పాన్ ఇండియా హీరోలు, హీరోయిన్లు, దర్శకుల మాదిరే.. పాన్ ఇండియా రైటర్లు కూడా కొందరున్నారు. ఆ అరుదైన జాబితాలోకే వస్తారు విజయేంద్ర ప్రసాద్. ‘బాహుబలి’, ‘భజరంగి భాయిజాన్’, ‘మణికర్ణిక’ లాంటి సినిమాలతో ఆయన పాపులారిటీ దేశవ్యాప్తమైంది. ఇప్పుడాయన హిందీలో ఒక మెగా మూవీకి పని చేస్తున్నారు. ఆ చిత్రమే.. సీత. రామాయణ గాథను సీత కోణంలో కొంచెం వైవిధ్యంగా ప్రెజెంట్ చేసే ప్రయత్నమిది. అలౌకిక్ దేశాయ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.
ఇందులో సీత పాత్రను ఆలియా భట్ లేదా కరీనా కపూర్ ఎంపికవుతారని ప్రచారం సాగింది. చివరికి కరీనానే ఓకే అయినట్లుగా చెబుతున్నారు. ఈ సినిమా కోసం ఆమె రూ.12 కోట్ల పారితోషకం డిమాండ్ చేసిందని, తన చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాకే ఈ సినిమా చేస్తానని కండిషన్ కూడా పెట్టిందని కొన్ని రోజుల కిందట మీడియాలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
ఐతే ఈ సినిమాలో కరీనా నటించే విషయంలో ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. ‘సీత’ కోసం కరీనా ఖరారైందో లేదో ఇంకా తెలియకుండానే ఆమె ఈ సినిమాలో నటించడానికి వీల్లేదంటూ సోషల్ మీడియాలో ఉద్యమం మొదలైపోయింది. ముస్లిం అయిన సైఫ్ అలీఖాన్ను పెళ్లి చేసుకోవడంతో పాటు తన కొడుక్కి మొగల్ పేరైన తైమూర్ అని పెట్టుకోవడం చాలామందికి నచ్చట్లేదు. హిందువులకు పరమ పవిత్రమైన సీత పాత్రలో ఒక ముస్లిం వ్యక్తి భార్య నటించడం తమకు ఆమోదయోగ్యం కాదని వారంటున్నారు. బాయ్కాట్ కరీనా అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
‘ఆదిపురుష్’లో రావణుడి పాత్రకు ఎంపికైన సైఫ్ అలీఖాన్ ఇంతకుముందు రావణుడి గురించి సానుకూల వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కోవడం, క్షమాపణలు చెప్పడం తెలిసిందే. ఇప్పుడు అతడి భార్య సీత పాత్ర చేయబోతోందన్న వార్త ఓ వర్గానికి మింగుడు పడటం లేదు. మరి ఆమెతోనే సీత పాత్ర చేయించాలని ‘సీత’ టీం ఫిక్సయి ఉంటే మున్ముందు ఇబ్బందులు తప్పేలా లేవు.
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…