Movie News

‘డిజిటల్’ సినిమాలకు థియేటర్ల వార్నింగ్

థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలో సినిమాలను రిలీజ్ చేసేయడాన్ని థియేటర్ల యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై విచారం వ్యక్తం చేస్తూ ఐనాక్స్, పీవీఆర్ లాంటి సంస్థలు ఇప్పటికే ప్రకటనలు విడుదల చేశాయి. ఇప్పుడు కార్నివాల్ థియేట్రికల్ ఛైన్ సంస్థ లైన్లోకి వచ్చింది. ఐతే ఐనాక్స్, పీవీఆర్‌ల తరహాలో ఆ సంస్థ ప్రస్తుత పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తం చేయలేదు.

ఆ సంస్థ సీఈవో సినిమాల డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ గురించి అసలు కంగారు పడాల్సిన పనే లేదనేశాడు. నిర్మాతలు వడ్డీల భారం తగ్గించుకోవడానికి.. నష్టాలు తగ్గించుకోవడానికి ఈ మార్గం ఎంచుకుని ఉండొచ్చని.. వాళ్లను తప్పుబట్టలేమని అతనన్నాడు. తమ సినిమాలు ఎలా రిలీజ్ చేసుకోవాలన్నది నిర్మాతల ఇష్టమని.. ఇందులో వాళ్లను నిందించడానికి ఏమీ లేదని అన్నాడు.

థియేటర్లు రిలీజయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని.. ఆ పరిస్థితులు వచ్చినపుడు విడుదల కోసం చాలా సినిమాలు ఎదురు చూస్తుంటాయని.. అన్నింటికీ థియేటర్లు కేటాయించడమే కష్టమవుతుందని.. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు ఓటీటీల్లో రిలీజైనా ఇబ్బంది లేదని అన్నాడు కార్నివాల్ సీఈవో. ఇలా మంచి మాటలన్నీ చెప్పి.. చివర్లో ఒక బాంబు పేల్చాడాయన.

ఇప్పుడు ఓటీటీల్లో రిలీజయ్యే ఏ సినిమానూ థియేటర్లలో రిలీజ్ కానివ్వమని ఆయన తేల్చేశాడు. ఇప్పుడే కాదు.. మున్ముందు కూడా ఇదే పరిస్థితి ఉంటుందన్నాడు. ఆన్ లైన్ రిలీజ్ కోసం సినిమా తీసిన వాళ్లకు థియేటర్లలో అవకాశం లేదనేశాడు. ముందు ఓటీటీల్లో రిలీజ్ చేసి.. ఆ తర్వాత థియేట్రికల్ రిలీజ్ ద్వారా కొంత డబ్బులు రాబట్టుకుందాం అనుకునేవాళ్లకు ఇది షాకే. ఈ హెచ్చరిక తర్వాత ఓటీటీల్లో నేరుగా రిలీజ్ చేయాలనుకునేవాళ్లు కొంత వెనక్కి తగ్గే అవకాశముంది.

Satya

Recent Posts

ప్రశ్న రావణ్ విషయంలో చేతులెత్తేసిన జడ శ్రావణ్?

ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…

2 hours ago

ట్రంప్ తిప్పలు… వీడియో కాల్ లో నిశ్చితార్థం

అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…

2 hours ago

విహార యాత్రలో విషాదం… 15 మంది భారతీయులు మృతి

విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…

3 hours ago

పవన్ ఏళ్ల గాయానికి గంటల తరబడి ఆపరేషన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శస్త్ర…

4 hours ago

స్టేజీపై ఏడ్చేసిన భాగ్యశ్రీ బోర్సే

ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం ఒకెత్తయితే.. విజయాలు సాధించడం మరో ఎత్తు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం అయ్యేలా సక్సెస్ సాధించకపోతే…

4 hours ago

ఢమాల్ అన్నారు… అయినా వసూళ్లు ఇస్తున్నారు

బాలీవుడ్ లో కొంత కాలంగా విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. రొటీన్ కథలు, సిల్లీ కాన్సెప్ట్స్ తో సినిమాలు వస్తుంటాయి. క్రిటిక్స్…

5 hours ago