అల్లు అర్జున్ కొత్త చిత్రం ‘పుష్ప’ ఒక సినిమాగా మొదలైనప్పటికీ.. ఈ మధ్య దాన్ని రెండు పార్ట్లుగా రిలీజ్ చేయాలన్న నిర్ణయానికి మేకర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దొరికిన ఖాళీలో కథను పొడిగించి.. రెండు భాగాలుగా విభజించే ప్రక్రియ నడుస్తోంది. బన్నీ వరుసగా ఈ రెండు భాగాల చిత్రీకరణలో పాల్గొంటాడన్న ఆలోచనతోనే అందరూ ఉన్నారు. కానీ బన్నీ మిత్రుడు, ‘గీతా ఆర్ట్స్’లో కీలక వ్యక్తి అయిన బన్నీ వాసు ఇప్పుడో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.
తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన వాసు.. ‘పుష్ప-1’కు, ‘పుష్ప-2’కు మధ్య వేరే సినిమా చేస్తాడని వెల్లడించాడు. ఇది కూడా ఆశ్చర్యం కలిగించకపోవచ్చు కానీ.. ఆ మధ్యలో అతను చేయబోయే సినిమా గురించి వాసు వెల్లడించిన సమాచారం మాత్రం కచ్చితంగా ఆశ్చర్యపరిచేదే.
‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ పూర్తి చేశాక, సెకండ్ పార్ట్కు ముందు బన్నీ ‘ఐకాన్’ మూవీని చేయబోతున్నాడని బన్నీ వాసు వెల్లడించాడు. ఈ లైనప్ ఫైనల్ అని, ఈ విషయంలో ఏ మార్పూ లేదని కూడా అతను స్పష్టం చేశాడు. ‘ఐకాన్’ గురించి చర్చ ఇప్పటిది కాదు. మూడేళ్ల ముందే ఈ సినిమాను ప్రకటించారు.
కానీ అది పట్టాలెక్కే సూచనలు ఎప్పుడూ కనిపించలేదు. ‘వకీల్ సాబ్’తో వేణు శ్రీరామ్ సత్తా చాటుకున్న నేపథ్యంలో ఈ సినిమా మొదలైపోతుందని అనుకున్నారు. నిర్మాత దిల్ రాజు కూడా ఆ దిశగా సంకేతాలు ఇచ్చాడు. కానీ బన్నీ వైపు నుంచి మాత్రం ఏ అప్డేట్ లేదు. అతను వేరే దర్శకులతో సంప్రదింపులు జరపడం చూస్తే ‘ఐకాన్’ చేసే ఉద్దేశంలో లేడనిపించింది.
ఆ కథను మరో హీరోతో చేయడానికి వేణు రెడీ అయినట్లు కూడా వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో బన్నీని ‘ఐకాన్’గా చూసే అవకాశాలు లేవనుకున్నారంతా. కానీ ఇప్పుడేమో బన్నీ వాసు.. ‘పుష్ప-1’ అవ్వగానే బన్నీ ‘ఐకాన్’ చేస్తాడంటున్నాడు. ఇదిలా ఉండగా.. మురుగదాస్, బోయపాటి శ్రీనులతో కూడా బన్నీ సినిమాలు చేయాల్సి ఉందని.. ఐతే ఏ సినిమా ఎఫ్పుడు ఉంటుందో చెప్పలేనని బన్నీ వాసు చెప్పాడు.
This post was last modified on June 11, 2021 1:24 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…