థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలో సినిమాలను రిలీజ్ చేసేయడాన్ని థియేటర్ల యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై విచారం వ్యక్తం చేస్తూ ఐనాక్స్, పీవీఆర్ లాంటి సంస్థలు ఇప్పటికే ప్రకటనలు విడుదల చేశాయి. ఇప్పుడు కార్నివాల్ థియేట్రికల్ ఛైన్ సంస్థ లైన్లోకి వచ్చింది. ఐతే ఐనాక్స్, పీవీఆర్ల తరహాలో ఆ సంస్థ ప్రస్తుత పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తం చేయలేదు.
ఆ సంస్థ సీఈవో సినిమాల డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ గురించి అసలు కంగారు పడాల్సిన పనే లేదనేశాడు. నిర్మాతలు వడ్డీల భారం తగ్గించుకోవడానికి.. నష్టాలు తగ్గించుకోవడానికి ఈ మార్గం ఎంచుకుని ఉండొచ్చని.. వాళ్లను తప్పుబట్టలేమని అతనన్నాడు. తమ సినిమాలు ఎలా రిలీజ్ చేసుకోవాలన్నది నిర్మాతల ఇష్టమని.. ఇందులో వాళ్లను నిందించడానికి ఏమీ లేదని అన్నాడు.
థియేటర్లు రిలీజయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని.. ఆ పరిస్థితులు వచ్చినపుడు విడుదల కోసం చాలా సినిమాలు ఎదురు చూస్తుంటాయని.. అన్నింటికీ థియేటర్లు కేటాయించడమే కష్టమవుతుందని.. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు ఓటీటీల్లో రిలీజైనా ఇబ్బంది లేదని అన్నాడు కార్నివాల్ సీఈవో. ఇలా మంచి మాటలన్నీ చెప్పి.. చివర్లో ఒక బాంబు పేల్చాడాయన.
ఇప్పుడు ఓటీటీల్లో రిలీజయ్యే ఏ సినిమానూ థియేటర్లలో రిలీజ్ కానివ్వమని ఆయన తేల్చేశాడు. ఇప్పుడే కాదు.. మున్ముందు కూడా ఇదే పరిస్థితి ఉంటుందన్నాడు. ఆన్ లైన్ రిలీజ్ కోసం సినిమా తీసిన వాళ్లకు థియేటర్లలో అవకాశం లేదనేశాడు. ముందు ఓటీటీల్లో రిలీజ్ చేసి.. ఆ తర్వాత థియేట్రికల్ రిలీజ్ ద్వారా కొంత డబ్బులు రాబట్టుకుందాం అనుకునేవాళ్లకు ఇది షాకే. ఈ హెచ్చరిక తర్వాత ఓటీటీల్లో నేరుగా రిలీజ్ చేయాలనుకునేవాళ్లు కొంత వెనక్కి తగ్గే అవకాశముంది.
హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…