషయంలో ఇదే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆన్ లైన్ క్లాసుల వలన పిల్లల ప్రవర్తలో చాలా మార్పొస్తుందని.. అందుకే వాళ్లను స్కూల్ కి పంపించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆలియా చెప్పారు. దుబాయ్ లో వారి బందులు ఉన్నారని.. స్కూల్ కి సంబంధించిన అడ్మిషన్ వ్యవహారాలన్నీ వాళ్లే దగ్గరుండి చూసుకున్నారని ఆలియా అన్నారు.
పిల్లలను విదేశాల్లో చదివించాలనే ఆలోచన ఎప్పటినుండో ఉందని.. కరోనా వలన ఆ ప్లాన్ కాస్త ముందుకు జరిగిందని తెలిపారు. ప్రస్తుతం తను మాత్రమే పిల్లలను తీసుకొని దుబాయ్ కి వెళ్తున్నట్లు చెప్పారు. అప్పుడప్పుడు వర్క్ కోసం, నవాజుద్దీన్ ను కలవడం కోసం ఇండియాకు వస్తుంటానని అలియా అన్నారు. వృత్తిరీత్యా నవాజుద్ధీన్ ముంబైలోనే ఉండాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఆయన ఐదు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో మూడు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నాయి.
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…
విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శస్త్ర…