మానస రాధాకృష్ణన్ అని మలయాళంలో ఒక చిన్న స్థాయి హీరోయిన్. చూడ్డానికి అందంగా, క్యూట్గా కనిపిస్తుంది కానీ.. అక్కడ పెద్దగా సినిమాలేమీ చేసింది లేదు. చైల్డ్ ఆర్టిస్టుగా ప్రతిభ చూపించింది. స్కూలింగ్ తర్వాత దుబాయికి వెళ్లి చదువుకుని మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. కథానాయికగానే కాక క్యారెక్టర్ రోల్స్లో ఎనిమిది సినిమాలు చేసింది. ఆమె చేసినవన్నీ చిన్న, మీడియం రేంజ్ సినిమాలే. కథానాయికగా ఆమెకు పెద్ద స్థాయి ఏమీ లేదు. మానస వయసు 21 ఏళ్లు మాత్రమే.
ఇలాంటి కథానాయికను తెలుగులో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమాకు కథానాయికగా ఎంపిక చేశారనే ప్రచారం ఎప్పుడో ఏడాది కిందట మొదలైంది. కొన్ని రోజుల పాటు ఈ ప్రచారం కొంచెం గట్టిగానే సాగింది. ఐతే దర్శకుడు హరీష్ శంకర్ లైన్లోకి వచ్చి ఈ ఊహాగానాలను ఖండించాడు.
అంతటితో వ్యవహారం సద్దుమణిగినట్లే అనుకుంటే.. ఈ మధ్య మళ్లీ ఇదే ప్రచారం ఊపందుకుంది. సోషల్ మీడియాలో పవన్ హీరోయిన్ అంటూ మానస గురించి కొందరు పోస్టులు పెట్టడంతో విషయం తన వరకు వెళ్లింది. ఇక ఈ ప్రచారాన్ని తనే స్వయంగా ఖండిస్తే తప్ప ఊహాగానాలు ఆగవని ఫిక్సయి మానసే స్పందించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను తాను కూడా ఆరాధిస్తానని.. కానీ ఆయన సినిమాలో తాను నటిస్తున్నానన్న వార్త నిజం కాదని, దయచేసి ఈ ప్రచారాన్ని కట్టిపెట్టాలని ఆమె కోరింది. అటు దర్శకుడు, ఇటు హీరోయిన్ ఇద్దరూ స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికైనా మానస గురించి ప్రచారం కట్టిపెట్టేస్తే బెటర్.
మరోవైపు ఈ సినిమా టైటిల్ గురించి కూడా కొన్ని రోజులుగా తెగ వార్తలొచ్చేస్తున్నాయి. సంచారి, స్టేట్ కి ఒక్కడు లాంటి పేర్లు హల్చల్ చేశాయి. కానీ అవేవీ నిజం కాదంటూ చిత్ర బృందం ఇటీవలే క్లారిటీ ఇచ్చింది. మంచి టైం చూసి టైటిల్ అనౌన్స్ చేయాలని చూస్తోంది పీఎస్పీకే28 టీం.
This post was last modified on June 14, 2021 8:39 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…