కరోనా సెకండ్ వేవ్ లో స్టార్ హీరోలెవరూ కూడా ఓటీటీల వైపు చూడడం లేదు. కాస్త బజ్ ఉన్న సినిమాలకు మంచి బేరం కుదిరితే ఓటీటీలో రిలీజ్ చేయడానికి చూస్తున్నారు నిర్మాతలు. ప్రస్తుతానికైతే చిన్న సినిమాలు మాత్రమే ఓటీటీలోకి వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. కొన్ని రోజులుగా అక్కినేని అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా ఓటీటీలోకి రాబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. కానీ అది నిజం కాదని.. సినిమాను థియేటర్లోనే రిలీజ్ చేస్తామంటూ చెప్పుకొచ్చారు మేకర్లు.
కానీ ఇప్పుడు సినిమాను ఓటీటీకి ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు నిర్మాత బన్నీ వాసు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఓ పాట కూడా విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంతలో కరోనా సెకండ్ వేవ్ రావడంతో రిలీజ్ ఆలస్యమైంది. అయితే ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఎదురుచూసి అప్పటికీ థియేటర్ల పరిస్థితి సెట్ కాకపోతే ఓటీటీకి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు బన్నీ వాసు చెప్పుకొచ్చారు.
ఈ సినిమాతో పాటు అఖిల్ నటిస్తోన్న మరో సినిమాకి సంబంధించి కూడా ఓటీటీ ప్రయత్నాలు జరుగుతున్నాయట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ‘ఏజెంట్’ సినిమాకు ఏదైనా ఓటీటీ సంస్థ నిర్మాణ భాగస్వామిగా చేరితే.. సదరు సంస్థకు డైరెక్ట్ రిలీజ్ కింద సినిమాను ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు ఫీలర్లు వచ్చాయి. థమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకి వక్కంతం వంశీ కథ అందించారు.
This post was last modified on June 12, 2021 9:02 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…