ఓటీటీల హవా పెరగడంతో ఇప్పటికే చాలా మంది స్టార్లు డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా డిజిటల్ డెబ్యూకి సిద్ధంగా ఉన్నారని సమాచారం. గతంలో మహేష్ బాబుని ఇదే విషయంపై ప్రశ్నించినప్పుడు ‘మంచి స్టోరీ దొరకాలి కదా!’ అంటూ బదులిచ్చారు. ఇప్పుడు ఆయన స్టాండర్డ్స్ కి తగ్గట్లుగా స్టోరీ దొరికిందని సమాచారం. కాబట్టి త్వరలోనే ఈ సూపర్ స్టార్ ను ఓటీటీలో చూసే ఛాన్స్ ఉందని టాక్. అసలు విషయంలోకి వెళ్తే.. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తో సూపర్ పాపులారిటీ దక్కించుకున్న దర్శకద్వయం రాజ్ అండ్ డీకే ఇటీవల మహేష్ బాబుని కలిసినట్లు తెలుస్తోంది.
తాము తెరకెక్కించబోయే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 లో మహేష్ బాబుని తీసుకోవాలని రాజ్ అండ్ డీకే ప్లాన్ చేస్తున్నారని సమాచారం. సీజన్ 1లో సందీప్ కిషన్ క్యామియో రోల్ లో కనిపించగా.. సీజన్ 2లో సమంతను కీలకపాత్ర కోసం ఎంపిక చేసుకున్నారు. సమంతని తీసుకోవడం వలన సౌత్ లో ఈ సిరీస్ పై మంచి బజ్ క్రియేట్ అయింది. అదే విధంగా సీజన్ 3లో మహేష్ బాబుని తీసుకునే విధంగా సన్నాహాలు చేస్తున్నారట. పది, పదిహేను రోజులు ఆయన కాల్షీట్స్ ఇస్తే సరిపోతుందట. దీనికోసం మహేష్ కు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారట.
మహేష్ ఒక సినిమాకి తీసుకునే మొత్తంలో సగం రెమ్యునరేషన్ ఇవ్వడానికి ముందుకొచ్చారట ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్. ఈ సిరీస్ లో నటించడం వలన తను ఒప్పుకున్న సినిమాల డేట్స్ విషయంలో పెద్దగా ఇబ్బందులు రాకపోవచ్చని మహేష్ భావిస్తున్నారట. సినిమాల షూటింగ్ మధ్యలో కొన్ని రోజులు ముంబైకి వెళ్లి షూటింగ్ పూర్తి చేయొచ్చనేది మహేష్ ప్లాన్. రాజ్ అండ్ డీకే గనుక మహేష్ రోల్ ను ఇంప్రెసివ్ గా డిజైన్ చేయగలిగితే ఆయన సీజన్ 3 లో కనిపించడం ఖాయమని చెబుతున్నారు.
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…