కరోనా సెకండ్ వేవ్ లో స్టార్ హీరోలెవరూ కూడా ఓటీటీల వైపు చూడడం లేదు. కాస్త బజ్ ఉన్న సినిమాలకు మంచి బేరం కుదిరితే ఓటీటీలో రిలీజ్ చేయడానికి చూస్తున్నారు నిర్మాతలు. ప్రస్తుతానికైతే చిన్న సినిమాలు మాత్రమే ఓటీటీలోకి వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. కొన్ని రోజులుగా అక్కినేని అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా ఓటీటీలోకి రాబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. కానీ అది నిజం కాదని.. సినిమాను థియేటర్లోనే రిలీజ్ చేస్తామంటూ చెప్పుకొచ్చారు మేకర్లు.
కానీ ఇప్పుడు సినిమాను ఓటీటీకి ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు నిర్మాత బన్నీ వాసు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఓ పాట కూడా విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంతలో కరోనా సెకండ్ వేవ్ రావడంతో రిలీజ్ ఆలస్యమైంది. అయితే ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఎదురుచూసి అప్పటికీ థియేటర్ల పరిస్థితి సెట్ కాకపోతే ఓటీటీకి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు బన్నీ వాసు చెప్పుకొచ్చారు.
ఈ సినిమాతో పాటు అఖిల్ నటిస్తోన్న మరో సినిమాకి సంబంధించి కూడా ఓటీటీ ప్రయత్నాలు జరుగుతున్నాయట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ‘ఏజెంట్’ సినిమాకు ఏదైనా ఓటీటీ సంస్థ నిర్మాణ భాగస్వామిగా చేరితే.. సదరు సంస్థకు డైరెక్ట్ రిలీజ్ కింద సినిమాను ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు ఫీలర్లు వచ్చాయి. థమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకి వక్కంతం వంశీ కథ అందించారు.
This post was last modified on June 12, 2021 9:02 am
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…
ప్రియాంకా చోప్రా మన ప్రేక్షకులకు కొత్త కాదు. హిందీ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళు, రామ్ చరణ్ జంజీర్…
నాగచైతన్యను ఇప్పటివరకు క్లాస్ లుక్లో, లవర్ బాయ్గా చూసి అలవాటు పడ్డ కళ్లకు ఈ ఫొటో ఒక్కసారిగా షాక్ ఇస్తోంది.…