పాన్ ఇండియా హీరోలు, హీరోయిన్లు, దర్శకుల మాదిరే.. పాన్ ఇండియా రైటర్లు కూడా కొందరున్నారు. ఆ అరుదైన జాబితాలోకే వస్తారు విజయేంద్ర ప్రసాద్. ‘బాహుబలి’, ‘భజరంగి భాయిజాన్’, ‘మణికర్ణిక’ లాంటి సినిమాలతో ఆయన పాపులారిటీ దేశవ్యాప్తమైంది. ఇప్పుడాయన హిందీలో ఒక మెగా మూవీకి పని చేస్తున్నారు. ఆ చిత్రమే.. సీత. రామాయణ గాథను సీత కోణంలో కొంచెం వైవిధ్యంగా ప్రెజెంట్ చేసే ప్రయత్నమిది. అలౌకిక్ దేశాయ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.
ఇందులో సీత పాత్రను ఆలియా భట్ లేదా కరీనా కపూర్ ఎంపికవుతారని ప్రచారం సాగింది. చివరికి కరీనానే ఓకే అయినట్లుగా చెబుతున్నారు. ఈ సినిమా కోసం ఆమె రూ.12 కోట్ల పారితోషకం డిమాండ్ చేసిందని, తన చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాకే ఈ సినిమా చేస్తానని కండిషన్ కూడా పెట్టిందని కొన్ని రోజుల కిందట మీడియాలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
ఐతే ఈ సినిమాలో కరీనా నటించే విషయంలో ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. ‘సీత’ కోసం కరీనా ఖరారైందో లేదో ఇంకా తెలియకుండానే ఆమె ఈ సినిమాలో నటించడానికి వీల్లేదంటూ సోషల్ మీడియాలో ఉద్యమం మొదలైపోయింది. ముస్లిం అయిన సైఫ్ అలీఖాన్ను పెళ్లి చేసుకోవడంతో పాటు తన కొడుక్కి మొగల్ పేరైన తైమూర్ అని పెట్టుకోవడం చాలామందికి నచ్చట్లేదు. హిందువులకు పరమ పవిత్రమైన సీత పాత్రలో ఒక ముస్లిం వ్యక్తి భార్య నటించడం తమకు ఆమోదయోగ్యం కాదని వారంటున్నారు. బాయ్కాట్ కరీనా అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
‘ఆదిపురుష్’లో రావణుడి పాత్రకు ఎంపికైన సైఫ్ అలీఖాన్ ఇంతకుముందు రావణుడి గురించి సానుకూల వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కోవడం, క్షమాపణలు చెప్పడం తెలిసిందే. ఇప్పుడు అతడి భార్య సీత పాత్ర చేయబోతోందన్న వార్త ఓ వర్గానికి మింగుడు పడటం లేదు. మరి ఆమెతోనే సీత పాత్ర చేయించాలని ‘సీత’ టీం ఫిక్సయి ఉంటే మున్ముందు ఇబ్బందులు తప్పేలా లేవు.
This post was last modified on June 12, 2021 2:08 pm
తమిళ దర్శకులకు మన తెలుగు మార్కెట్ సత్తా ఏంటో తెలుసు. అందుకే వీలైనంత టాలీవుడ్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకోవడానికి…
దురంధర్ దెబ్బకు బాలీవుడ్ స్పై మూవీస్ కి తీరని కష్టం వచ్చి పడింది. దాంతో పోల్చుకుని తమ సినిమాలను జనం ఎక్కడ…
బీఆర్ఎస్ తో బీజేపీకి చీకటి పొత్తు ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటారు. అయితే, బీజేపీతో కాంగ్రెస్ చీకటి ఒప్పందం చేసుకుందని…
కాదేది కంటెంట్ కు అనర్హం అంటారు సినీ పెద్దలు. ఇది అక్షరాలా నిజం. డిజిటల్ యుగంలో కేవలం స్టార్ ఎలివేషన్లతోనే…
సెన్సార్ వివాదం వల్ల మూడు నెలలుగా వాయిదా పర్వంలో నలిగిపోతున్న జన నాయకుడు విడుదల కోసం నిర్మాత శతవిధాలా ప్రయత్నాలు…
అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో ఓడించి భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఈ…