యన్.టి.ఆర్, రూలర్ సినిమాలతో గట్టి ఎదురు దెబ్బలు తిన్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ.. ఆ తర్వాత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుత దర్శకుల్లో తన ఫేవరెట్ అయిన బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా ద్వారా బలంగా పుంజుకునే ప్రయత్నంలో ఉన్న బాలయ్య.. దీని తర్వాత గోపీచంద్ మలినేనితో ఓ సినిమాను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. మొన్న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు కూడా.
ఐతే అదే రోజు అనిల్ రావిపూడితో బాలయ్య సినిమా గురించి కూడా అనౌన్స్మెంట్ ఉంటుందని అభిమానులు ఆశించారు. ఈ చిత్రానికి కథ కూడా ఓకే అయిపోయిందని, నిర్మాతలుగా హరీష్ పెద్ది, సాహు గారపాటి కూడా ఖరారయ్యారని మీడియాలో ఇంతకుముందు వార్తలు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారిక ప్రకటన లాంఛనమే అనుకున్నారు. కానీ బాలయ్య జన్మదినాన దీని గురించి ఏ ఊసూ లేకపోయింది. దీంతో ఈ సినిమా లేదేమో అన్న అభిప్రాయానికి వచ్చేశారందరూ.
కానీ అభిమానులు నిరాశ చెందాల్సిన పని లేకుండా బాలయ్య ఈ ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చారు. పుట్టిన రోజు నేపథ్యంలో బాలయ్య కొందరు అభిమానులతో జూమ్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ అభిమాని అనిల్ రావిపూడితో సినిమా గురించి అడిగాడు. దీనికి బాలయ్య బదులిస్తూ అతడిత సినిమా ఉంటుందని, చర్చలు జరుగుతున్నాయని చెప్పాడు. ఇంకా మంచి మంచి సినిమాలతో రాబోతున్నట్లు కూడా బాలయ్య వెల్లడించాడు.
బహుశా ఇంకా ఈ సినిమాకు కథ ఖరారు కాకపోవడం, ఎప్పుడు సినిమా మొదలుపెట్టాలన్న స్పష్టత లేకపోవడం వల్ల ఇప్పుడే ప్రకటన ఎందుకని ఊరుకుని ఉండొచ్చేమో. బాలయ్యతో సినిమా చేయడం తన కల అంటూ అనిల్ ఎప్పట్నుంచో చెబుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు టాప్ డైరెక్టర్లలో ఒకడు, పైగా తన అభిమాని అయిన అనిల్తో సినిమా చేయడానికి బాలయ్యకు అభ్యంతరం ఏముంటుంది?
This post was last modified on June 13, 2021 8:56 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…