కరోనా వైరస్కు సంబంధించి అవగాహన పెంచడానికి ఇటు ప్రభుత్వాలకు తోడు అటు స్వచ్ఛంద సంస్థలు ఏడాది కిందట్నుంచి గట్టి ప్రయత్నమే చేస్తున్నాయి. అలాగే సెలబ్రెటీలు సైతం తమ వంతుగా చేయాల్సింది చేస్తూనే ఉన్నారు. కానీ వైరస్ నియంత్రణలో అత్యంత ముఖ్యమైంది అయిన మాస్క్ విషయంలో జనాలు వ్యవహరించే తీరు చికాకు తెప్పిస్తుంటుంది.
బాగా చదువుకున్న వాళ్లు, అన్నీ తెలిసిన వాళ్లు కూడా మాస్క్ వినియోగంలో తప్పటడుగులు వేస్తుంటారు. సరిగ్గా మాస్క్ ధరించకపోవడం వల్ల వైరస్ వ్యాప్తికి కారణమవుతుంటారు. దీనిపై నేరుగా ఉపదేశిస్తే జనాలకు ఎక్కదు కాబట్టి కొంచెం బిన్నంగా, వ్యంగ్యంగా మాస్క్ ధరించడంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు తమిళ, తెలుగు సినీ నటులు. కొంత కాలంగా వ్యాక్సినేషన్ సహా వివిధ అంశాలపై తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ వీడియోలు చేస్తోంది.
ఈ క్రమంలోనే మాస్క్ ఎలా ధరించాలనే విషయంలో ఆమె ఒక సెటైరికల్ వీడియో చేసింది. ఇందులో సందీప్ కిషన్, రెజీనా కసాండ్రా, యోగిబాబు తదితరులను భాగస్వాముల్ని చేసింది. మాస్క్ ఎలా ధరించకూడదో ఉదాహరణ పూర్వకంగా ఒక్కొక్కరు అందులో చూపిస్తారు. బయట జనాల్ని పరిశీలిస్తే కొందరు అంత వరకు మాస్క్ వేసుకుని ఉండి ఎదుటి వ్యక్తితో మాట్లాడాలనుకున్నపుడు మాస్క్ తీసేస్తారు. కొందరేమో మాస్క్ ఎప్పుడూ గడ్డం కిందే పెడతారు. కొందరు ముక్కును కవర్ చేయరు.
ఈ ఉదాహరణలకు తోడు ‘ఐ మాస్క్’ అంటూ ఒకరు కళ్లకు మాస్క్ వేసుకుంటే.. ఇంకొకరు ‘హెయిర్ బ్యాండ్ మాస్క్’ నుదుటికి మాస్క్ పెట్టుకున్నారు. ఇలా మాస్క్ ఎలా ధరించకూడదో సెటైరికల్గా చూపించి.. చివర్లో వరలక్ష్మి మాస్క్ ధరించడం ఎలాగో చూపించింది. కొంచెం సరదాగా, వ్యంగ్యంగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో బాగానే హల్చల్ చేస్తోంది. జనాల్లో చురుకుదనం పుట్టాలంటే ఇలాంటి వీడియోలే కరెక్ట్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on June 8, 2021 7:18 am
స్టార్ హీరోలు నటించిన ప్యాన్ ఇండియా సినిమాలకు శాటిలైట్ ప్రీమియర్లు భారీ స్థాయిలో స్పందన తెచ్చుకుంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం…
గ్యారెంటీ కామెడీ ఉంటుందని అల్లరి నరేష్ సినిమాలకు పేరు. కానీ గత కొన్నేళ్లుగా ఈ జానర్ కు ఆదరణ తగ్గడం,…
లోకనాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కిన భారతీయుడు 2 విడుదల జూన్ 13 ఉంటుందని మీడియా మొత్తం…
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డికేసులో తాజాగా సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-8గా ఉన్న…
లోక్ సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 2019…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్తితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న…