Movie News

మహిళల్నే అలా ఎందుకు ప్రశ్నిస్తారో..

బాలీవుడ్ లో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది విద్యాబాలన్. ‘డర్టీ పిక్చర్’ లాంటి సినిమాలో తన హాట్ పెర్ఫార్మన్స్ తో షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ ‘కహానీ’, ‘మిషన్ మంగళ్’ లాంటి చిత్రాల్లో గృహిణిగా వెండితెరపై ఎంతో పద్దతిగా కనిపించింది. గతేడాది ఆమె నటించిన ‘శకుంతల దేవి’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉండగా.. తాజాగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లింగ వివక్ష గురించి విద్యాబాలన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

డిన్నర్ టైమ్ లో అందరూ తనకు వంట చేయడం రాదని.. తప్పనిసరిగా వంట నేర్చుకోమని చెప్పేవారని.. ఇక్కడ నుండే లింగ వివక్ష అనేది మొదలవుతుందని చెబుతోంది విద్యాబాలన్. ఎవరైనా తనను వంట గురించి ప్రశ్నించినప్పుడు తన భర్తకు కూడా వంట రాదని చెప్పేదాన్నని.. కానీ వాళ్లు ఒప్పుకునేవారు కాదని.. నువ్ కచ్చితంగా వంట నేర్చుకోవాల్సిందే అనేవారని తెలిపింది. ఇప్పటికీ మహిళల్నే అలా ఎందుకు ప్రశ్నిస్తారో తనకు అర్ధం కాదని అంటోంది.

నాకు తెలిసి అందరం లింగ వివక్ష ఎదుర్కొనే ఉంటామని చెప్పింది. ఆపోజిట్ సెక్స్ ఉంది మాత్రమే కాకుండా.. ఓ మహిళను మరో మహిళ ప్రశ్నించడం చూస్తే తనకు విపరీతమైన కోపం వస్తుందని చెప్పింది. లాక్ డౌన్ సమయంలో వంట చేయడానికి ప్రయత్నించానని.. కానీ వర్కవుట్ కాలేదని.. సో తన స్టాఫ్ కు సహకరించినట్లు చెప్పింది.

తన తల్లి కూడా ఇంట్లో వంట నేర్చుకోమని చెప్పేదని.. ఆమె చెప్పిన ప్రతీసారి ‘డబ్బులు సంపాదిస్తున్నా కదా.. కాబట్టి వంట మనిషిని పెట్టుకుంటా.. లేదంటే వంట తెలిసిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటా’ అని సమాధానాలు ఇచ్చేదాన్ని అంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘షేర్నీ’ అనే సినిమాలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

This post was last modified on June 13, 2021 1:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

త్రివిక్రమ్ స్టయిల్లో వెంకీ అట్లూరి

సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్‌గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…

1 hour ago

చిరు సినిమా… చేతులు మారుతుందా?

సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్‌కు…

1 hour ago

ల‌డ్డూ ఎఫెక్ట్‌: టీటీడీ ఈవో సింఘాల్‌పై చ‌ర్య‌లు

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగం వ్య‌వ‌హారం.. కీల‌క మ‌లుపు తిరిగింది. ఈ క‌ల్తీ వ్య‌వ‌హారంపై విచార‌ణ…

2 hours ago

బ‌డ్జెట్ స‌మావేశాల‌ కోసం అసెంబ్లీకి జ‌గ‌న్‌.. ?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. పార్టీ వ‌ర్గాలతో చ‌ర్చ‌లు జ‌రిపిన ఆయ‌న‌..…

5 hours ago

ఫ్యాన్స్ సంతోషం సరే… ఇది తప్పు కదా?

మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న, ఎంతగానో కోరుకున్న సందర్భం రానే వచ్చింది. ఆయనకు మనవడు పుట్టాడు. చిరంజీవి కుటుంబంలో…

5 hours ago

దురంధ‌ర్ ఇప్పుడు… పవన్ ఎప్పుడో!

దురంధ‌ర్‌.. చాలా ఏళ్ల త‌ర్వాత భార‌తీయ సినిమాలో బాలీవుడ్ త‌లెత్తుకునేలా చేసిన సినిమా. గ‌త ఏడాది ఛావా, సైయారా సినిమాలు…

8 hours ago