Movie News

‘డిజిటల్’ సినిమాలకు థియేటర్ల వార్నింగ్

థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలో సినిమాలను రిలీజ్ చేసేయడాన్ని థియేటర్ల యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై విచారం వ్యక్తం చేస్తూ ఐనాక్స్, పీవీఆర్ లాంటి సంస్థలు ఇప్పటికే ప్రకటనలు విడుదల చేశాయి. ఇప్పుడు కార్నివాల్ థియేట్రికల్ ఛైన్ సంస్థ లైన్లోకి వచ్చింది. ఐతే ఐనాక్స్, పీవీఆర్‌ల తరహాలో ఆ సంస్థ ప్రస్తుత పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తం చేయలేదు.

ఆ సంస్థ సీఈవో సినిమాల డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ గురించి అసలు కంగారు పడాల్సిన పనే లేదనేశాడు. నిర్మాతలు వడ్డీల భారం తగ్గించుకోవడానికి.. నష్టాలు తగ్గించుకోవడానికి ఈ మార్గం ఎంచుకుని ఉండొచ్చని.. వాళ్లను తప్పుబట్టలేమని అతనన్నాడు. తమ సినిమాలు ఎలా రిలీజ్ చేసుకోవాలన్నది నిర్మాతల ఇష్టమని.. ఇందులో వాళ్లను నిందించడానికి ఏమీ లేదని అన్నాడు.

థియేటర్లు రిలీజయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని.. ఆ పరిస్థితులు వచ్చినపుడు విడుదల కోసం చాలా సినిమాలు ఎదురు చూస్తుంటాయని.. అన్నింటికీ థియేటర్లు కేటాయించడమే కష్టమవుతుందని.. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు ఓటీటీల్లో రిలీజైనా ఇబ్బంది లేదని అన్నాడు కార్నివాల్ సీఈవో. ఇలా మంచి మాటలన్నీ చెప్పి.. చివర్లో ఒక బాంబు పేల్చాడాయన.

ఇప్పుడు ఓటీటీల్లో రిలీజయ్యే ఏ సినిమానూ థియేటర్లలో రిలీజ్ కానివ్వమని ఆయన తేల్చేశాడు. ఇప్పుడే కాదు.. మున్ముందు కూడా ఇదే పరిస్థితి ఉంటుందన్నాడు. ఆన్ లైన్ రిలీజ్ కోసం సినిమా తీసిన వాళ్లకు థియేటర్లలో అవకాశం లేదనేశాడు. ముందు ఓటీటీల్లో రిలీజ్ చేసి.. ఆ తర్వాత థియేట్రికల్ రిలీజ్ ద్వారా కొంత డబ్బులు రాబట్టుకుందాం అనుకునేవాళ్లకు ఇది షాకే. ఈ హెచ్చరిక తర్వాత ఓటీటీల్లో నేరుగా రిలీజ్ చేయాలనుకునేవాళ్లు కొంత వెనక్కి తగ్గే అవకాశముంది.

This post was last modified on May 18, 2020 8:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పిఠాపురానికి ముంద‌స్తు సంక్రాంతి!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గానికి సంక్రాంతి పండుగ ముందుగానే వ‌చ్చింది. శుక్ర‌వారం నుంచి…

3 hours ago

మగాళ్లను కుక్కలతో పోల్చిన నటి

కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…

9 hours ago

`పీపీపీ`కి కేంద్రం అండ‌… బాబుకు భ‌రోసా… !

ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…

11 hours ago

మిథున్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయ్.. హాట్ టాపిక్..!

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…

12 hours ago

లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…

15 hours ago

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

16 hours ago