కరోనా వైరస్కు సంబంధించి అవగాహన పెంచడానికి ఇటు ప్రభుత్వాలకు తోడు అటు స్వచ్ఛంద సంస్థలు ఏడాది కిందట్నుంచి గట్టి ప్రయత్నమే చేస్తున్నాయి. అలాగే సెలబ్రెటీలు సైతం తమ వంతుగా చేయాల్సింది చేస్తూనే ఉన్నారు. కానీ వైరస్ నియంత్రణలో అత్యంత ముఖ్యమైంది అయిన మాస్క్ విషయంలో జనాలు వ్యవహరించే తీరు చికాకు తెప్పిస్తుంటుంది.
బాగా చదువుకున్న వాళ్లు, అన్నీ తెలిసిన వాళ్లు కూడా మాస్క్ వినియోగంలో తప్పటడుగులు వేస్తుంటారు. సరిగ్గా మాస్క్ ధరించకపోవడం వల్ల వైరస్ వ్యాప్తికి కారణమవుతుంటారు. దీనిపై నేరుగా ఉపదేశిస్తే జనాలకు ఎక్కదు కాబట్టి కొంచెం బిన్నంగా, వ్యంగ్యంగా మాస్క్ ధరించడంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు తమిళ, తెలుగు సినీ నటులు. కొంత కాలంగా వ్యాక్సినేషన్ సహా వివిధ అంశాలపై తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ వీడియోలు చేస్తోంది.
ఈ క్రమంలోనే మాస్క్ ఎలా ధరించాలనే విషయంలో ఆమె ఒక సెటైరికల్ వీడియో చేసింది. ఇందులో సందీప్ కిషన్, రెజీనా కసాండ్రా, యోగిబాబు తదితరులను భాగస్వాముల్ని చేసింది. మాస్క్ ఎలా ధరించకూడదో ఉదాహరణ పూర్వకంగా ఒక్కొక్కరు అందులో చూపిస్తారు. బయట జనాల్ని పరిశీలిస్తే కొందరు అంత వరకు మాస్క్ వేసుకుని ఉండి ఎదుటి వ్యక్తితో మాట్లాడాలనుకున్నపుడు మాస్క్ తీసేస్తారు. కొందరేమో మాస్క్ ఎప్పుడూ గడ్డం కిందే పెడతారు. కొందరు ముక్కును కవర్ చేయరు.
ఈ ఉదాహరణలకు తోడు ‘ఐ మాస్క్’ అంటూ ఒకరు కళ్లకు మాస్క్ వేసుకుంటే.. ఇంకొకరు ‘హెయిర్ బ్యాండ్ మాస్క్’ నుదుటికి మాస్క్ పెట్టుకున్నారు. ఇలా మాస్క్ ఎలా ధరించకూడదో సెటైరికల్గా చూపించి.. చివర్లో వరలక్ష్మి మాస్క్ ధరించడం ఎలాగో చూపించింది. కొంచెం సరదాగా, వ్యంగ్యంగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో బాగానే హల్చల్ చేస్తోంది. జనాల్లో చురుకుదనం పుట్టాలంటే ఇలాంటి వీడియోలే కరెక్ట్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…