Movie News

సుశాంత్ మాత్రమే కాదు.. ఆమె కూడా

గత ఏడాది ఇదే సమయానికి అనూహ్యంగా ప్రాణాలు వదిలాడు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. ఐతే బతికున్నప్పటి కంటే చనిపోయాక సుశాంత్‌కు అభిమానగణం బాగా పెరిగింది. అతడి పట్ల సానుభూతితో, అలాగే తన గురించి కొత్తగా తెలిసిన విషయాలతో అభిమానం మరింత పెంచుకున్నారు జనాలు. ఈ అభిమానమే ఇటీవల కూడా చూపించారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ప్రకటించే వార్షిక మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టులో జాతీయ స్థాయిలో అతడికే అగ్రస్థానం దక్కింది. ఇదేమంత ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు. కానీ సుశాంత్ చనిపోవడానికి ముందు అతడి ప్రేయసిగా ఉన్న రియా చక్రవర్తికి టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్టులో అగ్ర స్థానం దక్కడమే అందరికీ షాకిస్తున్న విషయం. 2020కి ప్రకటించిన టాప్-50 జాబితాలో రియానే నంబర్ వన్‌గా నిలిచింది.

రియా పేరు గత ఏడాది కాలంలో ఎంతో చర్చనీయాంశంగా మారిన మాట వాస్తవం. ఆమె కొన్ని నెలల పాటు వార్తల్లో నిలిచింది. కానీ అదంతా నెగెటివ్‌‌గానే. సుశాంత్ మృతికి పరోక్షంగా రియానే కారణం అన్న ఆరోపణలు, విమర్శలు వినిపించాయి. సుశాంత్‌కు ఆమె డ్రగ్స్ అలవాటు చేసిందని, అతడి డబ్బులు కొట్టేసిందని, అతను డిప్రెషన్లోకి వెళ్లడానికి తనే కారణమని.. ఇలా అనేక ఆరోపణలు వచ్చాయి. సుశాంత్ మృతి కేసులో చాలా రోజుల పాటు ఆమె రిమాండులో ఉంది. బెయిల్ మీద బయటికి వచ్చిన రియా.. ఇప్పటికీ ఈ కేసు నుంచి బయటపడలేదు. మరి ఇలా నెగెటివ్‌గా మీడియాలో ప్రొజెక్ట్ అయిన రియా.. మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్టులో అగ్రస్థానంలో

ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. దీనిపై సోషల్ మీడియా జనాలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ జాబితాలో అర్లీన్ కాస్టలినో రెండో స్థానం సాధించగా.. దిశా పఠాని, కియారా అద్వానీ, దీపికా పదుకొనే, కత్రినా కైఫ్ వరుసగా 3, 4, 5, 6 స్థానాల్లో నిలిచారు.

This post was last modified on June 8, 2021 5:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

29 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago