టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని సమంత ఇప్పుడు వెబ్ సిరీస్ లతో బిజీ అవుతోంది. ఆమె నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ కి భారీ రెస్పాన్స్ వస్తుండడంతో పాటు.. సమంత పెర్ఫార్మన్స్ ను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు నెటిజన్లు. ఈ సిరీస్ తో ఆమెకి నేషనల్ వైడ్ గా క్రేజ్ ఏర్పడింది. దీంతో ప్రముఖ ఓటీటీ సంస్థలన్నీ కూడా సమంత డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లాంటి పేరున్న సంస్థ సమంతను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆమె ఒప్పుకుంటే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సిరీస్ చేయాలని ప్లాన్ చేస్తుంది. నిజానికి నెట్ ఫ్లిక్స్ లో ఇప్పటివరకు తెలుగుకి సంబంధించి సరైన సిరీస్ ఒక్కటి కూడా రాలేదు. దీంతో సదరు సంస్థ కూడా పాపులర్ యాక్టర్స్ కోసం చూస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ 2తో సమంతకు వస్తోన్న క్రేజ్ చూసి వెంటనే ఆమెతో ఓ వెబ్ డ్రామాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తోంది.
నెట్ ఫ్లిక్స్ తో పాటు హాట్ స్టార్ లాంటి సంస్థల దృష్టి కూడా సమంతపై పడిందని సమాచారం. నిజానికి సమంత గతంలో ‘ఆహా’ షోతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది కానీ ఆ షో వర్కవుట్ అవ్వలేదు. కానీ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2తో అమ్మడు క్రేజ్ పెరిగిపోయింది. కాజల్, తమన్నా లాంటి వాళ్లు డిజిటల్ హిట్ కోసం పరితపిస్తుంటే సమంత మాత్రం ఒక్క సిరీస్ తో అందరినీ దాటేసి ముందుకు దూసుకెళ్తోంది. ప్రస్తుతం సమంత.. గుణశేఖర్ రూపొందిస్తోన్న ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తోంది. ఓ పక్క సినిమాలు, మరోపక్క సిరీస్ లతో సమంత చాలా బిజీగా గడుపుతోంది.
This post was last modified on June 7, 2021 2:29 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…