యన్.టి.ఆర్, రూలర్ సినిమాలతో గట్టి ఎదురు దెబ్బలు తిన్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ.. ఆ తర్వాత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుత దర్శకుల్లో తన ఫేవరెట్ అయిన బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా ద్వారా బలంగా పుంజుకునే ప్రయత్నంలో ఉన్న బాలయ్య.. దీని తర్వాత గోపీచంద్ మలినేనితో ఓ సినిమాను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. మొన్న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు కూడా.
ఐతే అదే రోజు అనిల్ రావిపూడితో బాలయ్య సినిమా గురించి కూడా అనౌన్స్మెంట్ ఉంటుందని అభిమానులు ఆశించారు. ఈ చిత్రానికి కథ కూడా ఓకే అయిపోయిందని, నిర్మాతలుగా హరీష్ పెద్ది, సాహు గారపాటి కూడా ఖరారయ్యారని మీడియాలో ఇంతకుముందు వార్తలు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారిక ప్రకటన లాంఛనమే అనుకున్నారు. కానీ బాలయ్య జన్మదినాన దీని గురించి ఏ ఊసూ లేకపోయింది. దీంతో ఈ సినిమా లేదేమో అన్న అభిప్రాయానికి వచ్చేశారందరూ.
కానీ అభిమానులు నిరాశ చెందాల్సిన పని లేకుండా బాలయ్య ఈ ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చారు. పుట్టిన రోజు నేపథ్యంలో బాలయ్య కొందరు అభిమానులతో జూమ్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ అభిమాని అనిల్ రావిపూడితో సినిమా గురించి అడిగాడు. దీనికి బాలయ్య బదులిస్తూ అతడిత సినిమా ఉంటుందని, చర్చలు జరుగుతున్నాయని చెప్పాడు. ఇంకా మంచి మంచి సినిమాలతో రాబోతున్నట్లు కూడా బాలయ్య వెల్లడించాడు.
బహుశా ఇంకా ఈ సినిమాకు కథ ఖరారు కాకపోవడం, ఎప్పుడు సినిమా మొదలుపెట్టాలన్న స్పష్టత లేకపోవడం వల్ల ఇప్పుడే ప్రకటన ఎందుకని ఊరుకుని ఉండొచ్చేమో. బాలయ్యతో సినిమా చేయడం తన కల అంటూ అనిల్ ఎప్పట్నుంచో చెబుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు టాప్ డైరెక్టర్లలో ఒకడు, పైగా తన అభిమాని అయిన అనిల్తో సినిమా చేయడానికి బాలయ్యకు అభ్యంతరం ఏముంటుంది?
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…