కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోయింది. మొన్నటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఈటల రాజేందర్ మీద సారుగుస్సా అయిపోవటం.. భూకబ్జా ఆరోపణలతో మంత్రి పదవిపై వేటు వేయటం తెలిసిందే. తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు డిసైడ్ కావటం పాత విషయమే.
ఇటీవల ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అయిన ఈటల రాజేందర్ పార్టీకి వచ్చేందుకు తన సంసిద్ధతను తెలియజేయటంతో పాటు.. తనకున్న ఇబ్బందుల్ని వారి ముందు పెట్టినట్లుగా చెబుతారు. ఈటలకు బీజేపీ అధినాయకత్వం భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
మొత్తంగా పార్టీలో చేరేందుకు సిద్ధమైన ఈటల.. అందుకు ఈ నెల 14ను ముహుర్తంగా డిసైడ్ చేసుకోవటం తెలిసిందే. తనతో పాటు మరికొందరు నేతల్ని కూడా బీజేపీలో చేర్చాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పార్టీలో చేరేందుకు ఢిల్లీకి వెళ్లనున్న ఈటల.. అందుకోసం ఎప్పటి మాదిరి కాకుండా రోటీన్ కు భిన్నంగా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
బీజేపీలో చేరే వేళ.. తనతో పాటు తన ముఖ్యమైన ఫాలోయిర్లను సైతం ఢిల్లీకి తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం ప్రత్యేక ఛార్టెడ్ ఫ్లైట్ ను బుక్ చేసినట్లుగా తెలుస్తోంది. మిగిలిన నేతలకు భిన్నంగా.. కాస్త హడావుడి ఉండేలా తన పార్టీ జాయినింగ్ పోగ్రాం ఉండాలని ఈటల భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.అందుకే చార్టెడ్ ఫ్లైట్ సిద్దం చేసినట్లు తెలుస్తోంది.
This post was last modified on June 11, 2021 1:18 pm
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…